రాష్ట్రానికి చెందిన ఓ మత్స్యకారుడు అరేబియా సముద్రంలో గల్లంతయ్యాడు. కర్నాటక రాష్ట్రం మంగళూరు వద్ద సముద్రంలో చేపల వేటకు వెళ్లిన బర్రి లక్ష్మణ్రావు అనే వ్యక్తి గల్లంతయ్యాడు. ఆదివారం రాత్రి వేట ముగించుకుని.. పడవలోనే నిద్రపోయిన అతడు.. ఉదయానికి కనిపించకుండా పోయాడు. తోటి మత్స్యకారులు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న మంగళూరు పోలీసులు.. లక్ష్మణ్రావు ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
ఇవీ చదవండి: కరోనాకు 7 వేల మంది బలి- 1.75 లక్షల మందికి వైరస్