ETV Bharat / city

పీఎంఏవై కింద రాష్ట్రానికి 2 లక్షల ఇళ్లు

author img

By

Published : Jul 19, 2020, 5:51 AM IST

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద తొలివిడతగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 2 లక్షల ఇళ్లు మంజూరు చేయనుంది.దీని కింద రాష్ట్రంలో 10.57 లక్షల మంది అర్హులు ఉన్నట్లు రాష్ట్రప్రభుత్వం గుర్తించి కేంద్రానికి నివేదించింది.

PMAY
PMAY

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద తొలివిడతగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 2 లక్షల ఇళ్లు మంజూరు చేయనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు విడుదల చేస్తాయి. దీని కింద రాష్ట్రంలో 10.57 లక్షల మంది అర్హులు ఉన్నట్లు రాష్ట్రప్రభుత్వం గుర్తించి కేంద్రానికి నివేదించింది. వీటిని మంజూరు చేయాలని జూన్‌లో గృహనిర్మాణశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్‌ కేంద్రానికి లేఖ రాశారు.

ఈ పథకం కింద నమోదు చేసుకున్న వారి స్థలాలను జియో ట్యాగింగ్ చేయాలని కేంద్రం ఆదేశించింది. స్థలాలు లేకపోతే వారుంటున్న ఇంటినే జియోట్యాగింగ్ చేయాలని సూచించింది. దరఖాస్తు చేసక్కున్న వ్యక్తితోపాటు కుటుంబసభ్యుల ఆధార్‌ నంబర్లు సైతం నమోదుచేయాలని ఆదేశించింది. ఈ నెలాఖరు వరకు గడువిచ్చింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత... అన్ని రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌కూ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది.

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద తొలివిడతగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 2 లక్షల ఇళ్లు మంజూరు చేయనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు విడుదల చేస్తాయి. దీని కింద రాష్ట్రంలో 10.57 లక్షల మంది అర్హులు ఉన్నట్లు రాష్ట్రప్రభుత్వం గుర్తించి కేంద్రానికి నివేదించింది. వీటిని మంజూరు చేయాలని జూన్‌లో గృహనిర్మాణశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్‌ కేంద్రానికి లేఖ రాశారు.

ఈ పథకం కింద నమోదు చేసుకున్న వారి స్థలాలను జియో ట్యాగింగ్ చేయాలని కేంద్రం ఆదేశించింది. స్థలాలు లేకపోతే వారుంటున్న ఇంటినే జియోట్యాగింగ్ చేయాలని సూచించింది. దరఖాస్తు చేసక్కున్న వ్యక్తితోపాటు కుటుంబసభ్యుల ఆధార్‌ నంబర్లు సైతం నమోదుచేయాలని ఆదేశించింది. ఈ నెలాఖరు వరకు గడువిచ్చింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత... అన్ని రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌కూ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది.

ఇదీ చదవండి:

గవర్నర్​ వద్దకు ఆ 2 బిల్లులు.. తిరుగుతున్నాయి ఎన్నో మలుపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.