ETV Bharat / briefs

భానుడి భగభగలు.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు - ap latest news'

రాష్ట్రంలో ఎన్నికల వేడి చల్లారింది. కానీ... భానుడి భగభగలు మాత్రం తగ్గలేదు. ఎండ వేడి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో గరిష్ఠంగా 44.57 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
author img

By

Published : May 24, 2019, 6:07 PM IST

ఎండలతో అల్లాడుతున్న రాష్ట్రం

రోజుకురోజుకూ భానుడి ప్రతాపం తీవ్రమవుతోంది. రాష్ట్రంలో మే నెలలో సగటున 41 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్జీజీఎస్​ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎండ వేడిమి తక్కువగా ఉన్న సమయాల్లోనే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో గరిష్ఠంగా 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది.

నేటి ఉష్ణోగ్రతల వివరాలు
గుంటూరు జిల్లా పెద్దకూరపాడు, ప్రకాశం జిల్లా రాళ్లపల్లిలో గరిష్ఠంగా 44.57 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో 69 ప్రాంతాల్లో 43 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉన్నాయి.

ఇవీ చదవండి...
ఈ విజయం ఊహించిందే: మోహన్​బాబు

ఎండలతో అల్లాడుతున్న రాష్ట్రం

రోజుకురోజుకూ భానుడి ప్రతాపం తీవ్రమవుతోంది. రాష్ట్రంలో మే నెలలో సగటున 41 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్జీజీఎస్​ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎండ వేడిమి తక్కువగా ఉన్న సమయాల్లోనే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో గరిష్ఠంగా 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది.

నేటి ఉష్ణోగ్రతల వివరాలు
గుంటూరు జిల్లా పెద్దకూరపాడు, ప్రకాశం జిల్లా రాళ్లపల్లిలో గరిష్ఠంగా 44.57 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో 69 ప్రాంతాల్లో 43 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉన్నాయి.

ఇవీ చదవండి...
ఈ విజయం ఊహించిందే: మోహన్​బాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.