ETV Bharat / city

ఖైదీలకు చికిత్స అందకపోవడంపై కనీసం రెండు ఉదాహరణలు చూపాలి:హైకోర్టు - ఖైదీలకు చికిత్స అందకపోవడంపై హైకోర్టు

కారాగారాల్లో ఉన్న ఖైదీలకు కరోనా చికిత్స సక్రమంగా అందడం లేదనేందుకు కనీసం రెండు ఉదాహరణలు చూపాలని పిటిషనర్‌ను హైకోర్టు కోరింది. ఆ మేరకు అఫిడవిట్ దాఖలు చేయాలని సూచిస్తూ విచారణను సెప్టెంబర్ 1 కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి ప్రవీణ్ కుమార్ , జస్టిస్ జె ఉమాదేవితో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.

hc on corona
hc on corona
author img

By

Published : Aug 27, 2020, 7:32 AM IST

రాష్ట్రంలోని కారాగారాల్లోని ఖైదీలు కరోనా బారినపడకుండా తగిన చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశించాలని.. కరోనా బాధితులకు తగిన చికిత్స అందించాలని కోరుతూ న్యాయవాది జీవీ రవీంద్రకుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. తాజాగా జరిగిన విచారణలో పిటిషనర్, ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. సరైన చికిత్స అందించడం లేదని పిటిషనర్, అందిస్తున్నామని జీపీ చెబుతున్న క్రమంలో చికిత్స అందడం లేదనేందుకు రెండు ఉదాహణలను తమ ముందు ఉంచాలని పిటిషనర్‌కు స్పష్టంచేసింది. ఆ మేరకు అఫిడవిట్ దాఖలు చేయాలని సూచిస్తూ విచారణను సెప్టెంబర్ 1 కి వాయిదా వేసింది.

రాష్ట్రంలోని కారాగారాల్లోని ఖైదీలు కరోనా బారినపడకుండా తగిన చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశించాలని.. కరోనా బాధితులకు తగిన చికిత్స అందించాలని కోరుతూ న్యాయవాది జీవీ రవీంద్రకుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. తాజాగా జరిగిన విచారణలో పిటిషనర్, ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. సరైన చికిత్స అందించడం లేదని పిటిషనర్, అందిస్తున్నామని జీపీ చెబుతున్న క్రమంలో చికిత్స అందడం లేదనేందుకు రెండు ఉదాహణలను తమ ముందు ఉంచాలని పిటిషనర్‌కు స్పష్టంచేసింది. ఆ మేరకు అఫిడవిట్ దాఖలు చేయాలని సూచిస్తూ విచారణను సెప్టెంబర్ 1 కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి: సీబీఐ అధికారులపై మహిళా ఎస్సై గూఢచర్యం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.