ETV Bharat / city

తెలంగాణ: మంచం పైనుంచి కిందపడి కరోనా బాధితుడు మృతి

author img

By

Published : Jul 27, 2020, 3:24 PM IST

మాయదారి కరోనా మనుషుల్లో మానవత్వాన్ని మాయం చేసిన ఘటనలు నిత్యం ఏదో ఒక మూల మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఒక ఘటన మరిచిపోకముందే.. మరో హృదయ విదారక సంఘటన జరుగుతోంది. తాజాగా తెలంగాణలోని కరీంనగర్​లో కొవిడ్​-19 చికిత్స పొందుతూ మంచంపై ఉన్న రోగి కిందపడ్డా ఎవరూ పైకి లేపని దుస్థితి ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది.

corona-patient-died-in-karim-nagar-government-hospital
మంచంపై నుంచి కిందపడి కరోనా బాధితుడు మృతి

కరోనాతో చికిత్స పొందుతూ.. వ్యాధి తీవ్రత పెరిగి మంచం పైనుంచి కిందపడి ఓ వృద్ధుడు చనిపోయిన ఘటన తెలంగాణలోని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. కింద పడ్డా... తోటి రోగులు దగ్గరకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఆసుపత్రి సిబ్బంది అందుబాటులో లేక ఆ వృద్ధుడు 45 నిమిషాలు మృత్యువుతో పోరాడాడు.

కరీంనగర్‌ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో గంగాధర మండలం వెంకటాయపల్లికి చెందిన 70 ఏళ్ల వృద్ధుడు కరోనా చికిత్స పొందుతున్నాడు. 5 రోజులుగా ఆసుపత్రిలో ఉన్న ఆయన.. ఆదివారం మధ్యాహ్నం పరిస్థితి విషమించి మంచం పైనుంచి కిందపడ్డాడు. కాళ్లు చేతులు కొట్టుకుని విలవిలలాడుతున్నా.. కరోనా భయంతో పక్కనే ఉన్న ఇతర రోగులు దగ్గరకు వెళ్లలేదు. సమయానికి సిబ్బంది కూడా అందుబాటులో లేదు. రోగి కిందపడి ఉన్న తీరును వీడియో తీసి ఇతరులకు పంపించగా.. అది కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

బాధితుడితో పాటు అదే వార్డులో మరికొంతమంది చికిత్స పొందుతున్నారు. చనిపోయిన చాలాసేపటికి ఆస్పత్రి సిబ్బంది మృతదేహాన్ని తిరిగి మంచంపై ఉంచినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. మృతదేహాన్ని తీసుకెళ్లడానికి కుటుంబీకులు రాత్రి వరకు రాలేదు. చేసేదేం లేక మార్చురీలో భద్రపరిచారు. ఈ ఘటనలో సిబ్బంది తప్పేమీ లేదని బాధితుడు కింద పడగానే.. తక్షణమే స్పందించి ఆక్సిజన్‌ పెట్టినట్లు ఆస్పత్రి పర్యవేక్షకురాలు రత్నమాల వివరణ ఇచ్చారు.

కరోనాతో చికిత్స పొందుతూ.. వ్యాధి తీవ్రత పెరిగి మంచం పైనుంచి కిందపడి ఓ వృద్ధుడు చనిపోయిన ఘటన తెలంగాణలోని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. కింద పడ్డా... తోటి రోగులు దగ్గరకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఆసుపత్రి సిబ్బంది అందుబాటులో లేక ఆ వృద్ధుడు 45 నిమిషాలు మృత్యువుతో పోరాడాడు.

కరీంనగర్‌ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో గంగాధర మండలం వెంకటాయపల్లికి చెందిన 70 ఏళ్ల వృద్ధుడు కరోనా చికిత్స పొందుతున్నాడు. 5 రోజులుగా ఆసుపత్రిలో ఉన్న ఆయన.. ఆదివారం మధ్యాహ్నం పరిస్థితి విషమించి మంచం పైనుంచి కిందపడ్డాడు. కాళ్లు చేతులు కొట్టుకుని విలవిలలాడుతున్నా.. కరోనా భయంతో పక్కనే ఉన్న ఇతర రోగులు దగ్గరకు వెళ్లలేదు. సమయానికి సిబ్బంది కూడా అందుబాటులో లేదు. రోగి కిందపడి ఉన్న తీరును వీడియో తీసి ఇతరులకు పంపించగా.. అది కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

బాధితుడితో పాటు అదే వార్డులో మరికొంతమంది చికిత్స పొందుతున్నారు. చనిపోయిన చాలాసేపటికి ఆస్పత్రి సిబ్బంది మృతదేహాన్ని తిరిగి మంచంపై ఉంచినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. మృతదేహాన్ని తీసుకెళ్లడానికి కుటుంబీకులు రాత్రి వరకు రాలేదు. చేసేదేం లేక మార్చురీలో భద్రపరిచారు. ఈ ఘటనలో సిబ్బంది తప్పేమీ లేదని బాధితుడు కింద పడగానే.. తక్షణమే స్పందించి ఆక్సిజన్‌ పెట్టినట్లు ఆస్పత్రి పర్యవేక్షకురాలు రత్నమాల వివరణ ఇచ్చారు.

ఇవీ చూడండి:

వైఎస్ వివేకా హత్య కేసు.. అనుమానితుల జాబితాలో 15 మంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.