ETV Bharat / city

అమరావతికి ఐదేళ్లు... ఐకాస ప్రత్యేక కార్యాచరణ - Amaravathi farmers protest news

అమరావతి నిర్మాణానికి శంకుస్థాపనకు రేపటితో ఐదేళ్లు నిండుతున్న సందర్భంగా... రాజధాని రైతులు, మహిళలు, కూలీలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రధానిని అర్థిస్తూ అమరావతి చూపు-మోదీ వైపు పేరుతో వినూత్న ప్రదర్శన నిర్వహించనున్నారు. రేపు రాత్రి దీక్షా శిబిరాల వద్ద అమరావతి వెలుగు పేరుతో కాగడాల ప్రదర్శన చేపట్టనున్నారు.

Five years completed for Amaravati Foundation
అమరావతికి ఐదేళ్లు... ఐకాస ప్రత్యేక కార్యాచరణ
author img

By

Published : Oct 21, 2020, 11:04 PM IST

రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపనకు రేపటితో ఐదేళ్లు నిండుతున్న సందర్భంగా... రాజధాని రైతులు, మహిళలు, కూలీలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రధాని చేతులమీదుగా శంకుస్థాపన జరిగిన ఘట్టాన్ని గుర్తు చేస్తూ.. మోదీ ప్రభుత్వం అమరావతిని కాపాడాలంటూ పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ మేరకు రాజధాని రైతుల ఐకాస, అమరావతి పరిరక్షణ సమితి ప్రత్యేక కార్యాచరణకు పిలుపునిచ్చాయి. అమరావతి ప్రస్తుత దుస్థితిని కళ్లకు కడుతూ శంకుస్థాపన జరిగిన పుణ్యస్థలి వద్ద రాజధాని అమరావతి-నాటి వైభవం-నేటి దుస్థితి పేరుతో నిరసన తెలపనున్నారు.

అమరావతిని కాపాడాలంటూ కేంద్రాన్ని అర్థిస్తూ రైతులు, మహిళల వేడుకోలు నిర్వహించనున్నారు. తుళ్లూరు మండలం రాయపూడి, మందడం, గుంటూరు నుంచి పుణ్యస్థలికి పాదయాత్ర నిర్వహించనున్నారు. ఉద్ధండరాయునిపాలెంలో సర్వమత ప్రార్ధనల తర్వాత... ప్రధానిని అర్థిస్తూ అమరావతి చూపు-మోదీ వైపు పేరుతో వినూత్న ప్రదర్శన నిర్వహించనున్నారు. రేపు రాత్రి దీక్షా శిబిరాల వద్ద అమరావతి వెలుగు పేరుతో కాగడాల ప్రదర్శన చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేవారు కొవిడ్ నిబంధనలు పాటించాలని ఐకాస పిలుపునిచ్చింది.

రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపనకు రేపటితో ఐదేళ్లు నిండుతున్న సందర్భంగా... రాజధాని రైతులు, మహిళలు, కూలీలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రధాని చేతులమీదుగా శంకుస్థాపన జరిగిన ఘట్టాన్ని గుర్తు చేస్తూ.. మోదీ ప్రభుత్వం అమరావతిని కాపాడాలంటూ పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ మేరకు రాజధాని రైతుల ఐకాస, అమరావతి పరిరక్షణ సమితి ప్రత్యేక కార్యాచరణకు పిలుపునిచ్చాయి. అమరావతి ప్రస్తుత దుస్థితిని కళ్లకు కడుతూ శంకుస్థాపన జరిగిన పుణ్యస్థలి వద్ద రాజధాని అమరావతి-నాటి వైభవం-నేటి దుస్థితి పేరుతో నిరసన తెలపనున్నారు.

అమరావతిని కాపాడాలంటూ కేంద్రాన్ని అర్థిస్తూ రైతులు, మహిళల వేడుకోలు నిర్వహించనున్నారు. తుళ్లూరు మండలం రాయపూడి, మందడం, గుంటూరు నుంచి పుణ్యస్థలికి పాదయాత్ర నిర్వహించనున్నారు. ఉద్ధండరాయునిపాలెంలో సర్వమత ప్రార్ధనల తర్వాత... ప్రధానిని అర్థిస్తూ అమరావతి చూపు-మోదీ వైపు పేరుతో వినూత్న ప్రదర్శన నిర్వహించనున్నారు. రేపు రాత్రి దీక్షా శిబిరాల వద్ద అమరావతి వెలుగు పేరుతో కాగడాల ప్రదర్శన చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేవారు కొవిడ్ నిబంధనలు పాటించాలని ఐకాస పిలుపునిచ్చింది.

ఇదీ చదవండి:

ప్రమాదం పొంచి ఉందని తెలిసినా నిర్లక్ష్యం వీడరా..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.