ETV Bharat / city

'అమరావతిలో 70% నిర్మించిన భవనాలు పూర్తి చేయొచ్చు'

author img

By

Published : Feb 13, 2021, 9:10 AM IST

అమరావతిలో 70% నిర్మించిన భవనాలు పూర్తి చేయొచ్చని.. సీఎస్‌ కమిటీ భేటీలో పురపాలకశాఖ అధికారుల అంచనా వేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఆధ్వర్యంలోని ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో కూడిన 9 మంది కమిటీకి నివేదించారు.

amaravathi issue
amaravathi issue

అమరావతిలో నిర్మాణంలో ఉన్న అన్ని భవనాలు పూర్తి చేయాలంటే రూ.2,154 కోట్లు అవసరమని.. ఇప్పటికే 70 శాతం నిర్మించినవాటి మీద రూ.300 కోట్లు ఖర్చు చేస్తే అవి పూర్తయిపోతాయని పురపాలక శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఆధ్వర్యంలోని ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో కూడిన 9 మంది కమిటీకి నివేదించారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో కమిటీ తొలి భేటీలో ఈ అంశాన్ని వివరించారు. నిర్మాణంలో ఉన్న భవనాల్లో 70 శాతం కన్నా అధికంగా పని పూర్తయిన వాటిని తక్షణమే పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆదిత్యనాథ్‌ దాస్‌ ఆదేశించారు. మిగిలిన పనుల విషయంలో ఎలా ముందుకెళ్లాలో ఆయా కాంట్రాక్టర్లు, బ్యాంకర్లతో సమావేశమై మార్చి తొలి వారంలో జరిగే సమావేశం నాటికి వివరాలు సమర్పించాలని ఏఎంఆర్‌డీఏ అధికారులకు నిర్దేశించారు. అధికారులు కర్ణాటక, జమ్ము కశ్మీర్‌ రాష్ట్రాలకు వెళ్లి అక్కడ ఎలాంటి వసతులు కల్పించారో అధ్యయనం చేసి రావాలని సూచించారు.

వసతులు.. పరిమితులపై చర్చ

మూడు రాజధానుల్లో భాగంగా ప్రభుత్వం ప్రతిపాదించిన అమరావతి శాసన రాజధాని నిర్వహణకు కనీస వసతులు ఏమేం కావాలనేది చర్చించడమే ప్రధాన ఎజెండాగా కమిటీ సమావేశం జరిగింది. శాసన రాజధానికి ఏ మేరకు వసతులు కల్పించాలి, ప్రస్తుతం నిర్మిస్తున్న భవనాలు, ఇతరత్రా అంశాల్లో ఎంత మేరకు పరిమితం కావాలనే అంశాలపై మార్చి రెండో వారానికల్లా నివేదిక ఇవ్వాలని కమిటీ నిర్దేశించుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం మార్చి మొదటి వారంలోపు ఒకటి రెండుసార్లు సమావేశం కావాలని నిర్ణయానికి వచ్చారు. అమరావతి రైతులకు ఇబ్బంది కలగకుండా ఎలా ముందుకెళ్లాలి, న్యాయస్థానం ఉత్తర్వుల పరిధిలో ఏయే చర్యలు తీసుకోవాలనే అంశాలపైనా భేటీలో కొంత చర్చ జరిగినట్లు తెలిసింది.

నిర్మాణంలో ఉన్న భవనాల్లో ఏవేవి పూర్తి చేయాలి, వాటికి ఎంత సొమ్ము అవసరమవుతుంది.. బ్యాంకులతో సమన్వయం చేసుకుని నిధులు ఎలా తీసుకురావాలి, గుత్తేదారుల సమస్యలు ఎలా పరిష్కరించాలనేదీ చర్చించారు. ఏయే భవనాల నిర్మాణాలు నిలిపివేసే అవకాశం ఉందనే అంశంపైనా ప్రాథమిక చర్చ సాగింది. సమావేశంలో సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శులు ప్రవీణ్‌కుమార్‌, శశిభూషణ్‌ కుమార్‌, శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు, పట్టణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్‌, ఏఎంఆర్‌డీఏ కమిషనర్‌ లక్ష్మీనరసింహం ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్‌కుమార్‌, న్యాయశాఖ కార్యదర్శి సునీత తదితరులు పాల్గొన్నారు. అమరావతిలో బహుళ అంతస్థుల భవన సముదాయాలు, వాటి పురోగతి, నిధుల అవసరంపై పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి సమావేశంలో ప్రజంటేషన్‌ ఇచ్చారు.

ఇదీ చదవండి:

నేడు రాష్ట్రంలో రెండోదశ పంచాయతీ ఎన్నికలు

అమరావతిలో నిర్మాణంలో ఉన్న అన్ని భవనాలు పూర్తి చేయాలంటే రూ.2,154 కోట్లు అవసరమని.. ఇప్పటికే 70 శాతం నిర్మించినవాటి మీద రూ.300 కోట్లు ఖర్చు చేస్తే అవి పూర్తయిపోతాయని పురపాలక శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఆధ్వర్యంలోని ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో కూడిన 9 మంది కమిటీకి నివేదించారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో కమిటీ తొలి భేటీలో ఈ అంశాన్ని వివరించారు. నిర్మాణంలో ఉన్న భవనాల్లో 70 శాతం కన్నా అధికంగా పని పూర్తయిన వాటిని తక్షణమే పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆదిత్యనాథ్‌ దాస్‌ ఆదేశించారు. మిగిలిన పనుల విషయంలో ఎలా ముందుకెళ్లాలో ఆయా కాంట్రాక్టర్లు, బ్యాంకర్లతో సమావేశమై మార్చి తొలి వారంలో జరిగే సమావేశం నాటికి వివరాలు సమర్పించాలని ఏఎంఆర్‌డీఏ అధికారులకు నిర్దేశించారు. అధికారులు కర్ణాటక, జమ్ము కశ్మీర్‌ రాష్ట్రాలకు వెళ్లి అక్కడ ఎలాంటి వసతులు కల్పించారో అధ్యయనం చేసి రావాలని సూచించారు.

వసతులు.. పరిమితులపై చర్చ

మూడు రాజధానుల్లో భాగంగా ప్రభుత్వం ప్రతిపాదించిన అమరావతి శాసన రాజధాని నిర్వహణకు కనీస వసతులు ఏమేం కావాలనేది చర్చించడమే ప్రధాన ఎజెండాగా కమిటీ సమావేశం జరిగింది. శాసన రాజధానికి ఏ మేరకు వసతులు కల్పించాలి, ప్రస్తుతం నిర్మిస్తున్న భవనాలు, ఇతరత్రా అంశాల్లో ఎంత మేరకు పరిమితం కావాలనే అంశాలపై మార్చి రెండో వారానికల్లా నివేదిక ఇవ్వాలని కమిటీ నిర్దేశించుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం మార్చి మొదటి వారంలోపు ఒకటి రెండుసార్లు సమావేశం కావాలని నిర్ణయానికి వచ్చారు. అమరావతి రైతులకు ఇబ్బంది కలగకుండా ఎలా ముందుకెళ్లాలి, న్యాయస్థానం ఉత్తర్వుల పరిధిలో ఏయే చర్యలు తీసుకోవాలనే అంశాలపైనా భేటీలో కొంత చర్చ జరిగినట్లు తెలిసింది.

నిర్మాణంలో ఉన్న భవనాల్లో ఏవేవి పూర్తి చేయాలి, వాటికి ఎంత సొమ్ము అవసరమవుతుంది.. బ్యాంకులతో సమన్వయం చేసుకుని నిధులు ఎలా తీసుకురావాలి, గుత్తేదారుల సమస్యలు ఎలా పరిష్కరించాలనేదీ చర్చించారు. ఏయే భవనాల నిర్మాణాలు నిలిపివేసే అవకాశం ఉందనే అంశంపైనా ప్రాథమిక చర్చ సాగింది. సమావేశంలో సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శులు ప్రవీణ్‌కుమార్‌, శశిభూషణ్‌ కుమార్‌, శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు, పట్టణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్‌, ఏఎంఆర్‌డీఏ కమిషనర్‌ లక్ష్మీనరసింహం ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్‌కుమార్‌, న్యాయశాఖ కార్యదర్శి సునీత తదితరులు పాల్గొన్నారు. అమరావతిలో బహుళ అంతస్థుల భవన సముదాయాలు, వాటి పురోగతి, నిధుల అవసరంపై పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి సమావేశంలో ప్రజంటేషన్‌ ఇచ్చారు.

ఇదీ చదవండి:

నేడు రాష్ట్రంలో రెండోదశ పంచాయతీ ఎన్నికలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.