- 'రైతుపై ప్రతీకారం తీర్చుకోవడం దారుణం'
జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు పేట్రేగిపోతున్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఆయన భూమిని తీసుకోకూడదని హైకోర్టు ఉత్తర్వు ఉన్నప్పటికీ పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ప్రధానికి వైకాపా ఎంపీ మరో లేఖ
నరసాపురం ఎంపీ రఘరామకృష్ణరాజు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. బుధవారం కేంద్ర కేబినేట్ తీసుకున్న నిర్ణయాలను ఆయన ప్రశంసించారు. ఈ నెలలో ప్రధానికి ఆయన లేఖ రాయటం ఇది రెండోసారి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- కోరలు చాస్తోన్న మహమ్మారి
రాష్ట్రంలో కొత్తగా 1,555 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 23,814కు చేరాయి. తాజాగా 13 మంది మృతి చెందగా... మెుత్తం మృతుల సంఖ్య 277కు చేరింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'బ్లాక్'లో కరోనా మందుల దందా
కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కొందరు డ్రగ్ వ్యాపారులు మాత్రం డబ్బులు దండుకోవడమే పనిగా పెట్టుకున్నారు. కొవిడ్ రోగుల చికిత్సలో ఉపయోగించే రెమ్డెసివిర్ను బ్లాక్మార్కెట్లో విక్రయిస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఇంటి చికిత్సతోనే కరోనా మాయం!
కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎవరికి వైరస్ సోకిందో ఎవరికి సోకలేదో తెలియడంలేదు. ఆరోగ్యంగా ఉన్నవారికి లక్షణాలు బయట పడటంలేదు. ఇక సీజన్ మారడం వల్ల సాధారణంగా వచ్చే జ్వరం.. జలుబు, దగ్గు వంటి లక్షణాలకే కంగారు పడాల్సిన పరిస్థితి నెలకొంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'ఉపసంహరణే... ముగింపు కాదు'
లద్దాఖ్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో భారత్- చైనా తమ బలగాలను ఉపసంహరించుకుంటున్నాయి. దీని అర్థం ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గినట్లు కాదని సైనిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- భారత ప్రసారాల నిలిపివేత!
భారత టీవీ ఛానెళ్ల ప్రసారాలను నేపాల్లో నిలిపివేశారు. ఈ మేరకు అక్కడి కేబుల్ టీవీ ప్రొవైడర్లు... ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు. అయితే నిలిపివేతపై నేపాల్ సర్కార్ ఎలాంటి అధికారిక ఉత్తర్వులు ఇవ్వలేదు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- టీసీఎస్పై కరోనా దెబ్బ
తొలి త్రైమాసికంలో సాఫ్ట్వేర్ దిగ్గజం టీసీఎస్ నికర లాభం 13.8 శాతం తగ్గింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.8,131 కోట్ల నికర లాభం పొందగా.. ఈ సారి రూ.7008 కోట్లకే పరిమితమైంది. ఆదాయం మాత్రం సల్వంగా పెరిగింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 2021 జూన్ వరకు వాయిదా
ఆసియా కప్-2020 నిర్వహణను వాయిదా వేస్తున్నామని ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) అధికారిక ప్రకటన చేసింది. ఈ మేరకు ఏసీసీ ట్వీట్ చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- వారితో ప్రియాంక చోప్రా
ఈనెల 13 నుంచి 15వ తేదీల మధ్య వర్చువల్ విధానంలో జరిగే 'గర్ల్అప్ లీడర్షిప్ సమ్మిట్'లో ప్రత్యేక అతిథిగా పాల్గొనుంది నటి ప్రియాంక చోప్రా. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్లో వెల్లడించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.