ఏపీ సీఎం జగన్తో టాలీవుడ్ సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. నాగార్జునతోపాటు నిర్మాతలు ప్రీతంరెడ్డి, నిరంజన్రెడ్డి సహా మరికొందరు సీఎంతో సమావేశమైనట్టు సమాచారం. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిశారు. సీఎం జగన్తో కలిసి నాగార్జున మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా సినీ రంగానికి చెందిన వివిధ అంశాలపై ముఖ్యమంత్రితో ఆయన చర్చించినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: Credit Card: రెండో క్రెడిట్ కార్డు ఎప్పుడు తీసుకోవాలి?