ETV Bharat / briefs

భాజపా, వైకాపాకు ప్రజలు గుణపాఠం చెప్పాలి: యనమల

author img

By

Published : Mar 26, 2019, 5:41 PM IST

భాజపా, వైకాపాపై మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. కేంద్రం విడుదల చేసిన నిధులకు ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని భాజపా నేతలు అనడం హాస్యాస్పదమన్నారు.

yenamala

భాజపా, వైకాపాపై మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. కేంద్రం విడుదల చేసిన నిధులకు ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని భాజపా నేతలు అనడం హాస్యాస్పదమన్నారు. ఐదేళ్లలో వాళ్లిచ్చిన 13వేల కోట్ల రూపాయలకు ఏం సమాధానం చెప్పాలని యనమల ప్రశ్నించారు. ఏడాదికి 2వేల 5వందల కోట్లు కూడా ఇవ్వని వారికి సమాధానం కావాలా అంటూ నిలదీశారు. పోలవరానికి ఇవ్వాల్సిన 4వేల కోట్ల రూపాయల నిధుల విడుదలలో ఎందుకు జాప్యం చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు.

ఎన్నికల ముందు తలలేని మొండెంలాంటి రైల్వే జోన్ ఇచ్చి... 7వేల కోట్ల రూపాయల రాబడి నష్టం చేశారని మండిపడ్డారు. 16వేల కోట్ల రూపాయల ఆర్థిక లోటులో పావలా కూడా ఇవ్వని భాజపాకు... తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కేసీఆర్​తో కలిస్తే తప్పేంటన్న జగన్ వ్యాఖ్యలతో... వైకాపా, తెరాస మధ్య రహస్య బంధం బయటపడిందన్నారు.కేసుల కోసం నరేంద్రమోదీతో జగన్​ లాలూచీ ఒక వైఫల్యమని... ఆస్తులు కాపాడుకోవడానికి కేసీఆర్తో కుమ్మక్కు మరో వైఫల్యమన్నారు. భాజపా, తెరాసతో చేతులు కలిపిన జగన్‌కు రాష్ట్ర ప్రజలే బుద్ధి చెబుతారని యనమల రామకృష్ణుడు చెప్పారు.

భాజపా, వైకాపాపై మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. కేంద్రం విడుదల చేసిన నిధులకు ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని భాజపా నేతలు అనడం హాస్యాస్పదమన్నారు. ఐదేళ్లలో వాళ్లిచ్చిన 13వేల కోట్ల రూపాయలకు ఏం సమాధానం చెప్పాలని యనమల ప్రశ్నించారు. ఏడాదికి 2వేల 5వందల కోట్లు కూడా ఇవ్వని వారికి సమాధానం కావాలా అంటూ నిలదీశారు. పోలవరానికి ఇవ్వాల్సిన 4వేల కోట్ల రూపాయల నిధుల విడుదలలో ఎందుకు జాప్యం చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు.

ఎన్నికల ముందు తలలేని మొండెంలాంటి రైల్వే జోన్ ఇచ్చి... 7వేల కోట్ల రూపాయల రాబడి నష్టం చేశారని మండిపడ్డారు. 16వేల కోట్ల రూపాయల ఆర్థిక లోటులో పావలా కూడా ఇవ్వని భాజపాకు... తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కేసీఆర్​తో కలిస్తే తప్పేంటన్న జగన్ వ్యాఖ్యలతో... వైకాపా, తెరాస మధ్య రహస్య బంధం బయటపడిందన్నారు.కేసుల కోసం నరేంద్రమోదీతో జగన్​ లాలూచీ ఒక వైఫల్యమని... ఆస్తులు కాపాడుకోవడానికి కేసీఆర్తో కుమ్మక్కు మరో వైఫల్యమన్నారు. భాజపా, తెరాసతో చేతులు కలిపిన జగన్‌కు రాష్ట్ర ప్రజలే బుద్ధి చెబుతారని యనమల రామకృష్ణుడు చెప్పారు.

Intro:అనంతపురం జిల్లా తాడపత్రి మండలం అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో ఈనాడు, ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో వీవీఫ్యాట్స్, ఈవీఎంలపై అవగాహన సదస్సు.. త్వరలో రాబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన వీవీఫ్యాట్స్, ఈవీఎంల ద్వారా ఓటు వేసే విధానంపై సందేహాలు నివృత్తి చేసేందుకు ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించారు. తాడిపత్రి మండలంలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో ఉన్న అల్ట్రాటెక్ కమ్యూనిటీ వెల్పేరే వారి సహకారంతో 60 మంది కార్మికులకు వీవీఫ్యాట్స్, ఈవీఎంల పనితీరు గురించి నిపుణులు వివరించారు. అనంతరం ఓటు వేసే విధానాన్ని గురించి కార్మికులకు ప్రయోగాత్మకంగా చూపించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, అల్ట్రాటెక్ సిమెంట్ సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.


Body:ప్లేస్: తాడిపత్రి, అనంతపురం
కిట్ నెంబర్: 759
7799077211
7093981598


Conclusion:తాడిపత్రి, అనంతపురం జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.