ETV Bharat / city

ముగిసిన ఎంసెట్​ కౌన్సెలింగ్​.. ఆ బ్రాంచీలకే మొగ్గు - ap latest on eamcet

ఎంసెట్​ తుది విడత కౌన్సెలింగ్​ పూర్తయింది. ఇంజినీరింగ్​లో సీఎస్​ఈ, ఈసీఈ బ్రాంచిలకే ఎప్పటిలాగే డిమాండ్​ కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా 9 కాలేజీల్లో ఒక్క అడ్మిషన్ కూడా నమోదు కాలేదు. కౌన్సెలింగ్​లో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 27లోపు కళాశాలల్లో చేరాలని  ఎంసెట్​ కన్వీనర్​ బాబు పేర్కొన్నారు.

మళ్లీ ఆ బ్రాంచీలకే మొగ్గు
author img

By

Published : Aug 24, 2019, 7:29 AM IST

Updated : Aug 24, 2019, 9:13 AM IST


ఎంసెట్​ తుది విడత కౌన్సెలింగ్​ పూర్తయింది. ఈ ఏడాది ఇంజినీరింగ్​ విభాగంలో 59 శాతం..ఫార్మసీలో 5శాతం, ఫార్మా-డీ లో 3 శాతం మంది విద్యార్థులు సీట్లు పొందారు. ఎంసెట్​లో 1,32,997 మంది అర్హత సాధించగా..68,071 మంది ద్రువపత్రాలు పరిశీలనకు హాజరైనారు.

ముగిసిన ఎంసెట్​ కౌన్సిలింగ్​.

ఈబీసీ కోటాలో 9,556 సీట్లకు గానూ 4,092 మందికి ఈ ప్రవేశాలు కల్పించారు. ఇంజినీరింగ్​ విభాగంలో 273 కళాశాలల్లో కన్వీనర్​ కోటాలోని 1,01,691 సీట్లకు 60,106 భర్తీ అయ్యాయి. విద్యార్థులు సీఎస్​ఈ, ఈసీఈ బ్రాంచీల వైపే మొగ్గు చూపారు. సివిల్​, మెకానికల్​, ఈఈఈ గ్రూపులపై ఆసక్తి తగ్గినట్లు తెలుస్తోంది. ఫార్మసీలో 119 కాలేజీల్లో కన్వీనర్​ కోటాలోని 3,925 సీట్లకు192 భర్తీ కాగా..3,733 సీట్లు మిగిలిపోయాయి. ఫార్మా-డీ విభాగంలోని 53 కళాశాలల్లో 587 సీట్లకు 17 మాత్రమే భర్తీ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9 కళాశాలల్లో ఒక్క విద్యార్థి చేరకపోవడం గమనార్హం.


ఈ గణాంకాలను పరిశీలిస్తే 17 కళాశాలల్లో వంద శాతం సీట్లు భర్తీ కాగా..22 కాలేజీల్లో10 శాతం మాత్రమే విద్యార్థులు ప్రవేశాలు పొందారు. స్టూడెంట్స్​, తల్లిదండ్రులు ఎక్కువగా సాఫ్ట్​వేర్​ విద్యవైపే మొగ్గుచూపారు. సివిల్​ , మెకానికల్​, ఈఈఈ కోర్సుల్లో ప్రాంగణ నియామకాలు తగ్గడమే ఇందుకు కారణం. కొందరు విద్యార్థులు వేరే రాష్ట్రాల్లో విద్యనభ్యసించాలనుకోవడమూ ప్రభావం చూపింది. నిర్మాణ, మౌలిక వసతుల రంగాల్లో ప్రారంభ వేతనలు తక్కువగా ఉంటున్నాయనే విద్యార్థులు ఈ కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వట్లేదని విశ్లేషకుల మాటా. కౌన్సెలింగ్​లో సీట్లు పొందిన వారు ఈ నెల 27లోపు కళాశాలల్లో చేరాలని ఎంసెట్​ కన్వీనర్​ ఎ. బాబు సూచించారు.

ఇవీ చదవండి...తెలంగాణ ఎంసెట్​లో విజయవాడ కుర్రోడికి 2వ ర్యాంకు


ఎంసెట్​ తుది విడత కౌన్సెలింగ్​ పూర్తయింది. ఈ ఏడాది ఇంజినీరింగ్​ విభాగంలో 59 శాతం..ఫార్మసీలో 5శాతం, ఫార్మా-డీ లో 3 శాతం మంది విద్యార్థులు సీట్లు పొందారు. ఎంసెట్​లో 1,32,997 మంది అర్హత సాధించగా..68,071 మంది ద్రువపత్రాలు పరిశీలనకు హాజరైనారు.

ముగిసిన ఎంసెట్​ కౌన్సిలింగ్​.

ఈబీసీ కోటాలో 9,556 సీట్లకు గానూ 4,092 మందికి ఈ ప్రవేశాలు కల్పించారు. ఇంజినీరింగ్​ విభాగంలో 273 కళాశాలల్లో కన్వీనర్​ కోటాలోని 1,01,691 సీట్లకు 60,106 భర్తీ అయ్యాయి. విద్యార్థులు సీఎస్​ఈ, ఈసీఈ బ్రాంచీల వైపే మొగ్గు చూపారు. సివిల్​, మెకానికల్​, ఈఈఈ గ్రూపులపై ఆసక్తి తగ్గినట్లు తెలుస్తోంది. ఫార్మసీలో 119 కాలేజీల్లో కన్వీనర్​ కోటాలోని 3,925 సీట్లకు192 భర్తీ కాగా..3,733 సీట్లు మిగిలిపోయాయి. ఫార్మా-డీ విభాగంలోని 53 కళాశాలల్లో 587 సీట్లకు 17 మాత్రమే భర్తీ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9 కళాశాలల్లో ఒక్క విద్యార్థి చేరకపోవడం గమనార్హం.


ఈ గణాంకాలను పరిశీలిస్తే 17 కళాశాలల్లో వంద శాతం సీట్లు భర్తీ కాగా..22 కాలేజీల్లో10 శాతం మాత్రమే విద్యార్థులు ప్రవేశాలు పొందారు. స్టూడెంట్స్​, తల్లిదండ్రులు ఎక్కువగా సాఫ్ట్​వేర్​ విద్యవైపే మొగ్గుచూపారు. సివిల్​ , మెకానికల్​, ఈఈఈ కోర్సుల్లో ప్రాంగణ నియామకాలు తగ్గడమే ఇందుకు కారణం. కొందరు విద్యార్థులు వేరే రాష్ట్రాల్లో విద్యనభ్యసించాలనుకోవడమూ ప్రభావం చూపింది. నిర్మాణ, మౌలిక వసతుల రంగాల్లో ప్రారంభ వేతనలు తక్కువగా ఉంటున్నాయనే విద్యార్థులు ఈ కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వట్లేదని విశ్లేషకుల మాటా. కౌన్సెలింగ్​లో సీట్లు పొందిన వారు ఈ నెల 27లోపు కళాశాలల్లో చేరాలని ఎంసెట్​ కన్వీనర్​ ఎ. బాబు సూచించారు.

ఇవీ చదవండి...తెలంగాణ ఎంసెట్​లో విజయవాడ కుర్రోడికి 2వ ర్యాంకు

Intro:నరసరావుపేట లో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం.
నరసరావుపేట పట్టణ ప్రజలు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్వామి కల్యాణానికి పట్టణంలోని పలు ఆలయాలు అందంగా ముస్తాబయ్యాయి. ఆలయాల్లో నిర్వహిస్తున్న సీతారాముల కల్యాణంలో పట్టణ ప్రజలు సందడిగా పాల్గోన్నారు.


Body: పట్టణంలోని గీతామందిర్ వద్దనున్న పట్టాభిరామస్వామి ఆలయం, క్లాత్ మార్కెట్ కూడలిలోని సీతారామస్వామి ఆలయం, పిల్లినాగన్నసత్రం, సత్తెనపల్లి రోడ్డులోని రామాలయంతో పాటుగా అయ్యప్పస్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం నిర్వహించారు.


Conclusion:కల్యాణ మహోత్సవానికి ఆలయాల వద్ద చలువ పందిర్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేక మందిరాలు నిర్మించారు. కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు దేవస్థానాల నిర్వాహకులు అన్ని సౌకర్యాలు కల్పించారు. కళ్యాణం అనంతరం భక్తులకు వడపప్పు, పానకం, తీర్థప్రసాదాలు అందచేశారు.
ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052,
8500512909.
Last Updated : Aug 24, 2019, 9:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.