అమరావతిని దక్షణ భారతదేశ విద్యా కేంద్రంగా తీర్చిదిద్దాలని రూపొందించిన విజన్ ఫలాలు ఇప్పుడు సాకరమవుతున్నందుకు సంతోషంగా ఉందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు(chandrababu) హర్షం వ్యక్తం చేశారు.
"అమరావతిలో ఏర్పాటైన విద్యాసంస్థల నుంచి విద్యార్థులు ఏడాదికి రూ.40 నుంచి 50లక్షల వేతనం పొందే అద్భుతమైన ఉద్యోగాలు పొందారని విని ఎంతో ఆనందించా. ఈ ప్రాంతంలో చదివిన చాలా మంది విద్యార్థులు తలెత్తుకునేలా గ్రాడ్యుయేషన్ పూర్తి చేయటంతో పాటు విదేశాల్లోని ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలలో ప్రవేశాలు పొంది వారి తల్లిదండ్రులు గర్వపడేలా చేశారు. అపార ప్రతభ కనబరిచిన విద్యార్థులు, విద్యాసంస్థలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. విద్యార్థుల భవిష్యత్తు లక్ష్యాలకు నా శుభాకాంక్షలు." అని ట్విట్టర్లో అభినందించారు.
ఇదీ చదవండి: