ETV Bharat / city

తెలంగాణ: జేసీబీతో కరోనా మృతురాలికి అంత్యక్రియలు..!

తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. మరణాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇందల్వాయి మండలంలోని ఓ గ్రామంలో వృద్ధురాలు కరోనాతో మృతి చెందారు. ఆ మృతదేహానికి జేసీబీతో అంత్యక్రియలు నిర్వహించడం ఆందోళన కలిగిస్తోంది.

author img

By

Published : Apr 21, 2021, 10:07 PM IST

జేసీబీతో కరోనా మృతిరాలికి అంత్యక్రియలు..!
జేసీబీతో కరోనా మృతిరాలికి అంత్యక్రియలు..!

తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. కేసులతో పాటు మరణాలు పెరుగుతున్నాయి. ఇందల్వాయి మండలంలోని ఓ గ్రామంలో వృద్ధురాలు కరోనాతో బుధవారం మృతి చెందారు. అంత్యక్రియలు చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకు రాలేదు. జేసీబీ సాయంతో శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.

ఈ హృదయ విదారక ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. డిచ్​పల్లి మండలంలో ఒకరు, జక్రాన్​పల్లి మండలంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. మోపాల్ మండలంలో ఓ సొసైటీ ఛైర్మన్ మహమ్మారి కాటుకు బలయ్యారు. ఓ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బుధవారం మృతి చెందారు. ఈ క్రమంలో జిల్లా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. కేసులతో పాటు మరణాలు పెరుగుతున్నాయి. ఇందల్వాయి మండలంలోని ఓ గ్రామంలో వృద్ధురాలు కరోనాతో బుధవారం మృతి చెందారు. అంత్యక్రియలు చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకు రాలేదు. జేసీబీ సాయంతో శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.

ఈ హృదయ విదారక ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. డిచ్​పల్లి మండలంలో ఒకరు, జక్రాన్​పల్లి మండలంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. మోపాల్ మండలంలో ఓ సొసైటీ ఛైర్మన్ మహమ్మారి కాటుకు బలయ్యారు. ఓ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బుధవారం మృతి చెందారు. ఈ క్రమంలో జిల్లా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

ఇదీ చదవండి:

హనుమంతుడి జన్మస్థానం...అంజనాద్రే

'కరోనా ఉద్ధృతి.. మోదీ సృష్టించిన విపత్తు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.