తెదేపా అధినేత చంద్రబాబుకు భద్రత కుదింపుపై దాఖలైన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు, తుది తీర్పు వెలువరిచింది. మొత్తం 97 మంది భద్రతా సిబ్బందిని కొనసాగించాలని ఆదేశాలు జారీచేసింది. కేంద్రం కల్పిస్తున్న ఎన్ఎస్జీ భద్రతలో ఎలాంటి మార్పు లేకపోయినప్పటకీ.. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతను తగ్గించింది. ఇద్దరు సీఎస్వోలకు బదులు ఒకరినే ఇచ్చారని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. చంద్రబాబు కాన్వాయ్లో జామర్ వాహనం కూడా ఏర్పాటుచేయలేదని కోర్టుకు నివేదించారు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం బుధవారం తీర్పునిచ్చింది. చంద్రబాబు మొత్తం 97 మంది భద్రతాసిబ్బందిని కొనసాగించాలని ఆదేశించింది. క్లోజ్డ్ సెక్యూరిటీ ఎవరి విధి అనేదానిపై ఎన్ఎస్జీ, స్టేట్ సెక్యూరిటీ మధ్య అభిప్రాయ భేదాలున్నాయన్న కోర్టు.. మూడు నెలల్లో ఓ నిర్ణయానికి రావాలని ఆ సంస్థలను ఆదేశించింది. చంద్రబాబు కాన్వాయ్లో జామర్ వాహనం కల్పించాలని ఆదేశించిన కోర్టు.. చంద్రబాబు భద్రత విషయమై సీఎస్వోను ప్రభుత్వం నియమించవచ్చని తెలిపింది.
ఇదీ చదవండి :