మలేసియా కౌలాలంపూర్ ఎయిర్ పోర్ట్లో 300 మంది తెలుగు విద్యార్థులు నిలిచిపోయారు. వీరు ఫిలిప్పీన్స్లో చదువుకుంటున్నారు. కరోనా ప్రభావంతో ఫిలిప్పీన్స్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. కౌలంపూర్ ఎయిర్ పోర్ట్లోకి రావడానికి ఎయిర్ పోర్ట్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇండియన్ ఎంబసీ అంగీకారం లేకుండా విమానం ఎక్కనీయమని అధికారులు అడ్డుకున్నారు. అన్ని పరీక్షలు చేసి కరోనా లక్షణాలు లేవని తెలిసినా ఎయిర్ పోర్ట్ అధికారులు విద్యార్థులను విమానం ఎక్కనీయడం లేదు. విద్యార్థుల కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు.
ఇదీ చదవండి : కరోనాను జయించేందుకు ఇవి తెలుసుకోండి...