ETV Bharat / city

అక్షరాస్యతలో ఏపీ వెనుకబాటు.. దేశంలో 22వ స్థానం! - AP ranks 22nd in literacy

దేశవ్యాప్తంగా అక్షరాస్యతలో ఏపీ వెనుకబడింది. జాతీయ గణాంక కార్యాలయ నివేదికలో 66.4 శాతం అక్షరాస్యతతో... దేశంలో 22వ స్థానంలో నిలిచింది.

AP lags behind in literacy
అక్షరాస్యతలో ఏపీ వెనుకబాటు
author img

By

Published : Sep 7, 2020, 8:26 AM IST

ఏడేళ్లు, ఆపై వయోధికుల అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడింది. 66.4శాతం అక్షరాస్యతతో దేశంలో 22వ స్థానంలో నిలిచింది. బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల కంటే దిగువకు పడిపోయింది. జాతీయ గణాంక కార్యాలయం ఈ ఏడాది జులై చివర్లో విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. జులై 2017 నుంచి జూన్‌ 2018 వరకు చేపట్టిన సర్వే వివరాలను ‘భారతదేశంలో విద్యపై గృహ వినియోగం’ పేరుతో నివేదిక రూపొందించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఏపీ అక్షరాస్యత 67.4% కాగా, ఈ నివేదికలో 66.4 శాతంగా తేల్చింది. ఇది జాతీయ సగటు అక్షరాస్యత (77.7%) కంటే తక్కువ. ఈ ఏడాది వాయిదా పడిన జనాభా లెక్కలు పూర్తయితే వాస్తవ గణాంకాలు వెల్లడయ్యే అవకాశం ఉండేది.

గ్రామీణంలో 60.4శాతమే

రాష్ట్రంలో గ్రామీణ పురుషుల్లో 67.5 శాతం, మహిళల్లో 53.4 శాతం మంది మాత్రమే అక్షరాస్యులు ఉన్నారు. పట్టణాలు, నగరాల్లోని పురుషుల్లో 86.3%, మహిళల్లో 73.1% చదువుకున్నవారు ఉన్నారు. గ్రామీణంలో సగటు అక్షరాస్యత 60.4% కాగా, పట్టణాల్లో 79.6%గా ఉంది. గ్రామీణం, పట్టణాల్లో కలిపి పురుషుల్లో 73.4%, మహిళల్లో 59.5% మంది అక్షరాస్యులుగా లెక్క తేలింది. పురుషులు, మహిళల అక్షరాస్యతలో పట్టణాల కంటే పల్లెల్లో వ్యత్యాసం ఎక్కువగా ఉంది. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు 82.9%, ఒడిశా 77.3%, కర్ణాటక 77.2%, తెలంగాణ 72.8% సగటు అక్షరాస్యత కలిగి ఉన్నాయి.

ఏడేళ్లు, ఆపై వయోధికుల అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడింది. 66.4శాతం అక్షరాస్యతతో దేశంలో 22వ స్థానంలో నిలిచింది. బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల కంటే దిగువకు పడిపోయింది. జాతీయ గణాంక కార్యాలయం ఈ ఏడాది జులై చివర్లో విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. జులై 2017 నుంచి జూన్‌ 2018 వరకు చేపట్టిన సర్వే వివరాలను ‘భారతదేశంలో విద్యపై గృహ వినియోగం’ పేరుతో నివేదిక రూపొందించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఏపీ అక్షరాస్యత 67.4% కాగా, ఈ నివేదికలో 66.4 శాతంగా తేల్చింది. ఇది జాతీయ సగటు అక్షరాస్యత (77.7%) కంటే తక్కువ. ఈ ఏడాది వాయిదా పడిన జనాభా లెక్కలు పూర్తయితే వాస్తవ గణాంకాలు వెల్లడయ్యే అవకాశం ఉండేది.

గ్రామీణంలో 60.4శాతమే

రాష్ట్రంలో గ్రామీణ పురుషుల్లో 67.5 శాతం, మహిళల్లో 53.4 శాతం మంది మాత్రమే అక్షరాస్యులు ఉన్నారు. పట్టణాలు, నగరాల్లోని పురుషుల్లో 86.3%, మహిళల్లో 73.1% చదువుకున్నవారు ఉన్నారు. గ్రామీణంలో సగటు అక్షరాస్యత 60.4% కాగా, పట్టణాల్లో 79.6%గా ఉంది. గ్రామీణం, పట్టణాల్లో కలిపి పురుషుల్లో 73.4%, మహిళల్లో 59.5% మంది అక్షరాస్యులుగా లెక్క తేలింది. పురుషులు, మహిళల అక్షరాస్యతలో పట్టణాల కంటే పల్లెల్లో వ్యత్యాసం ఎక్కువగా ఉంది. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు 82.9%, ఒడిశా 77.3%, కర్ణాటక 77.2%, తెలంగాణ 72.8% సగటు అక్షరాస్యత కలిగి ఉన్నాయి.

ఇదీ చదవండి:

విద్యా ప్రణాళికే ప్రగతికి చుక్కాని.. కానీ సవాళ్లెన్నో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.