ETV Bharat / city

రాష్ట్రంలో తగ్గని కరోనా ఉద్ధృతి... కొత్తగా 8,835 పాజిటివ్ కేసులు

author img

By

Published : Sep 16, 2020, 5:18 PM IST

Updated : Sep 16, 2020, 6:21 PM IST

ఆరు లక్షలకు చేరువలో కరోనా కేసులు
ఆరు లక్షలకు చేరువలో కరోనా కేసులు

17:17 September 16

ఆరు లక్షలకు చేరువలో కరోనా కేసులు

కరోనా బులెటిన్
కరోనా బులెటిన్

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,835 కరోనా కేసులు నమోదవ్వగా, 64 మంది మరణించారు.  కొత్త కేసులతో కలిపి కరోనా బాధితుల సంఖ్య 5,92,760కి చేరింది. కొవిడ్ మహమ్మారి బారిన పడి రాష్ట్రంలో ఇప్పటివరకు 5,105 మంది మృతి చెందారు. ప్రస్తుతం 90,279 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్​లో తెలిపింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 4,97,376 మంది కోలుకున్నారని పేర్కొంది. 24 గంటల వ్యవధిలో 75,013 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు స్పష్టం చేసింది.  ఈ పరీక్షలతో కలిపి మొత్తం 48,06,879 కరోనా పరీక్షలు నిర్వహించారు.  

జిల్లాల వారీగా కరోనా కేసులు

తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,421 కరోనా కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 1,051, ప్రకాశం జిల్లాలో 873 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 798, అనంతపురం జిల్లాలో 725, గుంటూరు జిల్లాలో 685, నెల్లూరు జిల్లాలో 562, విజయనగరం జిల్లాలో 544, కడప జిల్లాలో 536 కొవిడ్ కేసులు వచ్చాయి. శ్రీకాకుళం జిల్లాలో 495, కర్నూలు జిల్లాలో 424 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  

జిల్లాల వారీగా కరోనా మృతులు

గడిచిన 24 గంటల్లో కరోనాతో  చిత్తూరు జిల్లాలో 9, నెల్లూరు జిల్లాలో 7గురు మృతి చెందారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 6గురు చొప్పున, అనంతపురం, కడప, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు. శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో 5గురు, కర్నూలు జిల్లాలో నలుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురు కొవిడ్​ బారిన పడి మృతి చెందారు. విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు.  

ఇదీ చదవండి :   నాడు-నేడు పనులపై సమావేశంలో ఉపాధ్యాయురాలిపై దాడి


 


 

17:17 September 16

ఆరు లక్షలకు చేరువలో కరోనా కేసులు

కరోనా బులెటిన్
కరోనా బులెటిన్

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,835 కరోనా కేసులు నమోదవ్వగా, 64 మంది మరణించారు.  కొత్త కేసులతో కలిపి కరోనా బాధితుల సంఖ్య 5,92,760కి చేరింది. కొవిడ్ మహమ్మారి బారిన పడి రాష్ట్రంలో ఇప్పటివరకు 5,105 మంది మృతి చెందారు. ప్రస్తుతం 90,279 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్​లో తెలిపింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 4,97,376 మంది కోలుకున్నారని పేర్కొంది. 24 గంటల వ్యవధిలో 75,013 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు స్పష్టం చేసింది.  ఈ పరీక్షలతో కలిపి మొత్తం 48,06,879 కరోనా పరీక్షలు నిర్వహించారు.  

జిల్లాల వారీగా కరోనా కేసులు

తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,421 కరోనా కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 1,051, ప్రకాశం జిల్లాలో 873 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 798, అనంతపురం జిల్లాలో 725, గుంటూరు జిల్లాలో 685, నెల్లూరు జిల్లాలో 562, విజయనగరం జిల్లాలో 544, కడప జిల్లాలో 536 కొవిడ్ కేసులు వచ్చాయి. శ్రీకాకుళం జిల్లాలో 495, కర్నూలు జిల్లాలో 424 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  

జిల్లాల వారీగా కరోనా మృతులు

గడిచిన 24 గంటల్లో కరోనాతో  చిత్తూరు జిల్లాలో 9, నెల్లూరు జిల్లాలో 7గురు మృతి చెందారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 6గురు చొప్పున, అనంతపురం, కడప, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు. శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో 5గురు, కర్నూలు జిల్లాలో నలుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురు కొవిడ్​ బారిన పడి మృతి చెందారు. విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు.  

ఇదీ చదవండి :   నాడు-నేడు పనులపై సమావేశంలో ఉపాధ్యాయురాలిపై దాడి


 


 

Last Updated : Sep 16, 2020, 6:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.