ETV Bharat / city

సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు.. పంచాయతీ కార్యదర్శే సబ్‌ రిజిస్ట్రార్‌ - గ్రామ/వార్డు సచివాలయాల్లోనే ఆస్తుల రిజిస్ట్రేషన్లు

ఆస్తుల రిజిస్ట్రేషన్లన్నీ ఇక నుంచి గ్రామ/వార్డు సచివాలయాల్లోనే నిర్వహించనున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో ఈ మేరకు పైలట్‌ ప్రాజెక్టును అమలు చేయనున్నారు.

All property registrations in village or ward secretariats in ap
సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు
author img

By

Published : Dec 21, 2020, 9:35 AM IST

ఆస్తుల రిజిస్ట్రేషన్లన్నీ ఇక గ్రామ/వార్డు సచివాలయాల్లోనే జరగనున్నాయి. అక్కడుండే పంచాయతీ కార్యదర్శులే సబ్‌ రిజిస్ట్రార్‌ విధులను నిర్వహించనున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో ఈ మేరకు పైలట్‌ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అక్కడి పంచాయతీ కార్యదర్శి సబ్‌రిజిస్ట్రార్‌ విధుల్ని నిర్వహిస్తారు. సహాయ సబ్‌రిజిస్ట్రార్‌గా డిజిటల్‌ అసిస్టెంట్‌ వ్యవహరిస్తారని రెవెన్యూ (రిజిస్ట్రేషన్‌) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ ఉత్తర్వులు జారీచేశారు. గ్రామ పరిధిలోని దస్తావేజుల రిజిస్ట్రేషన్‌, ఇతర అనుబంధ సేవలను వీరే చూస్తారన్నారు.

ఇదీ చదవండి:

ఆస్తుల రిజిస్ట్రేషన్లన్నీ ఇక గ్రామ/వార్డు సచివాలయాల్లోనే జరగనున్నాయి. అక్కడుండే పంచాయతీ కార్యదర్శులే సబ్‌ రిజిస్ట్రార్‌ విధులను నిర్వహించనున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో ఈ మేరకు పైలట్‌ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అక్కడి పంచాయతీ కార్యదర్శి సబ్‌రిజిస్ట్రార్‌ విధుల్ని నిర్వహిస్తారు. సహాయ సబ్‌రిజిస్ట్రార్‌గా డిజిటల్‌ అసిస్టెంట్‌ వ్యవహరిస్తారని రెవెన్యూ (రిజిస్ట్రేషన్‌) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ ఉత్తర్వులు జారీచేశారు. గ్రామ పరిధిలోని దస్తావేజుల రిజిస్ట్రేషన్‌, ఇతర అనుబంధ సేవలను వీరే చూస్తారన్నారు.

ఇదీ చదవండి:

వందేళ్ల తర్వాత రాష్ట్రంలో భూముల సర్వే..నేడు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.