ETV Bharat / city

ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకొండి: సీఎం జగన్

author img

By

Published : Nov 8, 2019, 6:35 AM IST

ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పటికీ ఆదాయపరంగా నిలదొక్కుకున్నామని సీఎం జగన్‌ అభిప్రాయపడ్డారు. ఆదాయ వనరులపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 2.1 శాతం ఆదాయం తగ్గిందని వివరించారు. పరిస్థితి మెరుగుదలకు అధికారులకు పలు సూచనలు చేశారు.

ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకొండి: సీఎం జగన్

ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకొండి: సీఎం జగన్

ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చే శాఖలపై ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో... ఆర్థిక, రెవెన్యూ, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, రవాణా, అబ్కారీ, అటవీశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శాఖల వారీగా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం... ప్రస్తుత పరిస్థితులను అధికారులు ముఖ్యమంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

గత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ వరకు వచ్చిన ఆదాయాలతో పోలిస్తే... ఈ ఏడాది ఎక్కువ శాతం విభాగాల్లో ఆదాయం తగ్గిందని తెలిపారు. కొన్ని శాఖల్లో మాత్రమే గతేడాది కంటే ఆదాయం ఎక్కువగా వచ్చిందని వివరించారు. అన్ని శాఖల నుంచి గతేడాది అక్టోబర్ వరకు రూ.35 వేల 411 కోట్ల ఆదాయం రాగా, ఈ సంవత్సరం అదే సమయానికి రూ.34 వేల 669 కోట్లు ఆదాయం వచ్చింది. మొత్తంమీద 2.10 శాతం అంటే రూ.741 కోట్ల మేర ఆదాయం తగ్గిందని తేల్చారు.

ఆదాయం తగ్గుదల ఎక్సైజ్‌ శాఖలో అతి ఎక్కువగా నమోదైంది. ఈ శాఖలో రూ.360 కోట్లు కోతపడింది. రవాణా శాఖలో144, గనులు, భూగర్భ వనరుల శాఖలో 235, రెవెన్యూ శాఖలో 25, అటవీ శాఖలో రూ.102 కోట్ల చొప్పున ఆదాయం తగ్గింది. కీలకమైన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో రూ.91 కోట్లు, వాణిజ్య పన్నుల్లో రూ.35 కోట్లు చొప్పున ఆదాయం పెరిగింది.

ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పటికీ... ఆదాయాల పరంగా నిలదొక్కుకున్నామని.. ముఖ్యమంత్రి జగన్‌ సంతోషం వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న పన్ను వసూళ్ల కోసం ఒక నిర్దుష్ట విధానం రూపొందించాలని అధికారులకు సూచించారు. ఆర్టీసీలో ఏసీ బస్సుల సంఖ్య పెంచాలని నిర్ణయించారు. ఎర్రచందనానికి అదనపు విలువ జోడించడానికి ప్రయత్నించాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. ఆదాయం పెంపుపై గనుల శాఖ దృష్టి పెట్టాలని సూచించారు.

మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తుండటం వల్ల లైసెన్సు ఫీజు కోల్పోయామని అధికారులు ప్రస్తావించగా... మద్యాన్ని నియంత్రించాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. బార్ల సంఖ్యనూ తగ్గించాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతాల్లో... ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకే బార్లలో మద్యం అందుబాటులో ఉంచాలన్నారు. ఆ మేరకు విధి విధానాలు ఖరారు చేయాలన్న సీఎం... జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని ఆదేశించారు.

ఇదీ చదవండీ... వైకాపా సర్కారుకు కౌంట్‌డౌన్‌ మొదలైంది: చంద్రబాబు

ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకొండి: సీఎం జగన్

ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చే శాఖలపై ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో... ఆర్థిక, రెవెన్యూ, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, రవాణా, అబ్కారీ, అటవీశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శాఖల వారీగా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం... ప్రస్తుత పరిస్థితులను అధికారులు ముఖ్యమంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

గత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ వరకు వచ్చిన ఆదాయాలతో పోలిస్తే... ఈ ఏడాది ఎక్కువ శాతం విభాగాల్లో ఆదాయం తగ్గిందని తెలిపారు. కొన్ని శాఖల్లో మాత్రమే గతేడాది కంటే ఆదాయం ఎక్కువగా వచ్చిందని వివరించారు. అన్ని శాఖల నుంచి గతేడాది అక్టోబర్ వరకు రూ.35 వేల 411 కోట్ల ఆదాయం రాగా, ఈ సంవత్సరం అదే సమయానికి రూ.34 వేల 669 కోట్లు ఆదాయం వచ్చింది. మొత్తంమీద 2.10 శాతం అంటే రూ.741 కోట్ల మేర ఆదాయం తగ్గిందని తేల్చారు.

ఆదాయం తగ్గుదల ఎక్సైజ్‌ శాఖలో అతి ఎక్కువగా నమోదైంది. ఈ శాఖలో రూ.360 కోట్లు కోతపడింది. రవాణా శాఖలో144, గనులు, భూగర్భ వనరుల శాఖలో 235, రెవెన్యూ శాఖలో 25, అటవీ శాఖలో రూ.102 కోట్ల చొప్పున ఆదాయం తగ్గింది. కీలకమైన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో రూ.91 కోట్లు, వాణిజ్య పన్నుల్లో రూ.35 కోట్లు చొప్పున ఆదాయం పెరిగింది.

ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పటికీ... ఆదాయాల పరంగా నిలదొక్కుకున్నామని.. ముఖ్యమంత్రి జగన్‌ సంతోషం వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న పన్ను వసూళ్ల కోసం ఒక నిర్దుష్ట విధానం రూపొందించాలని అధికారులకు సూచించారు. ఆర్టీసీలో ఏసీ బస్సుల సంఖ్య పెంచాలని నిర్ణయించారు. ఎర్రచందనానికి అదనపు విలువ జోడించడానికి ప్రయత్నించాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. ఆదాయం పెంపుపై గనుల శాఖ దృష్టి పెట్టాలని సూచించారు.

మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తుండటం వల్ల లైసెన్సు ఫీజు కోల్పోయామని అధికారులు ప్రస్తావించగా... మద్యాన్ని నియంత్రించాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. బార్ల సంఖ్యనూ తగ్గించాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతాల్లో... ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకే బార్లలో మద్యం అందుబాటులో ఉంచాలన్నారు. ఆ మేరకు విధి విధానాలు ఖరారు చేయాలన్న సీఎం... జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని ఆదేశించారు.

ఇదీ చదవండీ... వైకాపా సర్కారుకు కౌంట్‌డౌన్‌ మొదలైంది: చంద్రబాబు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.