ETV Bharat / city

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి.. మృతుల్లో ఇద్దరు చిన్నారులు

author img

By

Published : Aug 10, 2022, 8:06 AM IST

Updated : Aug 10, 2022, 9:25 AM IST

accident
ఘోర రోడ్డు ప్రమాదం

08:05 August 10

హైదరాబాద్‌ నుంచి నిర్మల్‌కు వెళ్తుండగా ఘటన

ఘోర రోడ్డు ప్రమాదం

accident: హైదరాబాద్‌ నుంచి నిర్మల్‌ వైపు వెళ్తున్న ఓ కారు టైరు పేలడంతో అదుపుతప్పి బోల్తాపడింది. తెలంగాణ నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్ బైపాస్‌ కొత్తపల్లి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

తీవ్ర గాయాలపాలైన మరో ముగ్గురిని ఆర్మూర్‌ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలోనూ ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కారులో ప్రయాణిస్తున్న వారు హైదరాబాద్‌లోని టోలిచౌకి వాసులుగా భావిస్తున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న ముప్కాల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

08:05 August 10

హైదరాబాద్‌ నుంచి నిర్మల్‌కు వెళ్తుండగా ఘటన

ఘోర రోడ్డు ప్రమాదం

accident: హైదరాబాద్‌ నుంచి నిర్మల్‌ వైపు వెళ్తున్న ఓ కారు టైరు పేలడంతో అదుపుతప్పి బోల్తాపడింది. తెలంగాణ నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్ బైపాస్‌ కొత్తపల్లి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

తీవ్ర గాయాలపాలైన మరో ముగ్గురిని ఆర్మూర్‌ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలోనూ ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కారులో ప్రయాణిస్తున్న వారు హైదరాబాద్‌లోని టోలిచౌకి వాసులుగా భావిస్తున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న ముప్కాల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Aug 10, 2022, 9:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.