ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 Am

author img

By

Published : Jun 16, 2020, 8:57 AM IST

.

9am top news
9Am ప్రధాన వార్తలు
  • నవ రత్నాలకే ప్రాధాన్యం

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్​లో సంక్షేమ పథకాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వనుంది. మొత్తం 2.30 లక్షల కోట్ల అంచనాతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​రెడ్డి బడ్జెట్​ను శాసనసభకు సమర్పించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రైతుకు పెద్ద పీట

బడ్జెట్​లో రైతులు, నిరుపేదల సంక్షేమం, విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. నవరత్నాల అమలుతో పేదల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు సామాజిక ఆర్థిక సర్వేలో తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కక్షతోనే ఇరికించారు

అనిశా కేసులో బెయిల్ మంజూరు కోరుతూ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విజయవాడ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు. తన అరెస్టు చట్టవిరుద్ధమని.. అయినా విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ధనలక్ష్మిదే కీలకపాత్ర

ఆమె ఓ సాధారణ ఫార్మసిస్టు.. కానీ వందల కోట్ల రూపాయల మందుల కొనుగోళ్ల వ్యవహారంలో కీలక పాత్రధారి. డిస్పెన్సరీలకు ఔషధాల నుంచి కొనుగోళ్ల వరకు జరిగిన అవినీతిలో చక్రం తిప్పినది ధనలక్ష్మి అని అనిశా తేల్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కశ్మీర్​లో ముగ్గురు ముష్కరుల హతం

జమ్ముకశ్మీర్ షోపియాన్ జిల్లాలో పోలీసులు, ఉగ్రవాదుల మధ్య ఎన్​కౌంటర్ జరిగింది. ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • బాధ్యత నేపాల్​దే

భారత్​తో చర్చలకు అనుకూల వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత నేపాల్ ప్రధాని కె.పి.శర్మ ఓలి పైనే ఉందని పేర్కొంది కేంద్రం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నెలాఖరుకు కరోనా బాధితులకు ఉపశమనం?

కరోనా ఆందోళనలతో భయపడుతూ బతుకుతున్న ప్రజలు, వైరస్ బాధితులకు ఉపశమనం కలిగించేలా.. రెమ్​డెసివిర్ ఔషధం దేశీయ విపణిలోకి జూన్ నెలాఖరుకల్లా రానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • హైడ్రాక్సీ వినియోగం నిలిపేసిన అమెరికా

కరోనా చికిత్సగా ఉపయోగిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్​(హెచ్​సీక్యూ), క్లోరోక్విన్(సీక్యూ)​ను అత్యవసర వినియోగం నుంచి ఉపసంహరించింది అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్​డీఐ. వైరస్​పై సమర్థంగా పోరాడలేవన్న కారణంతో వాటిపై ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఐపీఎల్​ను దేశంలోనే నిర్వహించాలి

ఐపీఎల్​ను పూర్తిగా స్వదేశంలోనే నిర్వహించాలని ఫ్రాంచైజీలు పట్టుబడుతున్నాయి. టోర్నీని విదేశాల్లో నిర్వహిస్తారని వస్తున్న ప్రచారంపై ఐపీఎల్​ అధికారి ఒకరు స్పందించారు. లీగ్​ను విదేశాల్లో జరపడం వల్ల ఆర్థిక భారం పడుతుందని తెలిపారు . పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆర్ఆర్ఆర్ ట్రయల్ షూట్

హైదరాబాద్​ శివార్లలో రెండు రోజులపాటు 'ఆర్​ఆర్​ఆర్​' ట్రయల్​ షూట్​ జరగబోతుందని సమాచారం. అయితే ఈ చిత్రీకరణలో ప్రధాన తారాగణం పాల్గొనరని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నవ రత్నాలకే ప్రాధాన్యం

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్​లో సంక్షేమ పథకాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వనుంది. మొత్తం 2.30 లక్షల కోట్ల అంచనాతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​రెడ్డి బడ్జెట్​ను శాసనసభకు సమర్పించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రైతుకు పెద్ద పీట

బడ్జెట్​లో రైతులు, నిరుపేదల సంక్షేమం, విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. నవరత్నాల అమలుతో పేదల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు సామాజిక ఆర్థిక సర్వేలో తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కక్షతోనే ఇరికించారు

అనిశా కేసులో బెయిల్ మంజూరు కోరుతూ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విజయవాడ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు. తన అరెస్టు చట్టవిరుద్ధమని.. అయినా విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ధనలక్ష్మిదే కీలకపాత్ర

ఆమె ఓ సాధారణ ఫార్మసిస్టు.. కానీ వందల కోట్ల రూపాయల మందుల కొనుగోళ్ల వ్యవహారంలో కీలక పాత్రధారి. డిస్పెన్సరీలకు ఔషధాల నుంచి కొనుగోళ్ల వరకు జరిగిన అవినీతిలో చక్రం తిప్పినది ధనలక్ష్మి అని అనిశా తేల్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కశ్మీర్​లో ముగ్గురు ముష్కరుల హతం

జమ్ముకశ్మీర్ షోపియాన్ జిల్లాలో పోలీసులు, ఉగ్రవాదుల మధ్య ఎన్​కౌంటర్ జరిగింది. ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • బాధ్యత నేపాల్​దే

భారత్​తో చర్చలకు అనుకూల వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత నేపాల్ ప్రధాని కె.పి.శర్మ ఓలి పైనే ఉందని పేర్కొంది కేంద్రం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నెలాఖరుకు కరోనా బాధితులకు ఉపశమనం?

కరోనా ఆందోళనలతో భయపడుతూ బతుకుతున్న ప్రజలు, వైరస్ బాధితులకు ఉపశమనం కలిగించేలా.. రెమ్​డెసివిర్ ఔషధం దేశీయ విపణిలోకి జూన్ నెలాఖరుకల్లా రానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • హైడ్రాక్సీ వినియోగం నిలిపేసిన అమెరికా

కరోనా చికిత్సగా ఉపయోగిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్​(హెచ్​సీక్యూ), క్లోరోక్విన్(సీక్యూ)​ను అత్యవసర వినియోగం నుంచి ఉపసంహరించింది అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్​డీఐ. వైరస్​పై సమర్థంగా పోరాడలేవన్న కారణంతో వాటిపై ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఐపీఎల్​ను దేశంలోనే నిర్వహించాలి

ఐపీఎల్​ను పూర్తిగా స్వదేశంలోనే నిర్వహించాలని ఫ్రాంచైజీలు పట్టుబడుతున్నాయి. టోర్నీని విదేశాల్లో నిర్వహిస్తారని వస్తున్న ప్రచారంపై ఐపీఎల్​ అధికారి ఒకరు స్పందించారు. లీగ్​ను విదేశాల్లో జరపడం వల్ల ఆర్థిక భారం పడుతుందని తెలిపారు . పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆర్ఆర్ఆర్ ట్రయల్ షూట్

హైదరాబాద్​ శివార్లలో రెండు రోజులపాటు 'ఆర్​ఆర్​ఆర్​' ట్రయల్​ షూట్​ జరగబోతుందని సమాచారం. అయితే ఈ చిత్రీకరణలో ప్రధాన తారాగణం పాల్గొనరని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.