ETV Bharat / city

ఆ మంత్రిని హత్య చేసేందుకు కుట్ర... అసలు ప్లాన్​ ఏంటంటే..?

author img

By

Published : Mar 3, 2022, 10:01 AM IST

minister murder plan: తెలంగాణలో గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్న పలువురి కిడ్నాప్​లకు సంబంధించిన వార్తలకు సైబరాబాద్​ పోలీసులు చెక్​ పెట్టారు. వాటన్నింటి వెనుక.. తెలంగాణ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​పై హత్య కుట్ర ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇందులో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయన్న పోలీసులు.. ప్రస్తుతానికి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది..? ఎవరు ప్లాన్​ చేశారు..? అసలు ప్లాన్​ ఏంటంటే..?

minister murder plan
మంత్రి హత్యకు కుట్ర

minister murder plan: తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ను హత్య చేసేందుకు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. కుట్రలో భాగమైన 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సుపారీ గ్యాంగ్‌తో మహబూబ్‌నగర్‌ వాసులే హత్యకు కుట్ర పన్నినట్టు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. మంత్రి శ్రీనివాస్​గౌడ్​ హత్యకు కుట్ర జరిగిందనేందుకు ఆధారాలు లభించాయని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. దాదాపు 15 కోట్లతో సుపారీ ఒప్పందం జరిగిందని దర్యాప్తులో తేలిందన్నారు. సుపారీ హత్య కోసం మొదట ఫరూక్‌ అనే వ్యక్తిని ఆశ్రయించగా.. అతడు బయటపెడతాడేమో అనే భయంతో అతడిని చంపేందుకు ప్రయత్నించారు. ఆ దాడి నుంచి తప్పించుకున్న ఫరూక్​.. పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు ప్రారంభించాం అన్నారు. అక్కడి నుంచి ప్రారంభమైన దర్యాప్తులో భాగంగానే.. మంత్రిపై హత్య కుట్ర విషయం బయటపడిందని తెలిపారు. ఈ మొత్తం కుట్రలో తమకు ప్రధానంగా ముగ్గురి పేర్లు బయటపడ్డాయని.. మిగతావారి పాత్రపైనా కూడా ఆరా తీస్తున్నామని సీపీ వెల్లడించారు.

మంత్రి హత్యకు కుట్ర

ఈ కుట్ర ఎలా బయటపడిందంటే..?

minister murder plan: ఫిబ్రవరి 23న ఫరూక్‌, హైదర్‌ అనే ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్​లోని సుచిత్ర వద్ద ఓ లాడ్జీలో దిగారు. ఫిబ్రవరి 25న ఫరూక్‌, హైదర్‌పై ఒక ముఠా దాడి చేశారు. ఆ దాడి నుంచి తప్పించుకుని.. తమపై హత్యాయత్నం జరిగిందని పేట్‌బషీరాబాద్ పీఎస్​లో ఫిర్యాదు చేశారు. వాళ్లిద్దరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దాడికి యత్నించింది.. యాదయ్య, నాగరాజు, విశ్వనాథ్‌ అని తేలింది. ఫిబ్రవరి 26న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి విచారించారు. విచారణలో మరికొందరి పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడిలో రాఘవేంద్రరాజు, అమరేంద్రరాజు, రవి, మధుసూదన్‌ ప్రమేయం ఉన్నట్లు నిందితులు బయటపెట్టారు. అసలు ఇంత మంది ఫరూక్, హైదర్​ల మీద ఎందుకు దాడి చేశారని లోతుగా విచారిస్తే అప్పుడు అసలు విషయం బయటపడింది.​ ఈ ముఠా అంతా కలిసి మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ హత్యకు కుట్ర పన్నినట్లు తెలిసింది.

"ఈ కుట్ర వెనక ఉన్న వాళ్లందరినీ అదుపులోకి తీసుకుని లోతుగా ప్రశ్నించాం. మంత్రిని హత్య చేయించాలని రాఘవేంద్రరాజు కుట్ర పన్నారు. దీంట్లో మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి పాత్రపై దర్యాప్తు చేస్తున్నాం. డీకే అరుణ పాత్రపై కూడా దర్యాప్తు చేస్తాం. దిల్లీలో ఆశ్రయం ఇచ్చిన వారికి హత్య కుట్ర గురించి తెలుసో లేదో తెలియదు. నిందితుల నుంచి రివాల్వర్‌, బులెట్లు స్వాధీనం చేసుకున్నాం. నిందితులను కస్టడీలోకి తీసుకుని మరిన్ని వివరాలు రాబడతాం."

- స్టీఫెన్​ రవీంద్ర, సైబరాబాద్​ సీపీ

అక్కడే అంతా మలుపు తిరిగింది..

minister murder plan: మొదట సుపారీ హత్య గురించి ఫరూక్​నే ఆశ్రయించిన ముఠా మరెందుకు అతడిపై దాడి చేశారు..? అసలు విషయమంతా ఇక్కడే మలుపు తిరిగింది. అయితే.. మంత్రిని చంపేందుకు ఫరూక్‌తో రాఘవేంద్రరావు ఒప్పందం కుదుర్చుకున్నారు. మంత్రి హత్యకు రూ.15 కోట్లు ఇచ్చేలా ఒప్పందం జరిగింది. ఫరూక్‌ను మధ‌ుసూదన్‌, అమరేందర్ సంప్రదించారు. తామే డబ్బులిస్తామని ఒప్పుకున్నారు. ఆ తర్వాత.. ఈ హత్య కుట్ర గురించి ఫరూక్​.. తన స్నేహితుడైన హైదర్​కు చెప్పాడు. ఇదే విషయంపై వివాదం మొదలైంది. ఆ వివాదం కాస్తా.. కుట్ర మొత్తం బయటపడేలా చేసింది. హత్య కుట్ర గురించి ఫరూక్‌.. హైదర్‌కు చెప్పాడన్న కోపంతో.. ఈ విషయం తెలిసిన వాళ్లిద్దరిని చంపాలని మిగతా వాళ్లు ప్లాన్​ చేశారు. కానీ.. వాళ్లు తప్పించుకుని పోలీసులను ఆశ్రయించటంతో.. దాడి చేసిన వాళ్లు దొరికిపోయారు. ఈ కుట్ర వెనక ఉన్న తాము కూడా దొరికిపోతామని భయంతో మిగతావాళ్లు వెంటనే దిల్లీకి పారిపోయారు. రాఘవేందర్‌రాజు, అమరేందర్‌, రవి, మధుసూదన్‌.. విశాఖ మీదుగా దిల్లీ వెళ్లారు. వీళ్లంతా దిల్లీలో జితేందర్‌ రెడ్డి సర్వెంట్‌ క్వార్టర్స్‌లో ఉన్నారు. నిందితులకు జితేందర్‌ రెడ్డి పీఏ రాజు, డ్రైవర్‌ ఆశ్రయం ఇచ్చారు.

ఇదీ చూడండి:

TS News: తెలంగాణలో మంత్రి హత్యకు సుపారీ!

minister murder plan: తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ను హత్య చేసేందుకు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. కుట్రలో భాగమైన 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సుపారీ గ్యాంగ్‌తో మహబూబ్‌నగర్‌ వాసులే హత్యకు కుట్ర పన్నినట్టు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. మంత్రి శ్రీనివాస్​గౌడ్​ హత్యకు కుట్ర జరిగిందనేందుకు ఆధారాలు లభించాయని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. దాదాపు 15 కోట్లతో సుపారీ ఒప్పందం జరిగిందని దర్యాప్తులో తేలిందన్నారు. సుపారీ హత్య కోసం మొదట ఫరూక్‌ అనే వ్యక్తిని ఆశ్రయించగా.. అతడు బయటపెడతాడేమో అనే భయంతో అతడిని చంపేందుకు ప్రయత్నించారు. ఆ దాడి నుంచి తప్పించుకున్న ఫరూక్​.. పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు ప్రారంభించాం అన్నారు. అక్కడి నుంచి ప్రారంభమైన దర్యాప్తులో భాగంగానే.. మంత్రిపై హత్య కుట్ర విషయం బయటపడిందని తెలిపారు. ఈ మొత్తం కుట్రలో తమకు ప్రధానంగా ముగ్గురి పేర్లు బయటపడ్డాయని.. మిగతావారి పాత్రపైనా కూడా ఆరా తీస్తున్నామని సీపీ వెల్లడించారు.

మంత్రి హత్యకు కుట్ర

ఈ కుట్ర ఎలా బయటపడిందంటే..?

minister murder plan: ఫిబ్రవరి 23న ఫరూక్‌, హైదర్‌ అనే ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్​లోని సుచిత్ర వద్ద ఓ లాడ్జీలో దిగారు. ఫిబ్రవరి 25న ఫరూక్‌, హైదర్‌పై ఒక ముఠా దాడి చేశారు. ఆ దాడి నుంచి తప్పించుకుని.. తమపై హత్యాయత్నం జరిగిందని పేట్‌బషీరాబాద్ పీఎస్​లో ఫిర్యాదు చేశారు. వాళ్లిద్దరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దాడికి యత్నించింది.. యాదయ్య, నాగరాజు, విశ్వనాథ్‌ అని తేలింది. ఫిబ్రవరి 26న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి విచారించారు. విచారణలో మరికొందరి పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడిలో రాఘవేంద్రరాజు, అమరేంద్రరాజు, రవి, మధుసూదన్‌ ప్రమేయం ఉన్నట్లు నిందితులు బయటపెట్టారు. అసలు ఇంత మంది ఫరూక్, హైదర్​ల మీద ఎందుకు దాడి చేశారని లోతుగా విచారిస్తే అప్పుడు అసలు విషయం బయటపడింది.​ ఈ ముఠా అంతా కలిసి మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ హత్యకు కుట్ర పన్నినట్లు తెలిసింది.

"ఈ కుట్ర వెనక ఉన్న వాళ్లందరినీ అదుపులోకి తీసుకుని లోతుగా ప్రశ్నించాం. మంత్రిని హత్య చేయించాలని రాఘవేంద్రరాజు కుట్ర పన్నారు. దీంట్లో మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి పాత్రపై దర్యాప్తు చేస్తున్నాం. డీకే అరుణ పాత్రపై కూడా దర్యాప్తు చేస్తాం. దిల్లీలో ఆశ్రయం ఇచ్చిన వారికి హత్య కుట్ర గురించి తెలుసో లేదో తెలియదు. నిందితుల నుంచి రివాల్వర్‌, బులెట్లు స్వాధీనం చేసుకున్నాం. నిందితులను కస్టడీలోకి తీసుకుని మరిన్ని వివరాలు రాబడతాం."

- స్టీఫెన్​ రవీంద్ర, సైబరాబాద్​ సీపీ

అక్కడే అంతా మలుపు తిరిగింది..

minister murder plan: మొదట సుపారీ హత్య గురించి ఫరూక్​నే ఆశ్రయించిన ముఠా మరెందుకు అతడిపై దాడి చేశారు..? అసలు విషయమంతా ఇక్కడే మలుపు తిరిగింది. అయితే.. మంత్రిని చంపేందుకు ఫరూక్‌తో రాఘవేంద్రరావు ఒప్పందం కుదుర్చుకున్నారు. మంత్రి హత్యకు రూ.15 కోట్లు ఇచ్చేలా ఒప్పందం జరిగింది. ఫరూక్‌ను మధ‌ుసూదన్‌, అమరేందర్ సంప్రదించారు. తామే డబ్బులిస్తామని ఒప్పుకున్నారు. ఆ తర్వాత.. ఈ హత్య కుట్ర గురించి ఫరూక్​.. తన స్నేహితుడైన హైదర్​కు చెప్పాడు. ఇదే విషయంపై వివాదం మొదలైంది. ఆ వివాదం కాస్తా.. కుట్ర మొత్తం బయటపడేలా చేసింది. హత్య కుట్ర గురించి ఫరూక్‌.. హైదర్‌కు చెప్పాడన్న కోపంతో.. ఈ విషయం తెలిసిన వాళ్లిద్దరిని చంపాలని మిగతా వాళ్లు ప్లాన్​ చేశారు. కానీ.. వాళ్లు తప్పించుకుని పోలీసులను ఆశ్రయించటంతో.. దాడి చేసిన వాళ్లు దొరికిపోయారు. ఈ కుట్ర వెనక ఉన్న తాము కూడా దొరికిపోతామని భయంతో మిగతావాళ్లు వెంటనే దిల్లీకి పారిపోయారు. రాఘవేందర్‌రాజు, అమరేందర్‌, రవి, మధుసూదన్‌.. విశాఖ మీదుగా దిల్లీ వెళ్లారు. వీళ్లంతా దిల్లీలో జితేందర్‌ రెడ్డి సర్వెంట్‌ క్వార్టర్స్‌లో ఉన్నారు. నిందితులకు జితేందర్‌ రెడ్డి పీఏ రాజు, డ్రైవర్‌ ఆశ్రయం ఇచ్చారు.

ఇదీ చూడండి:

TS News: తెలంగాణలో మంత్రి హత్యకు సుపారీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.