ETV Bharat / city

జాతీయ నేర పరిశోధన సంస్థల దృష్టికి డ్రోన్‌ వివాదం!

author img

By

Published : Aug 17, 2019, 7:18 AM IST

Updated : Aug 17, 2019, 9:17 AM IST

తెదేపా అధినేత చంద్రబాబు నివాసం పరిసరాల్లో డ్రోన్ కెమెరాల ప్రయోగం అంశాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ వ్యవహారంపై శనివారం డీజీపీని కలిసి ఫిర్యాదు చేయడంతోపాటు... గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. వరద ముంచెత్తి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే... మంత్రులు మాత్రం చంద్రబాబు ఇంటిచుట్టు తిరుగుతున్నారంటూ... ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు నివాసంపై డ్రోన్‌ ప్రయోగం... తెదేపా ఆందోళన

చంద్రబాబు నివాసంపై డ్రోన్‌ ప్రయోగం... తెదేపా ఆందోళన

గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంపై డ్రోన్ ప్రయోగం, ఆ తర్వాతి పరిణామాలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సమీక్షించారు. పార్టీ నేతలతో హైదరాబాద్‌ నుంచి టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడిన చంద్రబాబు... ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత భద్రత కలిగిన తన నివాసంపై అనుమతిలేకుండా డ్రోన్‌లు ప్రయోగించడమేగాక... నిరనస తెలిపిన తెదేపా కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేయడాన్ని తప్పుబట్టారు. వరద నియంత్రణ, బాధితులను ఆదుకోవడంలో వైకాపా నేతలు విఫలమయ్యారని విమర్శించారు. నీళ్లు వెనక్కి తన్ని తన నివాసంలోకి ప్రవేశించేందుకే ప్రకాశం బ్యారేజీ గేట్లకు బోట్లు అడ్డుగాపెట్టారని ధ్వజమెత్తారు.

తనపై అక్కసుతో ప్రజలను ఇబ్బందులుపెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. శ్రీశైలానికి భారీగా వరద వస్తున్నా... ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేయ్యకపోవడమేంటని ప్రశ్నించారు. కృష్ణానదికి ఇంత పెద్ద ఎత్తున వరద వస్తుంటే... ముఖ్యమంత్రి కనీసం ఒక్కసారి కూడా సమీక్షించలేదని ఆరోపించారు. ప్రకాశం బ్యారేజీలో నీటిని నిలబెట్టి... ఒక్కసారిగా విడుదల చెయ్యడం కారణంగా దిగువ ప్రాంతాలు మునిగిపోయాయని తెదేపా నేతలు అధినేతకు వివరించారు. మంగళగిరి, దుగ్గిరాల, ఇతర ప్రాంతాల్లో వరద పరిస్థితిపై వీడియోలు విడుదల చేశారు. చంద్రబాబు ఇంటిపై దృష్టిపెట్టడం మాని... ప్రజా సమస్యలపై తెదేపా నేతలు హితవు పలికారు.

చంద్రబాబు నివాసంపై డ్రోన్ల వినియోగంపై తెలుగుదేశం నేతలూ సమీక్షించారు. జెడ్‌ప్లస్‌ కేటగిరి భద్రత కలిగిన వ్యక్తి ఇంటిపై డ్రోన్ల ప్రయోగించాడన్ని జాతీయ నేరపరిశోధన సంస్థల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ వ్యవహారంపై నేడు డీజీపీని కలిసి ఫిర్యాదు చేయనున్నారు. గవర్నర్ దృష్టికీ తీసుకెళ్లాలని నిర్ణయించారు. డ్రోన్లు వినియోగించిన ఇద్దరు వ్యక్తులతోపాటు... వారికి ఆ పని అప్పగించిన కిరణ్‌పైనా తాడేపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నీటిపారుదలశాఖ అధికారులు వరద పరిస్థితిని చిత్రీకరించమని చెప్తే... పట్టుబడిన యువకులు సీఎం నివాసంలో ఉండే కిరణ్‌పేరు ఎందుకు చెప్పారని తెలుగుదేశం నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నివాసంలోకి అనుమతి లేకుండా ప్రవేశించిన వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండీ...

మహోద్ధృతంగా ప్రవహిస్తున్న కృష్ణమ్మ... ముంపులోనే గ్రామాలు

చంద్రబాబు నివాసంపై డ్రోన్‌ ప్రయోగం... తెదేపా ఆందోళన

గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంపై డ్రోన్ ప్రయోగం, ఆ తర్వాతి పరిణామాలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సమీక్షించారు. పార్టీ నేతలతో హైదరాబాద్‌ నుంచి టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడిన చంద్రబాబు... ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత భద్రత కలిగిన తన నివాసంపై అనుమతిలేకుండా డ్రోన్‌లు ప్రయోగించడమేగాక... నిరనస తెలిపిన తెదేపా కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేయడాన్ని తప్పుబట్టారు. వరద నియంత్రణ, బాధితులను ఆదుకోవడంలో వైకాపా నేతలు విఫలమయ్యారని విమర్శించారు. నీళ్లు వెనక్కి తన్ని తన నివాసంలోకి ప్రవేశించేందుకే ప్రకాశం బ్యారేజీ గేట్లకు బోట్లు అడ్డుగాపెట్టారని ధ్వజమెత్తారు.

తనపై అక్కసుతో ప్రజలను ఇబ్బందులుపెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. శ్రీశైలానికి భారీగా వరద వస్తున్నా... ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేయ్యకపోవడమేంటని ప్రశ్నించారు. కృష్ణానదికి ఇంత పెద్ద ఎత్తున వరద వస్తుంటే... ముఖ్యమంత్రి కనీసం ఒక్కసారి కూడా సమీక్షించలేదని ఆరోపించారు. ప్రకాశం బ్యారేజీలో నీటిని నిలబెట్టి... ఒక్కసారిగా విడుదల చెయ్యడం కారణంగా దిగువ ప్రాంతాలు మునిగిపోయాయని తెదేపా నేతలు అధినేతకు వివరించారు. మంగళగిరి, దుగ్గిరాల, ఇతర ప్రాంతాల్లో వరద పరిస్థితిపై వీడియోలు విడుదల చేశారు. చంద్రబాబు ఇంటిపై దృష్టిపెట్టడం మాని... ప్రజా సమస్యలపై తెదేపా నేతలు హితవు పలికారు.

చంద్రబాబు నివాసంపై డ్రోన్ల వినియోగంపై తెలుగుదేశం నేతలూ సమీక్షించారు. జెడ్‌ప్లస్‌ కేటగిరి భద్రత కలిగిన వ్యక్తి ఇంటిపై డ్రోన్ల ప్రయోగించాడన్ని జాతీయ నేరపరిశోధన సంస్థల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ వ్యవహారంపై నేడు డీజీపీని కలిసి ఫిర్యాదు చేయనున్నారు. గవర్నర్ దృష్టికీ తీసుకెళ్లాలని నిర్ణయించారు. డ్రోన్లు వినియోగించిన ఇద్దరు వ్యక్తులతోపాటు... వారికి ఆ పని అప్పగించిన కిరణ్‌పైనా తాడేపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నీటిపారుదలశాఖ అధికారులు వరద పరిస్థితిని చిత్రీకరించమని చెప్తే... పట్టుబడిన యువకులు సీఎం నివాసంలో ఉండే కిరణ్‌పేరు ఎందుకు చెప్పారని తెలుగుదేశం నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నివాసంలోకి అనుమతి లేకుండా ప్రవేశించిన వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండీ...

మహోద్ధృతంగా ప్రవహిస్తున్న కృష్ణమ్మ... ముంపులోనే గ్రామాలు

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు.. కంట్రిబ్యూటర్

యాంకర్... కూలి పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న కూలీలా ఆటో రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా మరో 6 గురుకి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యావసర వైద్యం అందించిన వైద్యులు మార్గం మధ్యలోనే మహిళ మృతి చెందినట్లు తెలిపారు. మిగిలిన వారికి వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. తాడేపల్లి కూలిపనులుకు వెళ్లి తిరిగి గోరంట్ల వస్తున్న ప్యాసింజర్ ఆటో ని గుంటూరు నుండి వెళ్తున్న టాటా మ్యాజిక్ ఆటో ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం డీకొట్టింది. దింతో ఆటో లో ఉన్నవారు ప్రమాదానికి గురైనట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు సమాచారం మేరకు సంఘటన స్టాలినికి చేరుకొన్నా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.Body:ఫొటోస్...Conclusion:
Last Updated : Aug 17, 2019, 9:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.