ఇదిలావుంటే ఈ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. ప్రస్తుతం ఏడుగురు ఉపాధ్యాయులే ఉన్నారు. మరో 11 మంది కావాలి. గత మార్చిలో బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయుల స్థానంలో ఇంతవరకు ఎవరూ రాలేదు. స్థానికంగా పట్టభద్రులైన కొంతమంది యువత సహాయం తీసుకుని తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలో చేరేందుకు విద్యార్థులు పోటీ పడుతున్నా... ఉపాధ్యాయుల కొరతతో చేర్చుకోలేకపోతున్నామని ప్రధానోపాధ్యాయురాలు వెంకట సత్యవతి అంటున్నారు.
ఈ పాఠశాలలో విద్యార్థులు చేరటానికి ఆసక్తిగా ఉన్నా... తగినస్థాయిలో ఉపాధ్యాయులు లేక...నో అడ్మిషన్ బోర్డు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇదీ చదవండి : పెళ్లి భోజనం తిని 60 మందికి అస్వస్థత