ETV Bharat / city

తెలంగాణలో కొత్తగా 94 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. సోమవారం కొత్తగా 94 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో హైదరాబాద్​ నగర పాలక సంస్థ పరిధిలోనే 79 కేసులున్నాయి.

author img

By

Published : Jun 1, 2020, 10:15 PM IST

తెలంగాణలో కొత్తగా 94 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 94 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో 94 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో మొత్తం బాధితుల సంఖ్య 2,792కు పెరిగింది. సోమవారం నమోదైన కేసుల్లో 2,264 మంది రాష్ట్ర వాసులున్నారు. మిగతా 434 మంది విదేశాల నుంచి వచ్చినవారు, వలస కూలీలు ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 79 కరోనా కేసులు నమోదయ్యాయి.

రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో మూడు... మెదక్‌, నల్గొండ, సంగారెడ్డి జిల్లాల్లో రెండు... మహబూబాబాద్‌, జనగామ, పెద్దపల్లి జిల్లాల్లో ఒక్కో కరోనా కేసు నమోదైంది. తెలంగాణలో కరోనాతో మరో ఆరుగురు మృతిచెందారు. వైరస్​ సోకి ఇప్పటివరకు 88 మంది మృత్యువాతపడ్డారు. కొవిడ్​ నుంచి కోలుకుని ఇప్పటివరకు 1,491 మంది డిశ్చార్జయ్యారు. ఆస్పత్రిలో 1,213 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో 94 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో మొత్తం బాధితుల సంఖ్య 2,792కు పెరిగింది. సోమవారం నమోదైన కేసుల్లో 2,264 మంది రాష్ట్ర వాసులున్నారు. మిగతా 434 మంది విదేశాల నుంచి వచ్చినవారు, వలస కూలీలు ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 79 కరోనా కేసులు నమోదయ్యాయి.

రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో మూడు... మెదక్‌, నల్గొండ, సంగారెడ్డి జిల్లాల్లో రెండు... మహబూబాబాద్‌, జనగామ, పెద్దపల్లి జిల్లాల్లో ఒక్కో కరోనా కేసు నమోదైంది. తెలంగాణలో కరోనాతో మరో ఆరుగురు మృతిచెందారు. వైరస్​ సోకి ఇప్పటివరకు 88 మంది మృత్యువాతపడ్డారు. కొవిడ్​ నుంచి కోలుకుని ఇప్పటివరకు 1,491 మంది డిశ్చార్జయ్యారు. ఆస్పత్రిలో 1,213 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

ఇవీ చూడండి:

'మేనిఫెస్టోపై మాట తప్పి.. మడమ తిప్పారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.