ETV Bharat / city

Chandrababu: రైతులను ఆదుకోవటంలో జగన్ విఫలం: చంద్రబాబు

రాష్ట్ర ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవటంలో సీఎం జగన్ విఫలమయ్యారని మండిపడ్డారు. ఇప్పటికైనా కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలన్నారు. నదీ జలాల హక్కులను తాకట్టు పెట్టవద్దని ప్రభుత్వానికి హితవు పలికారు.

author img

By

Published : Jul 7, 2021, 3:23 PM IST

chandrababu
chandrababu

కరోనా సమయంలో రైతులను ఆదుకోవడంలో సీఎం జగన్ విఫలమయ్యారని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పంటల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు ఉత్పత్తుల్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. మోటార్లకు మీటర్లు బిగించే పథకం రద్దు చేయాలని సూచించారు. నదీ జలాల హక్కుల్ని తాకట్టు పెట్టరాదని హితవు పలికారు.

రాష్ట్రంలో ఏ పంటకూ మద్దతు ధర దక్కడం లేదన్న చంద్రబాబు.. రైతు భరోసా కింద రాష్ట్ర నిధుల నుంచి 13500 ఇస్తామని చెప్పి 7,500 మాత్రమే చెల్లింపులు చేస్తున్నారని ఎద్దేవా చేసారు. ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో విఫమయ్యారని ధ్వజమెత్తారు. రాయలసీమలో సబ్సీడీపై పంపిణీ చేసే డ్రిప్, యంత్ర పరికరాలను నిలిపివేశారని మండిపడ్డారు. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, 4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు చేస్తామని మాట తప్పారని విమర్శించారు.

రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో నిలవడం జగన్ రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని చంద్రబాబు కోరారు. సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్ పెంచాలని సూచించారు. కృష్ణా గోదావరి నీటి హక్కులను తాకట్ట పెట్టకుండా కాపాడాలని డిమాండ్ చేశారు. సర్పంచుల అధికారాలకు పెట్టిన కోతలను రద్దు చేయాలన్నారు. సహకార డైరీలను దారాదత్తం చేయకుండా ప్రభుత్వం నిర్వహించాలని స్పష్టం చేశారు.

కరోనా సమయంలో రైతులను ఆదుకోవడంలో సీఎం జగన్ విఫలమయ్యారని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పంటల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు ఉత్పత్తుల్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. మోటార్లకు మీటర్లు బిగించే పథకం రద్దు చేయాలని సూచించారు. నదీ జలాల హక్కుల్ని తాకట్టు పెట్టరాదని హితవు పలికారు.

రాష్ట్రంలో ఏ పంటకూ మద్దతు ధర దక్కడం లేదన్న చంద్రబాబు.. రైతు భరోసా కింద రాష్ట్ర నిధుల నుంచి 13500 ఇస్తామని చెప్పి 7,500 మాత్రమే చెల్లింపులు చేస్తున్నారని ఎద్దేవా చేసారు. ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో విఫమయ్యారని ధ్వజమెత్తారు. రాయలసీమలో సబ్సీడీపై పంపిణీ చేసే డ్రిప్, యంత్ర పరికరాలను నిలిపివేశారని మండిపడ్డారు. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, 4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు చేస్తామని మాట తప్పారని విమర్శించారు.

రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో నిలవడం జగన్ రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని చంద్రబాబు కోరారు. సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్ పెంచాలని సూచించారు. కృష్ణా గోదావరి నీటి హక్కులను తాకట్ట పెట్టకుండా కాపాడాలని డిమాండ్ చేశారు. సర్పంచుల అధికారాలకు పెట్టిన కోతలను రద్దు చేయాలన్నారు. సహకార డైరీలను దారాదత్తం చేయకుండా ప్రభుత్వం నిర్వహించాలని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

revanth: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.