ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా జోరుగా పురపాలక ఎన్నికల ప్రచారం

రాష్ట్రవ్యాప్తంగా పుర ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. అధికార, ప్రతిపక్షపార్టీలు వ్యూహాలకు పదును పెడుతూ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు ఇంటింటికి తిరిగి ఓట్లు అడుగుతున్నారు.

author img

By

Published : Feb 24, 2021, 12:32 PM IST

Election Campaign
Election Campaign
రాష్ట్రవ్యాప్తంగా జోరుగా పురపాలక ఎన్నికల ప్రచారం

విజయవాడ నగరపాలక ఎన్నికలు వైకాపా, తెదేపాకి ప్రతిష్టాత్మకంగా మారాయి. రెండుపార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బెజవాడకే తలమానికంగా నిలిచే కనకదుర్గమ్మవారి ఆలయంలో అవినీతి వ్యవహారం నగరపాలక సంస్థ ఎన్నికల్లో రాజకీయ వేడిని రాజేసింది. అసలు దోషి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసేనంటూ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు.

పశ్చిమ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన ఆయన.. మంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గొల్లపాలెం గట్టు పరిసర ప్రాంతాల్లో నాని ప్రచారం నిర్వహించారు. మేయర్ పదవి మహిళకు రిజర్వ్‌కావడంతో.. మహిళామణులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. 10,11 డివిజన్‌లో తెలుగుదేశం, వైకాపా అభ్యర్థులు ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. అమరావతి రాజధానిగా కొనసాగాలంటే తెలుగుదేశాన్ని గెలిపించాలని ఆ పార్టీ అభ్యర్థిని కోరగా.. సంక్షేమ పథకాలు అందరికీ దక్కాలంటే వైకాపాకు ఓటేయ్యాలని మరో అభ్యర్థిని అభ్యర్థించారు. జనసేన సైతం ప్రచారంలో దూసుకుపోతోంది.

విశాఖలోనూ అభ్యర్థులు ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. హుద్‌హద్‌ ప్రళయం సమయంలో అండగా నిలిచిన తీరును వివరిస్తూ తెలుగుదేశం అభ్యర్థులు ఇంటింటికి తిరిగి ఓట్లు అడుగుతున్నారు. విశాఖలో పాగా వేసేందుకు అధికార పార్టీ వైకాపా శక్తియుక్తులన్నింటినీ ఉపయోగిస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ వైకాపా పేరిట తెలుగుదేశంలో బలమైన నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలే తమను గట్టెక్కిస్తాయని ఆ పార్టీ అభ్యర్థులు తెలుపుతున్నారు.

కడప నగరపాలక సంస్థలో వైకాపా, భాజపా నేతలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రేపటి నుంచి తెలుగుదేశం ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టనుంది.

ఇదీ చదవండి: అగ్రవర్ణ పేదలకు గుడ్​ న్యూస్... 'ఈబీసీ నేస్తం'కు కేబినెట్‌ ఆమోదం

రాష్ట్రవ్యాప్తంగా జోరుగా పురపాలక ఎన్నికల ప్రచారం

విజయవాడ నగరపాలక ఎన్నికలు వైకాపా, తెదేపాకి ప్రతిష్టాత్మకంగా మారాయి. రెండుపార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బెజవాడకే తలమానికంగా నిలిచే కనకదుర్గమ్మవారి ఆలయంలో అవినీతి వ్యవహారం నగరపాలక సంస్థ ఎన్నికల్లో రాజకీయ వేడిని రాజేసింది. అసలు దోషి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసేనంటూ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు.

పశ్చిమ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన ఆయన.. మంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గొల్లపాలెం గట్టు పరిసర ప్రాంతాల్లో నాని ప్రచారం నిర్వహించారు. మేయర్ పదవి మహిళకు రిజర్వ్‌కావడంతో.. మహిళామణులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. 10,11 డివిజన్‌లో తెలుగుదేశం, వైకాపా అభ్యర్థులు ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. అమరావతి రాజధానిగా కొనసాగాలంటే తెలుగుదేశాన్ని గెలిపించాలని ఆ పార్టీ అభ్యర్థిని కోరగా.. సంక్షేమ పథకాలు అందరికీ దక్కాలంటే వైకాపాకు ఓటేయ్యాలని మరో అభ్యర్థిని అభ్యర్థించారు. జనసేన సైతం ప్రచారంలో దూసుకుపోతోంది.

విశాఖలోనూ అభ్యర్థులు ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. హుద్‌హద్‌ ప్రళయం సమయంలో అండగా నిలిచిన తీరును వివరిస్తూ తెలుగుదేశం అభ్యర్థులు ఇంటింటికి తిరిగి ఓట్లు అడుగుతున్నారు. విశాఖలో పాగా వేసేందుకు అధికార పార్టీ వైకాపా శక్తియుక్తులన్నింటినీ ఉపయోగిస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ వైకాపా పేరిట తెలుగుదేశంలో బలమైన నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలే తమను గట్టెక్కిస్తాయని ఆ పార్టీ అభ్యర్థులు తెలుపుతున్నారు.

కడప నగరపాలక సంస్థలో వైకాపా, భాజపా నేతలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రేపటి నుంచి తెలుగుదేశం ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టనుంది.

ఇదీ చదవండి: అగ్రవర్ణ పేదలకు గుడ్​ న్యూస్... 'ఈబీసీ నేస్తం'కు కేబినెట్‌ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.