ETV Bharat / city

Agency corona: సంప్రదాయ నియమాలతో కరోనాకు ఆదివాసీల చెక్!

author img

By

Published : Jun 2, 2021, 7:59 AM IST

అనాదిగా వస్తున్న సంప్రదాయాలు, ఆచారాలు ఆ ప్రజలకు వరంగా మారాయి. ఏళ్లు గడిచినా.. మారని జీవన విధానమే వారు ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడుతోంది. పల్లె, పట్టణం తేడా లేకుండా కరోనా కల్లోలం సృష్టిస్తుంటే... తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్‌ (Adilabad) జిల్లాలోని ఆదివాసీ గ్రామాల్లో మాత్రం కొవిడ్‌ (Covid) ప్రభావం చాలా తక్కువగా ఉంది.

agency corona
కరోనాకు చెక్ పెట్టిన ఆదివాసీలు

తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్‌ (Adilabad) జిల్లా ఉట్నూర్‌ ఏజెన్సీ ప్రాంతాల్లో కరోనా (Corona) ప్రభావం ఎక్కువగా కనిపించటం లేదు. ఐటీడీఏ (ITDA) పరిధిలోని 31 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒక్క కరోనా (Corona) మరణం సంభవించలేదు. అటవీ ప్రాంతానికి ఆనుకొని గ్రామాలు ఉండటం... కాళ్లు, చేతులు శుభ్రం చేసుకుంటే తప్ప ఇంట్లోకి వెళ్లకపోవడం... అత్యవసరముంటే తప్ప మరో ఊరికి వెళ్లకపోవడం వంటి వారి జీవన విధానమే... గిరిజన పల్లెల్లో వైరస్‌ కట్టడికి కారణమైంది.

కట్టుదిట్టమైన ఏర్పాట్లు...

ఆదిలాబాద్‌, కుమురం భీం, మంచిర్యాల జిల్లాల పరిధిలో 31 ఏజెన్సీ (Agency) ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో వైద్యశాఖ సేవలందిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఏజెన్సీ పరిధిలో సుమారు లక్షకుపైగా కరోనా (Corona)పరీక్షలు చేయగా... కేవలం 7,269 మందికి వైరస్‌ నిర్ధరణ అయ్యింది. మహమ్మారి బారిన పడి 56 మంది మరణించారు. ఇందులో 11 పీహెచ్​సీ (PHC)లను పరిగణలోకి తీసుకుంటే.. 30 వేల పరీక్షలు చేయగా... కేవలం 1,815 మందికి పాజిటివ్‌ వచ్చింది.

ఒక్క మరణం కూడా సంభవించలేదు. కరోనా (Corona) నియంత్రణలో భాగంగా కొత్తవారెవరూ ఊళ్లకి రాకుండా కర్రలతో ప్రత్యేక కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకోవడంతో... మహమ్మారి కట్టడి సాధ్యమైందని ఆదివాసీలు అభిప్రాయపడుతున్నారు.

చైతన్యం కల్పించే ప్రయత్నం...

ఏజెన్సీలో సుమారు 8 లక్షల జనాభా ఉంటే 1,868 జనావాసాలు ఉన్నాయి. ఇందులో 657 ఇళ్లలో కరోనా కేసులు నమోదు కాలేదు. సహజంగా వ్యాధులతో అల్లకల్లోలమయ్యే ఏజెన్సీలో కరోనా పంజా విసరకపోవడానికి.. ఆదివాసీల ఆచార వ్యవహారాలు ప్రధాన కారణమని అధికారులు భావిస్తున్నారు. వ్యాక్సిన్‌ (Vaccine) తీసుకోవడానికి ముందుకురాని గిరిజనుల్లో చైతన్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

ఇదీ చదవండి:

గోదావరిలో ఇద్దరు యువతుల మృతదేహాలు.. హత్యా? ఆత్మహత్యా?!

తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్‌ (Adilabad) జిల్లా ఉట్నూర్‌ ఏజెన్సీ ప్రాంతాల్లో కరోనా (Corona) ప్రభావం ఎక్కువగా కనిపించటం లేదు. ఐటీడీఏ (ITDA) పరిధిలోని 31 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒక్క కరోనా (Corona) మరణం సంభవించలేదు. అటవీ ప్రాంతానికి ఆనుకొని గ్రామాలు ఉండటం... కాళ్లు, చేతులు శుభ్రం చేసుకుంటే తప్ప ఇంట్లోకి వెళ్లకపోవడం... అత్యవసరముంటే తప్ప మరో ఊరికి వెళ్లకపోవడం వంటి వారి జీవన విధానమే... గిరిజన పల్లెల్లో వైరస్‌ కట్టడికి కారణమైంది.

కట్టుదిట్టమైన ఏర్పాట్లు...

ఆదిలాబాద్‌, కుమురం భీం, మంచిర్యాల జిల్లాల పరిధిలో 31 ఏజెన్సీ (Agency) ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో వైద్యశాఖ సేవలందిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఏజెన్సీ పరిధిలో సుమారు లక్షకుపైగా కరోనా (Corona)పరీక్షలు చేయగా... కేవలం 7,269 మందికి వైరస్‌ నిర్ధరణ అయ్యింది. మహమ్మారి బారిన పడి 56 మంది మరణించారు. ఇందులో 11 పీహెచ్​సీ (PHC)లను పరిగణలోకి తీసుకుంటే.. 30 వేల పరీక్షలు చేయగా... కేవలం 1,815 మందికి పాజిటివ్‌ వచ్చింది.

ఒక్క మరణం కూడా సంభవించలేదు. కరోనా (Corona) నియంత్రణలో భాగంగా కొత్తవారెవరూ ఊళ్లకి రాకుండా కర్రలతో ప్రత్యేక కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకోవడంతో... మహమ్మారి కట్టడి సాధ్యమైందని ఆదివాసీలు అభిప్రాయపడుతున్నారు.

చైతన్యం కల్పించే ప్రయత్నం...

ఏజెన్సీలో సుమారు 8 లక్షల జనాభా ఉంటే 1,868 జనావాసాలు ఉన్నాయి. ఇందులో 657 ఇళ్లలో కరోనా కేసులు నమోదు కాలేదు. సహజంగా వ్యాధులతో అల్లకల్లోలమయ్యే ఏజెన్సీలో కరోనా పంజా విసరకపోవడానికి.. ఆదివాసీల ఆచార వ్యవహారాలు ప్రధాన కారణమని అధికారులు భావిస్తున్నారు. వ్యాక్సిన్‌ (Vaccine) తీసుకోవడానికి ముందుకురాని గిరిజనుల్లో చైతన్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

ఇదీ చదవండి:

గోదావరిలో ఇద్దరు యువతుల మృతదేహాలు.. హత్యా? ఆత్మహత్యా?!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.