ETV Bharat / city

'అన్యమతస్థుల డిక్లరేషన్​పై అనాలోచిత వ్యాఖ్యలు సరికాదు'

author img

By

Published : Sep 19, 2020, 8:48 PM IST

అన్యమతస్థుల డిక్లరేషన్​ తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలను భాజపా ఖండిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ట్వీట్ చేశారు. ఈ విషయం అన్యమతస్థులందరికీ సంబంధించిందన్న ఆయన.. జాగ్రత్తగా ప్రకటన చేయాల్సిన సందర్భంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నారు.

somuverraju
somuverraju

అన్యమతస్థులకు డిక్లరేషన్‌ అక్కర్లేదని...భక్తి విశ్వాసాలతో శ్రీవారిని దర్శించుకోవచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ సుబ్బారెడ్డి ప్రకటించడాన్ని భాజపా ఖండిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ విషయం యావత్ భారతదేశంలోని అన్యమతస్థులకు వర్తించే వ్యవహారమని, ఇది గమనించి ప్రకటన చేయాల్సిన సందర్భంలో వివాదాస్పదమైనటువంటి అంశాన్ని తితిదే ఛైర్మన్ ప్రస్తావించడం అనాలోచిత వైఖరిగా విమర్శించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం తిరుమలను సందర్శించినప్పుడు.. రిజిస్టర్‌లో సంతకం చేసి స్వామిని దర్శించుకున్నారని తెలిపారు.

అన్యమతస్థులకు డిక్లరేషన్‌ అక్కర్లేదని...భక్తి విశ్వాసాలతో శ్రీవారిని దర్శించుకోవచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ సుబ్బారెడ్డి ప్రకటించడాన్ని భాజపా ఖండిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ విషయం యావత్ భారతదేశంలోని అన్యమతస్థులకు వర్తించే వ్యవహారమని, ఇది గమనించి ప్రకటన చేయాల్సిన సందర్భంలో వివాదాస్పదమైనటువంటి అంశాన్ని తితిదే ఛైర్మన్ ప్రస్తావించడం అనాలోచిత వైఖరిగా విమర్శించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం తిరుమలను సందర్శించినప్పుడు.. రిజిస్టర్‌లో సంతకం చేసి స్వామిని దర్శించుకున్నారని తెలిపారు.

సోము వీర్రాజు ట్వీట్
సోము వీర్రాజు ట్వీట్

ఇదీ చదవండి : 'సీఎం జగన్ మాత్రమే డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నా...'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.