ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 11AM - ap top ten news

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అంటున్న రామకృష్ణ.., దస్త్రం వెనక్కి పంపిన గవర్నర్ కార్యాలయం.., మూడు మతాల సాక్షిగా ఒక్కటైన జంట.., అండమాన్​లో సిట్మెక్స్​ విన్యాసాలు.., బిహార్​లో ఎన్​కౌంటర్​.., ఆరేళ్ల తర్వాత పద్మనాభుడి చందన ప్రసాదం., అశ్విన్​పై ట్రోలింగ్.., డ్రగ్స్​ కేసులో అరెస్టైన హాస్యనటి భర్త వంటి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం క్రింది లింకులను క్లిక్ చెయ్యండి..

11am_Topnews
ప్రధాన వార్తలు @ 11AM
author img

By

Published : Nov 22, 2020, 11:21 AM IST

  • ' అర్ధరాత్రి నిర్బంధాలు ఏమిటి.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?'

పోలవరం విషయంలో ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని సీపీఐ రామకృష్ణ ప్రశ్నించారు. తాము పోలవరం యాత్ర చేపడుతున్నట్లు ముందస్తు సమాచారమిచ్చినా.. ఎందుకు గృహ నిర్బంధాలు చేస్తున్నారని నిలదీశారు. అర్ధరాత్రి తమను నిర్బంధం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఉపకులపతుల నియామక దస్త్రం వెనక్కి పంపిన గవర్నర్ కార్యాలయం

ఉపకులపతుల నియామక దస్త్రాన్ని గవర్నర్ కార్యాలయం తిప్పి పంపింది. 20 రోజులపాటు దస్త్రాన్ని పెండింగ్‌లో పెట్టిన గవర్నర్ కార్యాలయం, న్యాయనిపుణుల సలహా తర్వాత వెనక్కి పంపించింది. ఒక్కో విశ్వవిద్యాలయానికి ఒక్కో పేరునే సిఫార్సు చేస్తూ ప్రభుత్వం దస్త్రం రూపొందించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దేశంలో మరో 45,209 కరోనా కేసులు

భారత్​లో తాజాగా 45,209 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 91 లక్షలకు చేరువైంది. మరో 501 మంది మరణించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మూడు మతాల సాక్షిగా ఒక్కటయ్యారు!

పెళ్లి అనేది ఎవరి జీవితంలో అయినా ముఖ్యమైన సందర్భం. అందుకే వివాహాన్ని మరపురాని జ్ఞాపకంగా మార్చుకోవాలని భావించింది ఆ జంట. అందుకోసం మూడు మతాచారాల ప్రకారం పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తిరుమలలో నేడు కార్తిక వనభోజనోత్సవం

తిరుమలలో నేడు కార్తిక వనభోజనోత్సవం జరగనుంది. పార్వేట మండపం వద్ద అటవీప్రాంతంలో... అతికొద్ది మంది అధికారులు, సిబ్బందితో కార్తిక వనభోజనం నిర్వహించనున్నారు . పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అండమాన్​లో సింగ‌పూర్, థాయ్, భారత్​ నౌకాదళ విన్యాసాలు

అండ‌మాన్ సముద్రంలో రెండు రోజుల పాటు జరగనున్న భార‌త్, సింగ‌పూర్, ధాయ్ లాండ్ నౌకాద‌ళ సంయుక్త విన్యాసాలు.. సిట్మెక్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు దేశాల మ‌ధ్య మిల‌ట‌రీ బంధాల‌ను ప‌టిష్టం చేయ‌డానికి ఈ విన్యాసాలు ఉపకరించనున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బిహార్​లో ఎన్​కౌంటర్​- ముగ్గురు నక్సల్స్ హతం

బిహార్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో ముగ్గురు మావోయిస్టులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. అర్ధరాత్రి నుంచి ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆరేళ్ల తర్వాత శ్రీ పద్మనాభుడి చందన ప్రసాదం

కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో ఆరేళ్ల విరామం తర్వాత చందన ప్రసాదం పంపిణీ తిరిగి ప్రారంభించారు. ఈ బంగారు-పసుపు రంగు చందన ప్రసాదం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయంటూ అప్పట్లో నిలిపివేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మన్కడింగ్ మీమ్​తో అశ్విన్​పై ట్రోలింగ్

సీనియర్ స్పిన్నర్​ అశ్విన్​ను మన్కడింగ్​ మీమ్​తో ట్రోల్ చేశాడు మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్. దీనిపై స్పందించిన అశ్విన్.. సరదాగా నవ్వుకున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • డ్రగ్స్​ కేసులో హాస్యనటి భర్త కూడా అరెస్టు

మాదకద్రవ్యాల వినియోగం కేసులో బాలీవుడ్​ హాస్యనటి భారతీ సింగ్​తో పాటు ఆమె భర్త హర్ష్​ను అరెస్టు చేశారు. సోదాల్లో భారతీ నివాసంలో గంజాయిని స్వాధీనం చేసుకోగా.. వారిద్దరూ దాన్ని సేవించినట్లు విచారణలో అంగీకరించారని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ' అర్ధరాత్రి నిర్బంధాలు ఏమిటి.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?'

పోలవరం విషయంలో ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని సీపీఐ రామకృష్ణ ప్రశ్నించారు. తాము పోలవరం యాత్ర చేపడుతున్నట్లు ముందస్తు సమాచారమిచ్చినా.. ఎందుకు గృహ నిర్బంధాలు చేస్తున్నారని నిలదీశారు. అర్ధరాత్రి తమను నిర్బంధం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఉపకులపతుల నియామక దస్త్రం వెనక్కి పంపిన గవర్నర్ కార్యాలయం

ఉపకులపతుల నియామక దస్త్రాన్ని గవర్నర్ కార్యాలయం తిప్పి పంపింది. 20 రోజులపాటు దస్త్రాన్ని పెండింగ్‌లో పెట్టిన గవర్నర్ కార్యాలయం, న్యాయనిపుణుల సలహా తర్వాత వెనక్కి పంపించింది. ఒక్కో విశ్వవిద్యాలయానికి ఒక్కో పేరునే సిఫార్సు చేస్తూ ప్రభుత్వం దస్త్రం రూపొందించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దేశంలో మరో 45,209 కరోనా కేసులు

భారత్​లో తాజాగా 45,209 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 91 లక్షలకు చేరువైంది. మరో 501 మంది మరణించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మూడు మతాల సాక్షిగా ఒక్కటయ్యారు!

పెళ్లి అనేది ఎవరి జీవితంలో అయినా ముఖ్యమైన సందర్భం. అందుకే వివాహాన్ని మరపురాని జ్ఞాపకంగా మార్చుకోవాలని భావించింది ఆ జంట. అందుకోసం మూడు మతాచారాల ప్రకారం పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తిరుమలలో నేడు కార్తిక వనభోజనోత్సవం

తిరుమలలో నేడు కార్తిక వనభోజనోత్సవం జరగనుంది. పార్వేట మండపం వద్ద అటవీప్రాంతంలో... అతికొద్ది మంది అధికారులు, సిబ్బందితో కార్తిక వనభోజనం నిర్వహించనున్నారు . పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అండమాన్​లో సింగ‌పూర్, థాయ్, భారత్​ నౌకాదళ విన్యాసాలు

అండ‌మాన్ సముద్రంలో రెండు రోజుల పాటు జరగనున్న భార‌త్, సింగ‌పూర్, ధాయ్ లాండ్ నౌకాద‌ళ సంయుక్త విన్యాసాలు.. సిట్మెక్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు దేశాల మ‌ధ్య మిల‌ట‌రీ బంధాల‌ను ప‌టిష్టం చేయ‌డానికి ఈ విన్యాసాలు ఉపకరించనున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బిహార్​లో ఎన్​కౌంటర్​- ముగ్గురు నక్సల్స్ హతం

బిహార్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో ముగ్గురు మావోయిస్టులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. అర్ధరాత్రి నుంచి ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆరేళ్ల తర్వాత శ్రీ పద్మనాభుడి చందన ప్రసాదం

కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో ఆరేళ్ల విరామం తర్వాత చందన ప్రసాదం పంపిణీ తిరిగి ప్రారంభించారు. ఈ బంగారు-పసుపు రంగు చందన ప్రసాదం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయంటూ అప్పట్లో నిలిపివేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మన్కడింగ్ మీమ్​తో అశ్విన్​పై ట్రోలింగ్

సీనియర్ స్పిన్నర్​ అశ్విన్​ను మన్కడింగ్​ మీమ్​తో ట్రోల్ చేశాడు మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్. దీనిపై స్పందించిన అశ్విన్.. సరదాగా నవ్వుకున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • డ్రగ్స్​ కేసులో హాస్యనటి భర్త కూడా అరెస్టు

మాదకద్రవ్యాల వినియోగం కేసులో బాలీవుడ్​ హాస్యనటి భారతీ సింగ్​తో పాటు ఆమె భర్త హర్ష్​ను అరెస్టు చేశారు. సోదాల్లో భారతీ నివాసంలో గంజాయిని స్వాధీనం చేసుకోగా.. వారిద్దరూ దాన్ని సేవించినట్లు విచారణలో అంగీకరించారని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.