ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9PM

author img

By

Published : Sep 20, 2021, 9:28 PM IST

Updated : Sep 20, 2021, 9:40 PM IST

.

ప్రధాన వార్తలు @ 9PM
ప్రధాన వార్తలు @ 9PM
  • CM Jagan: ఇళ్ల నిర్మాణ రుణాలు తీసుకున్నవారికి వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌: సీఎం జగన్
    గతంలో ప్రభుత్వం నుంచి ఇల్లు పొందిన వారికి వాటిపై హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 60 లక్షల మంది లబ్ధిదారులకు వన్‌ టైం సెటిల్‌మెంట్‌ చేయాలని.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలనూ వేగవంతం చేయాలన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • సొంత పార్టీ ఎంపీపై ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు
    తూర్పుగోదావరి జిల్లా రాజానగరం వైకాపా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సొంత పార్టీ ఎంపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమహేంద్రవరంలో వైకాపాను ఎంపీ భరత్ సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. తెదేపా ఎమ్మెల్యేతో కలిసి భరత్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • ప్రజలకు న్యాయం జరగడం లేదనే ఎన్నికల బహిష్కరణ: చంద్రబాబు
    నేరాలు చేయడం వైఎస్‌ జగన్‌కు అలవాటేనని తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మండిపడ్డారు. వైకాపాను నమ్మి ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చారని...ఇప్పుడు ఆ పార్టీకి అసలు ఓటువేయోద్దని అనుకుంటున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏకపక్షంగా ఎన్నికలు జరిగాయని ఆరోపించారు. ప్రజలకు న్యాయం జరగట్లేదనే.. తెదేపా పరిషత్ ఎన్నికలను బహిష్కరించినట్లు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • Perni Nani: 'నిర్దేశించిన రేట్లకే ఆన్​లైన్​లో సినిమా టికెట్లు..త్వరలోనే అమలు'
    సచివాలయంలో సినీ నిర్మాతలు, థియేటర్ యజమానులతో మంత్రి పేర్ని నాని భేటీ అయ్యారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, సినీ నిర్మాతలు దిల్ రాజు, సి.కళ్యాణ్, ఆన్‌లైన్‌ టిక్కెట్ల వ్యవహారంపై సినీ పెద్దలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సమావేశం ఫలప్రదంగా ముగిసిందని...భేటీలో పాల్గొన్న నిర్మాతలు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • శుక్రవారం మోదీ-బైడెన్​ భేటీ.. అఫ్గాన్​పై కీలక చర్చ!
    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో ప్రధాని నరేంద్ర భేటీ ఖరారైంది. సెప్టెంబర్​ 24 ఇరు దేశాల అధినేతలు సమావేశం కానున్నారు. ఈ మేరకు శ్వేతసౌధం అధికారిక ప్రకటన విడుదల చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • త్వరలో చిన్నారులకూ ఫైజర్ టీకా- ట్రయల్స్​లో సత్ఫలితాలు!
    ఐదేళ్ల నుంచి 11 ఏళ్ల వయసు పిల్లల్లో (Pfizer kids under 12) ఫైజర్ టీకా సురక్షితంగా పనిచేస్తోందని ఆ సంస్థ (Pfizer Covid vaccine) తెలిపింది. వీరిపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు సానుకూలంగా ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసుకోనున్నట్లు స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • 'వచ్చే నెల నుంచి విదేశాలకు భారత్​ టీకా సాయం'
    భారత్​లో అదనంగా ఉన్న కొవిడ్ టీకా డోసులను(vaccine maitri) అక్టోబర్​ నుంచి డిసెంబర్ మధ్య విదేశాలకు ఎగుమతి చేస్తామని కేంద్రం తెలిపింది. అయితే.. దేశ పౌరులకు టీకా అందించడమే తమ ప్రథమ ప్రాధాన్యమని చెప్పింది. దేశంలో జరుగతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం.. ప్రపంచ దేశాలకు రోల్​ మోడల్​గా నిలుస్తుందని పేర్కొంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • తాలిబన్ల​ గుండెల్లో 'ఇస్లామిక్​ స్టేట్​' గుబులు!
    ఇస్లామిక్​ స్టేట్​.. ఇప్పుడు ఈ పేరు వింటుంటే తాలిబన్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి(taliban isis news). తాలిబన్ల​ వాహనాలు, ఫైటర్లే లక్ష్యంగా బాంబు దాడులతో విరుచుకుపడుతోంది ఐఎస్​(taliban isis difference). ఆర్థిక సంక్షోభం, భద్రతా సమస్యలతో అల్లాడుతున్న తాలిబన్లకు ఇస్లామిక్​ స్టేట్​ తలనొప్పి వ్యవహారంగా మారింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • వామ్మో! బిగ్‌బాస్‌కు సల్మాన్‌ పారితోషికం అంతనా?
    హిందీ బిగ్​బాస్​కు(hindi bigg boss 2021) హోస్ట్​గా వ్యవహరిస్తున్న సల్మాన్​ ఖాన్(bigg boss salman remuneration)​.. ఈ షోకు రెమ్యునరేషన్​ ఎంత తీసుకుంటారో తెలుసా? తెలిస్తే షాక్​ అవ్వకుండా ఉండలేరు. ఇంతకీ ఆయన పారితోషికం ఎంతంటే? పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • virat kohli records: కోహ్లీ నయా రికార్డు.. ఒకే ఒక్కడిగా ఘనత!
    ఐపీఎల్​లో మరో రికార్డు సాధించాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ(virat kohli rcb news). ఆర్సీబీ తరఫున 200 మ్యాచ్​లు(virat kohli records) ఆడిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. లీగ్​లో మరే ఆటగాడు కూడా ఇప్పటివరకు ఓ ఫ్రాంచైజీ తరఫున ఇన్ని మ్యాచ్​లు ఆడలేదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • CM Jagan: ఇళ్ల నిర్మాణ రుణాలు తీసుకున్నవారికి వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌: సీఎం జగన్
    గతంలో ప్రభుత్వం నుంచి ఇల్లు పొందిన వారికి వాటిపై హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 60 లక్షల మంది లబ్ధిదారులకు వన్‌ టైం సెటిల్‌మెంట్‌ చేయాలని.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలనూ వేగవంతం చేయాలన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • సొంత పార్టీ ఎంపీపై ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు
    తూర్పుగోదావరి జిల్లా రాజానగరం వైకాపా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సొంత పార్టీ ఎంపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమహేంద్రవరంలో వైకాపాను ఎంపీ భరత్ సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. తెదేపా ఎమ్మెల్యేతో కలిసి భరత్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • ప్రజలకు న్యాయం జరగడం లేదనే ఎన్నికల బహిష్కరణ: చంద్రబాబు
    నేరాలు చేయడం వైఎస్‌ జగన్‌కు అలవాటేనని తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మండిపడ్డారు. వైకాపాను నమ్మి ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చారని...ఇప్పుడు ఆ పార్టీకి అసలు ఓటువేయోద్దని అనుకుంటున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏకపక్షంగా ఎన్నికలు జరిగాయని ఆరోపించారు. ప్రజలకు న్యాయం జరగట్లేదనే.. తెదేపా పరిషత్ ఎన్నికలను బహిష్కరించినట్లు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • Perni Nani: 'నిర్దేశించిన రేట్లకే ఆన్​లైన్​లో సినిమా టికెట్లు..త్వరలోనే అమలు'
    సచివాలయంలో సినీ నిర్మాతలు, థియేటర్ యజమానులతో మంత్రి పేర్ని నాని భేటీ అయ్యారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, సినీ నిర్మాతలు దిల్ రాజు, సి.కళ్యాణ్, ఆన్‌లైన్‌ టిక్కెట్ల వ్యవహారంపై సినీ పెద్దలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సమావేశం ఫలప్రదంగా ముగిసిందని...భేటీలో పాల్గొన్న నిర్మాతలు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • శుక్రవారం మోదీ-బైడెన్​ భేటీ.. అఫ్గాన్​పై కీలక చర్చ!
    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో ప్రధాని నరేంద్ర భేటీ ఖరారైంది. సెప్టెంబర్​ 24 ఇరు దేశాల అధినేతలు సమావేశం కానున్నారు. ఈ మేరకు శ్వేతసౌధం అధికారిక ప్రకటన విడుదల చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • త్వరలో చిన్నారులకూ ఫైజర్ టీకా- ట్రయల్స్​లో సత్ఫలితాలు!
    ఐదేళ్ల నుంచి 11 ఏళ్ల వయసు పిల్లల్లో (Pfizer kids under 12) ఫైజర్ టీకా సురక్షితంగా పనిచేస్తోందని ఆ సంస్థ (Pfizer Covid vaccine) తెలిపింది. వీరిపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు సానుకూలంగా ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసుకోనున్నట్లు స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • 'వచ్చే నెల నుంచి విదేశాలకు భారత్​ టీకా సాయం'
    భారత్​లో అదనంగా ఉన్న కొవిడ్ టీకా డోసులను(vaccine maitri) అక్టోబర్​ నుంచి డిసెంబర్ మధ్య విదేశాలకు ఎగుమతి చేస్తామని కేంద్రం తెలిపింది. అయితే.. దేశ పౌరులకు టీకా అందించడమే తమ ప్రథమ ప్రాధాన్యమని చెప్పింది. దేశంలో జరుగతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం.. ప్రపంచ దేశాలకు రోల్​ మోడల్​గా నిలుస్తుందని పేర్కొంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • తాలిబన్ల​ గుండెల్లో 'ఇస్లామిక్​ స్టేట్​' గుబులు!
    ఇస్లామిక్​ స్టేట్​.. ఇప్పుడు ఈ పేరు వింటుంటే తాలిబన్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి(taliban isis news). తాలిబన్ల​ వాహనాలు, ఫైటర్లే లక్ష్యంగా బాంబు దాడులతో విరుచుకుపడుతోంది ఐఎస్​(taliban isis difference). ఆర్థిక సంక్షోభం, భద్రతా సమస్యలతో అల్లాడుతున్న తాలిబన్లకు ఇస్లామిక్​ స్టేట్​ తలనొప్పి వ్యవహారంగా మారింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • వామ్మో! బిగ్‌బాస్‌కు సల్మాన్‌ పారితోషికం అంతనా?
    హిందీ బిగ్​బాస్​కు(hindi bigg boss 2021) హోస్ట్​గా వ్యవహరిస్తున్న సల్మాన్​ ఖాన్(bigg boss salman remuneration)​.. ఈ షోకు రెమ్యునరేషన్​ ఎంత తీసుకుంటారో తెలుసా? తెలిస్తే షాక్​ అవ్వకుండా ఉండలేరు. ఇంతకీ ఆయన పారితోషికం ఎంతంటే? పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • virat kohli records: కోహ్లీ నయా రికార్డు.. ఒకే ఒక్కడిగా ఘనత!
    ఐపీఎల్​లో మరో రికార్డు సాధించాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ(virat kohli rcb news). ఆర్సీబీ తరఫున 200 మ్యాచ్​లు(virat kohli records) ఆడిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. లీగ్​లో మరే ఆటగాడు కూడా ఇప్పటివరకు ఓ ఫ్రాంచైజీ తరఫున ఇన్ని మ్యాచ్​లు ఆడలేదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
Last Updated : Sep 20, 2021, 9:40 PM IST

For All Latest Updates

TAGGED:

Top 9
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.