ETV Bharat / city

నూతన విద్యా విధానం: గురుకులాల్లో ఇకపై 3, 4 తరగతులు! - ఏపీ న్యూస్

నూతన విద్యా విధానంలో భాగంగా గురుకులాల్లో మూడు, నాలుగు తరగతలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

classes in Gurukul
classes in Gurukul
author img

By

Published : Aug 19, 2021, 8:29 AM IST

సంక్షేమ శాఖల ఆధ్వర్యంలోని గురుకులాల్లో కొత్తగా 3, 4 తరగతులను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. సాంఘిక, గిరిజన, బీసీ సంక్షేమ గురుకులాల్లో ప్రస్తుతం అయిదో తరగతి నుంచి ఇంటరు వరకు ఉంది. జాతీయ నూతన విద్యా విధానం ప్రకారం పూర్వ ప్రాథమిక విద్య, 1, 2 తరగతులు కలిపి ఒక యూనిట్‌గా, 3 నుంచి ఇంటరు వరకు ఒక యూనిట్‌గా ఉండాలి. అందులో భాగంగానే 3, 4 తరగతులను చేర్చాలని యోచిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుచేసే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.

జాతీయ విద్యా విధానంపై ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఆయా సంక్షేమశాఖలతో ఈ విషయాన్ని విద్యాశాఖ చర్చించింది. అదనపు తరగతులను చేర్చితే ప్రవేశాలు భారీగా పెరిగే అవకాశముంది. ప్రస్తుతం సాంఘిక సంక్షేమ గురుకులాలు 189, బీసీలవి 93, గిరిజన గురుకులాలు 189 ఉన్నాయి. వీటిలో ఏటా ఒక్కో తరగతిలో 80 మందికి ప్రవేశాలను కల్పిస్తున్నారు.

అదనపు తరగతులను ఏర్పాటు చేస్తే 37వేల మంది వరకు విద్యార్థులు పెరిగే అవకాశముంది. ఆ మేరకు సౌకర్యాల కల్పనపై గురుకులాల బోర్డు సమావేశాల్లో విస్తృతంగా చర్చించాల్సి ఉంది. మరోవైపు ఇప్పటివరకు ఇంటరు లేని గురుకులాల్లోనూ ఆ కోర్సును ప్రారంభించాలని చూస్తున్నారు.

సంక్షేమ శాఖల ఆధ్వర్యంలోని గురుకులాల్లో కొత్తగా 3, 4 తరగతులను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. సాంఘిక, గిరిజన, బీసీ సంక్షేమ గురుకులాల్లో ప్రస్తుతం అయిదో తరగతి నుంచి ఇంటరు వరకు ఉంది. జాతీయ నూతన విద్యా విధానం ప్రకారం పూర్వ ప్రాథమిక విద్య, 1, 2 తరగతులు కలిపి ఒక యూనిట్‌గా, 3 నుంచి ఇంటరు వరకు ఒక యూనిట్‌గా ఉండాలి. అందులో భాగంగానే 3, 4 తరగతులను చేర్చాలని యోచిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుచేసే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.

జాతీయ విద్యా విధానంపై ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఆయా సంక్షేమశాఖలతో ఈ విషయాన్ని విద్యాశాఖ చర్చించింది. అదనపు తరగతులను చేర్చితే ప్రవేశాలు భారీగా పెరిగే అవకాశముంది. ప్రస్తుతం సాంఘిక సంక్షేమ గురుకులాలు 189, బీసీలవి 93, గిరిజన గురుకులాలు 189 ఉన్నాయి. వీటిలో ఏటా ఒక్కో తరగతిలో 80 మందికి ప్రవేశాలను కల్పిస్తున్నారు.

అదనపు తరగతులను ఏర్పాటు చేస్తే 37వేల మంది వరకు విద్యార్థులు పెరిగే అవకాశముంది. ఆ మేరకు సౌకర్యాల కల్పనపై గురుకులాల బోర్డు సమావేశాల్లో విస్తృతంగా చర్చించాల్సి ఉంది. మరోవైపు ఇప్పటివరకు ఇంటరు లేని గురుకులాల్లోనూ ఆ కోర్సును ప్రారంభించాలని చూస్తున్నారు.

ఇదీ చదవండి:

CM Jagan: 'సెప్టెంబరు 22న కోర్టుకు రండి' : ఈడీ కేసుల్లో జగన్‌కు సీబీఐ కోర్టు సమన్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.