ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7pm

author img

By

Published : Aug 20, 2020, 7:00 PM IST

.

7pm_Bharat Topnews
ప్రధాన వార్తలు @ 7pm
  • తగ్గని విలయం

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 9,393 మందికి పాజిటివ్​గా నిర్ధారణయ్యింది. మొత్తం కేసుల సంఖ్య 3,25,396కు చేరింది. వైరస్​ బారిన పడి మరో 95 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'మహిళల జీవితాన్ని మార్చేందుకే'

వైఎస్ఆర్ చేయూత ద్వారా మహిళా సాధికారితకు మరో 2 సంస్థలు తోడ్పాటు అందించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో రిలయన్స్ రిటైల్ జియో, అల్లాన కంపెనీలు అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'ప్రాజెక్టులు నిలుపుదల చేయాలి'

కృష్ణా నదిపై తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు కడుతోందని.. వాటిని నిలుపుదల చేసి.. ఏపీ రైతుల హక్కులు కాపాడాలని రాష్ట్ర సాగునీటి వినియోగదారుల సమాఖ్య కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి షెకావత్​కు.. సమాఖ్య అధ్యక్షుడు ఈ - మెయిల్ ద్వారా లేఖ పంపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'అనుమతి లేదు'

కరోనా కేసుల దృష్ట్యా విజయవాడ నగరంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు అనుమతి లేదని నగర సీపీ తెలిపారు. ఎవరి ఇళ్లల్లో వారే పూజలు చేసుకోవాలని సూచించారు. స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనపై విచారణ కొనసాగుతోందన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • రికార్డు స్థాయిలో ...

దేశంలో కరోనా పరీక్షల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. బుధవారం ఒక్కరోజే 9.18 లక్షల కరోనా నిర్ధరణ పరీక్షలు జరిగాయి. మొత్తంగా ఇప్పటివరకు 3.26 కోట్ల నమూనాలను పరీక్షించినట్లు కేంద్ర వైద్య శాఖ తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'మోదీ పాలనలో ఆర్థిక వ్యవస్థ ధ్వంసం'

ఆరేళ్లుగా అసంఘటిత ఆర్థిక వ్యవస్థను ప్రధాని మోదీ ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. రైతులు, కూలీలు, చిన్న స్థాయి వ్యాపారులను పట్టించుకోకుండా.. ఎంతో కీలకమైన అసంఘటిత రంగాన్ని ధ్వంసం చేశారని విమర్శించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'అది ట్రంప్​ వల్లకాని విషయం'

అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఏమీ చేయలేకపోయారని.. ఎందుకంటే అది ఆయన వల్లకాని విషయమని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా విమర్శించారు. ట్రంప్​ చేసిన నష్టం నుంచి అమెరికన్లను బయటపడేయగలిగేది.. జో బైడెన్ మాత్రమేనని ఓటర్లకు సూచించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • రెస్టారెంట్లు శాశ్వతంగా మూత!

కొవిడ్​తో కుదేలైన రెస్టారెంట్ల వ్యాపారాలు.. కరోనా ముందున్న స్థాయికి చేరేందుకు ఇంకా సమయం పట్టేలా కనిపిస్తోంది. కరోనా సంక్షోభంతో ఇప్పటికే 10 శాతం రెస్టారెంట్లు శాశ్వతంగా ముతపడ్డాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • సఫారీ జట్టులో కరోనా కలకలం

కరోనా దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా క్రీడారంగం కుదేలైపోయింది. ఇప్పుడిప్పుడే మళ్లీ టోర్నీలు మొదలవుతున్న తరుణంలో ఆటగాళ్లు కరోనా బారిన పడుతున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'నాగలి'కి భారీ స్పందన

రైతు కష్టాలపై 'నాగలి' అనే వీడియో పాటను రూపొందించాడు ర్యాపర్​ రోల్​ రైడా. రైతన్నల పట్ల నేటి తరానికున్న అభిప్రాయాలను మార్చాలనే ఉద్దేశంతో ఈ పాటను తెరకెక్కించినట్లు చెప్పాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • తగ్గని విలయం

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 9,393 మందికి పాజిటివ్​గా నిర్ధారణయ్యింది. మొత్తం కేసుల సంఖ్య 3,25,396కు చేరింది. వైరస్​ బారిన పడి మరో 95 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'మహిళల జీవితాన్ని మార్చేందుకే'

వైఎస్ఆర్ చేయూత ద్వారా మహిళా సాధికారితకు మరో 2 సంస్థలు తోడ్పాటు అందించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో రిలయన్స్ రిటైల్ జియో, అల్లాన కంపెనీలు అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'ప్రాజెక్టులు నిలుపుదల చేయాలి'

కృష్ణా నదిపై తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు కడుతోందని.. వాటిని నిలుపుదల చేసి.. ఏపీ రైతుల హక్కులు కాపాడాలని రాష్ట్ర సాగునీటి వినియోగదారుల సమాఖ్య కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి షెకావత్​కు.. సమాఖ్య అధ్యక్షుడు ఈ - మెయిల్ ద్వారా లేఖ పంపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'అనుమతి లేదు'

కరోనా కేసుల దృష్ట్యా విజయవాడ నగరంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు అనుమతి లేదని నగర సీపీ తెలిపారు. ఎవరి ఇళ్లల్లో వారే పూజలు చేసుకోవాలని సూచించారు. స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనపై విచారణ కొనసాగుతోందన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • రికార్డు స్థాయిలో ...

దేశంలో కరోనా పరీక్షల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. బుధవారం ఒక్కరోజే 9.18 లక్షల కరోనా నిర్ధరణ పరీక్షలు జరిగాయి. మొత్తంగా ఇప్పటివరకు 3.26 కోట్ల నమూనాలను పరీక్షించినట్లు కేంద్ర వైద్య శాఖ తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'మోదీ పాలనలో ఆర్థిక వ్యవస్థ ధ్వంసం'

ఆరేళ్లుగా అసంఘటిత ఆర్థిక వ్యవస్థను ప్రధాని మోదీ ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. రైతులు, కూలీలు, చిన్న స్థాయి వ్యాపారులను పట్టించుకోకుండా.. ఎంతో కీలకమైన అసంఘటిత రంగాన్ని ధ్వంసం చేశారని విమర్శించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'అది ట్రంప్​ వల్లకాని విషయం'

అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఏమీ చేయలేకపోయారని.. ఎందుకంటే అది ఆయన వల్లకాని విషయమని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా విమర్శించారు. ట్రంప్​ చేసిన నష్టం నుంచి అమెరికన్లను బయటపడేయగలిగేది.. జో బైడెన్ మాత్రమేనని ఓటర్లకు సూచించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • రెస్టారెంట్లు శాశ్వతంగా మూత!

కొవిడ్​తో కుదేలైన రెస్టారెంట్ల వ్యాపారాలు.. కరోనా ముందున్న స్థాయికి చేరేందుకు ఇంకా సమయం పట్టేలా కనిపిస్తోంది. కరోనా సంక్షోభంతో ఇప్పటికే 10 శాతం రెస్టారెంట్లు శాశ్వతంగా ముతపడ్డాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • సఫారీ జట్టులో కరోనా కలకలం

కరోనా దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా క్రీడారంగం కుదేలైపోయింది. ఇప్పుడిప్పుడే మళ్లీ టోర్నీలు మొదలవుతున్న తరుణంలో ఆటగాళ్లు కరోనా బారిన పడుతున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'నాగలి'కి భారీ స్పందన

రైతు కష్టాలపై 'నాగలి' అనే వీడియో పాటను రూపొందించాడు ర్యాపర్​ రోల్​ రైడా. రైతన్నల పట్ల నేటి తరానికున్న అభిప్రాయాలను మార్చాలనే ఉద్దేశంతో ఈ పాటను తెరకెక్కించినట్లు చెప్పాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.