ETV Bharat / city

కొవిడ్​-19 వైరస్: తెలంగాణ ప్రభుత్వ సమన్వయ సమావేశం - కొవిడ్​-19

కొవిడ్​-19 వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ ప్రభుత్వ సమన్వయ సమావేశం జరిగింది. హైదరాబాద్​లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో వైద్య, ఆరోగ్య, పురపాలక, పంచాయతీరాజ్ శాఖాధిపతులతోపాటు ఇతర అధికారులతో మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎస్ సోమేశ్​ కుమార్ సమావేశమయ్యారు. వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలు, అనుమానితులకు పరీక్షలు, ముందు జాగ్రత్త చర్యలు, ప్రజల్లో అవగాహన కల్పించడం సహా పలు అంశాలపై చర్చించారు.

cabinet-sub-committee-meet-about-karona-virus
కొవిడ్​-19 వైరస్: తెలంగాణ ప్రభుత్వ సమన్వయ సమావేశం
author img

By

Published : Mar 3, 2020, 1:54 PM IST

కొవిడ్​-19 వైరస్: తెలంగాణ ప్రభుత్వ సమన్వయ సమావేశం

కొవిడ్​-19 విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ మంత్రులు కేటీఆర్​, ఈటల రాజేందర్​, ఎర్రబెల్లి దయాకర్​ రావు పేర్కొన్నారు. వైరస్​ నియంత్రణకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని తెలిపారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారి సహాయార్థం ప్రత్యేక హెల్ప్​లైన్ ఏర్పాటు చేయాలని మంత్రుల సూచించారు. 24 గంటల పాటు పూర్తి స్థాయిలో నడిచేలా కాల్ సెంటర్ ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న కాల్ సెంటర్ సామర్థ్యాన్ని మరింతగా పెంచాలని అధికారులను ఆదేశించారు.

గతంలో వచ్చిన ఇతర వైరస్​లతో పోల్చితే కొవిడ్​-19 వైరస్​లో మరణాల రేటు అతి తక్కువగా ఉంటుందని తెలిపారు. కరోనా వస్తే చనిపోతారన్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని అన్నారు. ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో కొవిడ్​-19 వైద్యానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలను చైతన్యం చేసేలా ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టాలని సమాచార, పౌరసంబంధాల శాఖ అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్​, రాష్ట్రంలోని పురపాలికల్లో పెద్ద ఎత్తున హోర్డింగ్​లు ఏర్పాటు చేయాలని మంత్రులు సూచించారు. కొవిడ్​-19 సమస్యపై అసత్యాలను ప్రచారం చేసే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రులు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళనలు

కొవిడ్​-19 వైరస్: తెలంగాణ ప్రభుత్వ సమన్వయ సమావేశం

కొవిడ్​-19 విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ మంత్రులు కేటీఆర్​, ఈటల రాజేందర్​, ఎర్రబెల్లి దయాకర్​ రావు పేర్కొన్నారు. వైరస్​ నియంత్రణకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని తెలిపారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారి సహాయార్థం ప్రత్యేక హెల్ప్​లైన్ ఏర్పాటు చేయాలని మంత్రుల సూచించారు. 24 గంటల పాటు పూర్తి స్థాయిలో నడిచేలా కాల్ సెంటర్ ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న కాల్ సెంటర్ సామర్థ్యాన్ని మరింతగా పెంచాలని అధికారులను ఆదేశించారు.

గతంలో వచ్చిన ఇతర వైరస్​లతో పోల్చితే కొవిడ్​-19 వైరస్​లో మరణాల రేటు అతి తక్కువగా ఉంటుందని తెలిపారు. కరోనా వస్తే చనిపోతారన్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని అన్నారు. ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో కొవిడ్​-19 వైద్యానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలను చైతన్యం చేసేలా ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టాలని సమాచార, పౌరసంబంధాల శాఖ అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్​, రాష్ట్రంలోని పురపాలికల్లో పెద్ద ఎత్తున హోర్డింగ్​లు ఏర్పాటు చేయాలని మంత్రులు సూచించారు. కొవిడ్​-19 సమస్యపై అసత్యాలను ప్రచారం చేసే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రులు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళనలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.