ETV Bharat / city

గోదావరిలో గల్లంతైన నలుగురి మృతదేహాలు లభ్యం

author img

By

Published : Nov 15, 2020, 2:15 PM IST

తెలంగాణలోని ములుగు జిల్లాలో గోదావరిలో స్నానానికెళ్లి గల్లంతైన ఘటనలో నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. వెంకటాపురం మండలం మరికాల గోదావరి రేవు వద్ద శనివారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా పార్టీ చేసుకోవడానికి వెళ్లిన 20 మందిలో నలుగురు ప్రమాదవశాత్తు నదిలో కొట్టుకుపోయారు.

3-dead-bodies-found-in-godavari
గోదావరిలో గల్లంతైన నలుగురి మృతదేహాలు లభ్యం

తెలంగాణలోని ములుగు జిల్లాలో గోదావరిలో స్నానానికెళ్లి నలుగురు గల్లంతైన ఘటనలో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. నిన్న ఇద్దరు మృతదేహాలు దొరకగా ఈ రోజు శ్రీకాంత్, అన్వేష్​ల మృతదేహాలను వెలికితీశారు.

వెంకటాపురం మండలం మరికాల గ్రామ సమీపంలో ఉన్న గోదావరి రేవుకి శనివారం సాయంత్రం 20 మంది.. పుట్టినరోజు వేడుక చేసుకోవడానికి వెళ్లారు. పార్టీ అనంతరం నదిలో ఈతకు దిగారు. ఈ క్రమంలోనే నలుగురు యువకులు గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. జాలర్ల సహాయంతో మృతదేహాలను వెలికి తీశారు.

తెలంగాణలోని ములుగు జిల్లాలో గోదావరిలో స్నానానికెళ్లి నలుగురు గల్లంతైన ఘటనలో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. నిన్న ఇద్దరు మృతదేహాలు దొరకగా ఈ రోజు శ్రీకాంత్, అన్వేష్​ల మృతదేహాలను వెలికితీశారు.

వెంకటాపురం మండలం మరికాల గ్రామ సమీపంలో ఉన్న గోదావరి రేవుకి శనివారం సాయంత్రం 20 మంది.. పుట్టినరోజు వేడుక చేసుకోవడానికి వెళ్లారు. పార్టీ అనంతరం నదిలో ఈతకు దిగారు. ఈ క్రమంలోనే నలుగురు యువకులు గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. జాలర్ల సహాయంతో మృతదేహాలను వెలికి తీశారు.

సంబంధిత వార్తలు:

నది ఒడ్డున పార్టీ... ఇద్దరు గల్లంతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.