ETV Bharat / city

Anandaiah Medicine: ఆనందయ్య మందు నివేదికలో ఏముంది..!

author img

By

Published : May 29, 2021, 1:34 PM IST

ఆనందయ్య ఔషదంపై నేడు ఆయుష్ నివేదిక వెలువడనుంది. ఆనందయ్య మందు వాడిన వారికి ఎటువంటి నష్టం కలగలేదని ఆయుష్ ఉన్నతస్థాయి అధికారుల బృందం ఇప్పటికే ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే కొవిడ్ మందుగా మార్పు చేస్తారా లేదా వ్యాధి నిరోధక శక్తిగా మందును పంపిణీ చేస్తారా అనే రెండు అంశాలపైనే ఉన్నతాధికారులు సుదీర్ఘ చర్చను సాగిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పడు తుది నివేదికలో ఏముంటుందో అనేది ఆసక్తికరంగా మారింది.

Anandayya
ఆనందయ్య

ఆనందయ్య మందుపై తుది నివేదికలో ఏముంటుందన్నది ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా మారింది. ఆయుష్‌ నిపుణుల విభాగం శనివారం ఆనందయ్య మందుపై తుది నివేదిక ఇస్తున్నట్టు ప్రకటించింది. ఆయుష్‌ శనివారం ప్రభుత్వానికి తుది నివేదిక ఇచ్చినప్పటికీ అధికారికంగా అందులోని అంశాలు బహిర్గతం అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయుష్‌ విభాగం ప్రాధమిక పరిశీలన అనంతరం ఇచ్చిన నివేదికలో ఈ మందు మూలికల మిశ్రమేనని ఆయుర్వేదం కాదని చాలా స్పష్టంగా ఇప్పటికే తెలిపారు. ఈ మందులో కలిపిన మూలికల గుణాలు మాత్రం హానికరం కాదని నిర్థారించారు. అవి ఆయుర్వేద వైద్యంలో వాడుతున్నవేనని కూడా చెప్పారు.

ప్రభుత్వం కూడా ఆనందయ్య మందు విషయంలో సానుకూల వైఖరితోనే ఉంది. ఆనందయ్య ఆయుర్వేద వైద్యుడు కాదు. ఆయనకు ఏ భారతీయ వైద్య విధానంలోనూ పట్టా లేదు. ఈ పరిస్థితిలో ఆనందయ్య మందుకు ప్రామాణిక సర్టిఫికెట్టు ఇవ్వడం ఆయుష్‌ విభాగానికి సాధ్యం కాదు. మందుల తయారీకి అనుసరించాల్సిన విధి విధానాలు చట్ట ప్రకారం లేకుంటే దాన్ని ప్రామాణికతకు అవకాశం లేదు. మరోవైపు రాష్ట్ర హైకోర్టు కూడా ఆనందయ్య మందుపై ఆయుష్‌ తుది నివేదిక కోసం ఎదురు చూస్తోంది. ఈ మందును కేంద్ర – రాష్ట్రాలు ఎలా గుర్తిస్తాయన్న అంశంపై ఒక ఆసక్తి నెలకొంది. ఈ మందు కోసం నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు ఎవరూ రావద్దని ఆనందయ్య కరోనా బాధిత కుటుంబీకులను కోరారు. ఈ మందు తయారీకి తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఇప్పటికే ముందుకు వచ్చింది. కరోనా బాధితులు చాలా మంది ఆనందయ్య మందు కోసం ఎదురు చూస్తున్నారు.

ఈ నెల 21న ఒక్కరోజు మాత్రమే ఆనందయ్య మందు పంపిణీ చేశారు. ఆ రోజు కూడా గందరగోళం పరిస్థితుల్లో నిలివేశారు. ఈ ప్రతికూల పరిస్థితులలో ఆనందయ్యకు గట్టి భద్రత కల్పించారు పోలీసులు. కృష్ణపట్నం గ్రామంలో 144సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈ రోజు తెల్లవారు జామున 4.30గంటల సమయంలో ఆనందయ్యను గుట్టుచప్పుడు కాకుండా గ్రామం నుంచి బయటకు తీసుకువచ్చారు. రహస్య ప్రదేశంలో ఉంచారు. మందుకోసం వచ్చే వారి నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని.. నివేదిక వచ్చే వరకు ఆనందయ్య కదలికలు బయటకు తెలియకపోవడం మంచిదని పోలీసులు సూచించారు. ఇదిలావుంటే మరోవైపు ఆనందయ్య మందు లాంటిదే మేమూ ఇస్తాం అంటూ సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. దీంతో ఆనందయ్య మందుపై వచ్చే నివేదిక కోసం చాలామంది ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఆనందయ్య మందుపై తుది నివేదికలో ఏముంటుందన్నది ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా మారింది. ఆయుష్‌ నిపుణుల విభాగం శనివారం ఆనందయ్య మందుపై తుది నివేదిక ఇస్తున్నట్టు ప్రకటించింది. ఆయుష్‌ శనివారం ప్రభుత్వానికి తుది నివేదిక ఇచ్చినప్పటికీ అధికారికంగా అందులోని అంశాలు బహిర్గతం అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయుష్‌ విభాగం ప్రాధమిక పరిశీలన అనంతరం ఇచ్చిన నివేదికలో ఈ మందు మూలికల మిశ్రమేనని ఆయుర్వేదం కాదని చాలా స్పష్టంగా ఇప్పటికే తెలిపారు. ఈ మందులో కలిపిన మూలికల గుణాలు మాత్రం హానికరం కాదని నిర్థారించారు. అవి ఆయుర్వేద వైద్యంలో వాడుతున్నవేనని కూడా చెప్పారు.

ప్రభుత్వం కూడా ఆనందయ్య మందు విషయంలో సానుకూల వైఖరితోనే ఉంది. ఆనందయ్య ఆయుర్వేద వైద్యుడు కాదు. ఆయనకు ఏ భారతీయ వైద్య విధానంలోనూ పట్టా లేదు. ఈ పరిస్థితిలో ఆనందయ్య మందుకు ప్రామాణిక సర్టిఫికెట్టు ఇవ్వడం ఆయుష్‌ విభాగానికి సాధ్యం కాదు. మందుల తయారీకి అనుసరించాల్సిన విధి విధానాలు చట్ట ప్రకారం లేకుంటే దాన్ని ప్రామాణికతకు అవకాశం లేదు. మరోవైపు రాష్ట్ర హైకోర్టు కూడా ఆనందయ్య మందుపై ఆయుష్‌ తుది నివేదిక కోసం ఎదురు చూస్తోంది. ఈ మందును కేంద్ర – రాష్ట్రాలు ఎలా గుర్తిస్తాయన్న అంశంపై ఒక ఆసక్తి నెలకొంది. ఈ మందు కోసం నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు ఎవరూ రావద్దని ఆనందయ్య కరోనా బాధిత కుటుంబీకులను కోరారు. ఈ మందు తయారీకి తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఇప్పటికే ముందుకు వచ్చింది. కరోనా బాధితులు చాలా మంది ఆనందయ్య మందు కోసం ఎదురు చూస్తున్నారు.

ఈ నెల 21న ఒక్కరోజు మాత్రమే ఆనందయ్య మందు పంపిణీ చేశారు. ఆ రోజు కూడా గందరగోళం పరిస్థితుల్లో నిలివేశారు. ఈ ప్రతికూల పరిస్థితులలో ఆనందయ్యకు గట్టి భద్రత కల్పించారు పోలీసులు. కృష్ణపట్నం గ్రామంలో 144సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈ రోజు తెల్లవారు జామున 4.30గంటల సమయంలో ఆనందయ్యను గుట్టుచప్పుడు కాకుండా గ్రామం నుంచి బయటకు తీసుకువచ్చారు. రహస్య ప్రదేశంలో ఉంచారు. మందుకోసం వచ్చే వారి నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని.. నివేదిక వచ్చే వరకు ఆనందయ్య కదలికలు బయటకు తెలియకపోవడం మంచిదని పోలీసులు సూచించారు. ఇదిలావుంటే మరోవైపు ఆనందయ్య మందు లాంటిదే మేమూ ఇస్తాం అంటూ సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. దీంతో ఆనందయ్య మందుపై వచ్చే నివేదిక కోసం చాలామంది ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఇదీ చదవండి:

Cocktail antibodies: కాక్‌టెయిల్‌ యాంటీ బాడీస్‌తో కరోనా రోగుల్లో సత్ఫలితాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.