వైకాపా ప్రభుత్వం 10 లక్షల పింఛన్లకు ఎసరు పెట్టిందని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆరోపించారు. పలు సాకులతో 2 లక్షలు కోత కోశారని.. ఇప్పుడు మరిన్ని కోతలకు రంగం సిద్ధం చేశారని విమర్శించారు. అక్టోబర్ నెల నుంచి అయినా వృద్ధులకు పింఛన్లు ఇవ్వాలని శైలజనాథ్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం 54 లక్షల పెన్షన్లు ఇవ్వగా.. వైకాపా ప్రభుత్వం వచ్చీ రాగానే.. 4 లక్షల పింఛన్లు అనర్హమనే కారణాలు చెప్పి తొలగించిందన్నారు. ఆరంచెల వ్యాలిడేషన్ను అమల్లోకి తెచ్చి వైకాపా ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్లు తొలగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే అర్హులైన వారందరికీ పింఛన్లు ఇవ్వాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: