ETV Bharat / city

రాష్ట్రంలో రాజ్యాంగ తప్పిదాలు జరుగుతున్నాయి: చంద్రబాబు - chandra babu on panchayth elections

రాష్ట్రంలో రాజ్యాంగ హక్కులను కాలరాసే విధంగా పాలన సాగుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై యథేచ్ఛగా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో అధికారులు, ఉద్యోగులు పని చేయాల్సింది ఎన్నికల కమిషన్ పరిధిలోనే అని గుర్తు చేశారు. తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లోని గణతంత్ర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

chandra babu fires on ysrcp rule
chandra babu fires on ysrcp rule
author img

By

Published : Jan 26, 2021, 12:27 PM IST

Updated : Jan 26, 2021, 3:04 PM IST

తెదేపా కేంద్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం

రాష్ట్రంలో ప్రస్తుతం రాజ్యాంగ తప్పిదాలు జరుగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రాజ్యాంగ గౌరవాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని సూచించారు. స్వాతంత్య్ర ఉద్యమస్ఫూర్తితో రాజ్యాంగ రక్షణకు ప్రజలు మందుకు సాగాలని హితవు పలికారు. తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవంలో చంద్రబాబు పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు.

పౌరుల స్వేచ్ఛకు యథేచ్ఛగా ఉల్లంఘనలు జరుగుతుంటే పోలీసులు అందుకు సహకరిస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో అధికారులు, ఉద్యోగులు పని చేయాల్సింది ఎన్నికల కమిషన్ పరిధిలోనే అని గుర్తు చేశారు.

"సీఎం జగన్ పాల్పడుతున్న రాజ్యాంగ ఉల్లంఘనలకు ప్రాణాలు అడ్డుపెట్టైనా అడ్డుకుంటాం" అని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేసారు. డీజీపీకి అరెస్ట్ వారెంట్ అనే పరిస్థితి రాష్ట్రంలో ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఐపీసీ బదులు జగన్ పీనల్ కోడ్ అమలు చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో రైతులు రోడ్డెక్కి పరిస్థితి మంచిది కాదని... కేంద్రం రైతుల ఆందోళనను పరిగణనలోకి తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.

తెదేపా అధినేత చంద్రబాబు

ఇదీ చదవండి: విజయవాడలో గణతంత్ర వేడుకలు.. జెండా ఆవిష్కరించిన గవర్నర్

తెదేపా కేంద్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం

రాష్ట్రంలో ప్రస్తుతం రాజ్యాంగ తప్పిదాలు జరుగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రాజ్యాంగ గౌరవాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని సూచించారు. స్వాతంత్య్ర ఉద్యమస్ఫూర్తితో రాజ్యాంగ రక్షణకు ప్రజలు మందుకు సాగాలని హితవు పలికారు. తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవంలో చంద్రబాబు పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు.

పౌరుల స్వేచ్ఛకు యథేచ్ఛగా ఉల్లంఘనలు జరుగుతుంటే పోలీసులు అందుకు సహకరిస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో అధికారులు, ఉద్యోగులు పని చేయాల్సింది ఎన్నికల కమిషన్ పరిధిలోనే అని గుర్తు చేశారు.

"సీఎం జగన్ పాల్పడుతున్న రాజ్యాంగ ఉల్లంఘనలకు ప్రాణాలు అడ్డుపెట్టైనా అడ్డుకుంటాం" అని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేసారు. డీజీపీకి అరెస్ట్ వారెంట్ అనే పరిస్థితి రాష్ట్రంలో ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఐపీసీ బదులు జగన్ పీనల్ కోడ్ అమలు చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో రైతులు రోడ్డెక్కి పరిస్థితి మంచిది కాదని... కేంద్రం రైతుల ఆందోళనను పరిగణనలోకి తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.

తెదేపా అధినేత చంద్రబాబు

ఇదీ చదవండి: విజయవాడలో గణతంత్ర వేడుకలు.. జెండా ఆవిష్కరించిన గవర్నర్

Last Updated : Jan 26, 2021, 3:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.