ETV Bharat / state

వరదలతో మీ కారు డ్యామేజ్ అయ్యిందా? డోంట్​ వర్రీ- నష్టపరిహారం పొందండి ఇలా! - Vehicle Insurance for Flood Victims

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 9, 2024, 10:22 AM IST

Vehicle Insurance for Vijayawada Flood Victims : విజయవాడను ముంచెత్తిన వరద ధాటికి దాదాపు అన్ని వాహనాలూ ఏదో ఒక స్థాయిలో దెబ్బతిన్నాయి. వాటి మరమ్మతులకు పూర్తి స్థాయిలో విడిభాగాలను మార్చడానికి బీమా సొమ్ము వస్తుందా, ఏ పాలసీ ఉంటే వస్తుంది, ఎలా, ఎప్పుడు క్లెయిమ్‌ చేసుకోవాలి అని తెలుసుకోవడంతో పాటు క్లెయిమ్‌ చేసుకునే ముందు పాలసీదారుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలూ కొన్ని ఉన్నాయి. అవేెంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

vehicle_insurance_for_vijayawada_flood_victims
vehicle_insurance_for_vijayawada_flood_victims (ETV Bharat)

Vehicle Insurance for Vijayawada Flood Victims : కాంప్రెహెన్సివ్‌ ప్యాకేజీ ఉంటే ఇలా : కార్లు, బైక్‌లకు సమగ్ర వాహన బీమా / కాంప్రిహెన్సివ్‌ /ప్యాకేజీపాలసీ తరహావి ఉంటే పరిహారం దక్కే అవకాశం ఉంది. వాహనాలను కొన్నప్పుడే ఈ పాలసీ చేస్తారు. దీనికి ఏడాది నుంచి అయిదేళ్ల వరకు గడువు ఉంటుంది. ఈ పాలసీకే యాడ్‌ ఆన్‌ పేరుతో ‘నిల్‌ డిప్రీసియేషన్‌/జీరో డిప్రీసియేషన్‌ ఇంజిన్‌ ప్రొటెక్షన్, ఆన్‌ రోడ్‌ అసిస్టెన్స్‌ హైడ్రాస్టిక్‌ లాక్‌ కవర్, కన్స్యూమబుల్‌ కవర్‌ లాంటివి అదనంగా తీసుకుని ఉంటే వరద తరహా విపత్తుల్లో ఎంతో ఉపయోగకరమవుతాయి. నష్టపోయిన దాంట్లో అత్యధిక శాతం బీమా కంపెనీ నుంచి తిరిగి పొందవచ్చు. అంతేకాకుండా విపత్తు సమయాల్లో బీమా కంపెనీలు పాలసీ క్లెయిమ్‌ పరిష్కారాల నిబంధనలను కొంత వరకు సడలిస్తుంటాయి. గరిష్ఠంగా మూడు వారాల్లోపు దెబ్బతిన్న వాహనం వివరాలతో బీమా కంపెనీకి క్లెయిమ్‌ చేయగలిగితే పరిహారం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.

థర్డ్‌ పార్టీ బీమా అయితే : థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌లో ఎలాంటి పరిహారమూ రాదు. ఇందులో వ్యక్తిగత ప్రమాద బీమాను కలిపి తీసుకుని ఉంటే మాత్రం ఇలాంటి వరదల సమయంలో కారుతో సహా కొట్టుకుపోతే తర్వాత కారును గుర్తించి, అందులోని మనిషి చనిపోయినట్టుగా నిర్ధారించాలి. అప్పుడు ఆ మృతుని కుటుంబానికి రూ.15 లక్షల వరకు పరిహారం అందే అవకాశం ఉంటుంది.

వరదలో వాహనం కొట్టుకుపోతే : వాహనం వరదలో కొట్టుకుపోయినట్లుగా కచ్చితంగా స్థానిక పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించాలి. ఎఫ్‌ఐఆర్‌ పత్రం లేకుండా క్లెయిమ్‌ చేయలేరు. ఈ పరిస్థితుల్లో ఉంటే తొందరపడండి. మీ వాహనానికి సంబంధించిన సమగ్ర వాహన బీమాకు మూడు/నాలుగు రోజుల్లో గడువు ముగుస్తుంటే దాన్ని సత్వరమే ఆన్‌లైన్‌లో రెన్యువల్‌ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని కంపెనీలు పాలసీ గడువు ముగిస్తే క్లెయిమ్‌ పరిష్కారానికి అంగీకరించకపోవచ్చునని
నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బైక్ ఇంజన్​లో బురద- వరద కథల్లో ఇదో వ్యథ - Massive Damage to Two Wheelers

క్లెయిమ్‌ ఎలా? డాక్యుమెంట్ల సమస్య ఉంటుందా? : పాలసీదారుడే నేరుగా సంబంధిత బీమా కంపెనీని ఫోన్‌ ద్వారా లేదా ఆ కంపెనీ ఆథరైజ్డ్‌ సేవా కేంద్రం ద్వారా సంప్రదించాలి.

  • వాహనం ఎక్కడెక్కడ ఎంత డ్యామేజ్‌ అయిందో చూపేలా ఫొటో, వీడియో చేసి ఆ డాక్యుమెంట్‌ను కంపెనీకి సమర్పించాల్సి ఉంటుంది.
  • వాహన నష్టంపై ప్రాథమికంగా ఒక అంచనా వేయాలి.
  • డోర్లు తెరిచి ఉంచాలి
  • ఇతర విభాగాలను పరిశీలించే ముందు బ్యాటరీని డిస్‌కనెక్ట్‌ చేయాలి.
  • బీమా కంపెనీకి సంబంధించి సమీపంలోని ఆథరైజ్డ్‌ గ్యారేజీకి వాహనాన్ని టోయింగ్‌తోనే తీసుకువెళ్లాల్సి ఉంటుంది.
  • బలవంతంగా ఇంజిన్‌ ఆన్‌ చేసే ప్రయత్నం చేయకూడదు.

ఆ ప్రయత్నంలో వరద నీరు ఇంజిన్‌లోకి వెళ్లి పిస్టన్‌ దెబ్బతిని ఇంజిన్‌ సీజ్‌ అవుతుంది. అలా జరిగితే పాలసీదారుడి బాధ్యతారాహిత్యంగా భావించి క్లెయిమ్‌ పరిష్కారానికి కంపెనీ మొగ్గు చూపకపోయే అవకాశం ఉంటుందని బీమా రంగ నిపుణులు తెలిపారు.

కార్ల ఖర్చు 'తడిసి' మోపెడు - ఆందోళనలో వాహనదారులు - Cars Damage in Flood Disaster

క్లెయిమ్‌లను త్వరగా పరిష్కరించండి: కేంద్ర ప్రభుత్వం : వరదలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తీవ్రంగా సతమతమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వరంగ బీమా సంస్థలకు కేంద్రం పలు సూచనలు చేసింది. ప్రత్యేక శిబిరాలను నిర్వహించి క్లెయిమ్‌లకు త్వరితగతిన పరిష్కారాలను చూపాలని ఆదేశించింది. బీమా తీసుకున్నవారు సులువుగా సంప్రదించేందుకు వీలుగా నోడల్‌ అధికారుల పేర్లు, ఫోన్‌ నంబర్లను విస్తృతంగా ప్రచారం చేయాలని పేర్కొంది.

Vehicle Insurance for Vijayawada Flood Victims : కాంప్రెహెన్సివ్‌ ప్యాకేజీ ఉంటే ఇలా : కార్లు, బైక్‌లకు సమగ్ర వాహన బీమా / కాంప్రిహెన్సివ్‌ /ప్యాకేజీపాలసీ తరహావి ఉంటే పరిహారం దక్కే అవకాశం ఉంది. వాహనాలను కొన్నప్పుడే ఈ పాలసీ చేస్తారు. దీనికి ఏడాది నుంచి అయిదేళ్ల వరకు గడువు ఉంటుంది. ఈ పాలసీకే యాడ్‌ ఆన్‌ పేరుతో ‘నిల్‌ డిప్రీసియేషన్‌/జీరో డిప్రీసియేషన్‌ ఇంజిన్‌ ప్రొటెక్షన్, ఆన్‌ రోడ్‌ అసిస్టెన్స్‌ హైడ్రాస్టిక్‌ లాక్‌ కవర్, కన్స్యూమబుల్‌ కవర్‌ లాంటివి అదనంగా తీసుకుని ఉంటే వరద తరహా విపత్తుల్లో ఎంతో ఉపయోగకరమవుతాయి. నష్టపోయిన దాంట్లో అత్యధిక శాతం బీమా కంపెనీ నుంచి తిరిగి పొందవచ్చు. అంతేకాకుండా విపత్తు సమయాల్లో బీమా కంపెనీలు పాలసీ క్లెయిమ్‌ పరిష్కారాల నిబంధనలను కొంత వరకు సడలిస్తుంటాయి. గరిష్ఠంగా మూడు వారాల్లోపు దెబ్బతిన్న వాహనం వివరాలతో బీమా కంపెనీకి క్లెయిమ్‌ చేయగలిగితే పరిహారం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.

థర్డ్‌ పార్టీ బీమా అయితే : థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌లో ఎలాంటి పరిహారమూ రాదు. ఇందులో వ్యక్తిగత ప్రమాద బీమాను కలిపి తీసుకుని ఉంటే మాత్రం ఇలాంటి వరదల సమయంలో కారుతో సహా కొట్టుకుపోతే తర్వాత కారును గుర్తించి, అందులోని మనిషి చనిపోయినట్టుగా నిర్ధారించాలి. అప్పుడు ఆ మృతుని కుటుంబానికి రూ.15 లక్షల వరకు పరిహారం అందే అవకాశం ఉంటుంది.

వరదలో వాహనం కొట్టుకుపోతే : వాహనం వరదలో కొట్టుకుపోయినట్లుగా కచ్చితంగా స్థానిక పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించాలి. ఎఫ్‌ఐఆర్‌ పత్రం లేకుండా క్లెయిమ్‌ చేయలేరు. ఈ పరిస్థితుల్లో ఉంటే తొందరపడండి. మీ వాహనానికి సంబంధించిన సమగ్ర వాహన బీమాకు మూడు/నాలుగు రోజుల్లో గడువు ముగుస్తుంటే దాన్ని సత్వరమే ఆన్‌లైన్‌లో రెన్యువల్‌ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని కంపెనీలు పాలసీ గడువు ముగిస్తే క్లెయిమ్‌ పరిష్కారానికి అంగీకరించకపోవచ్చునని
నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బైక్ ఇంజన్​లో బురద- వరద కథల్లో ఇదో వ్యథ - Massive Damage to Two Wheelers

క్లెయిమ్‌ ఎలా? డాక్యుమెంట్ల సమస్య ఉంటుందా? : పాలసీదారుడే నేరుగా సంబంధిత బీమా కంపెనీని ఫోన్‌ ద్వారా లేదా ఆ కంపెనీ ఆథరైజ్డ్‌ సేవా కేంద్రం ద్వారా సంప్రదించాలి.

  • వాహనం ఎక్కడెక్కడ ఎంత డ్యామేజ్‌ అయిందో చూపేలా ఫొటో, వీడియో చేసి ఆ డాక్యుమెంట్‌ను కంపెనీకి సమర్పించాల్సి ఉంటుంది.
  • వాహన నష్టంపై ప్రాథమికంగా ఒక అంచనా వేయాలి.
  • డోర్లు తెరిచి ఉంచాలి
  • ఇతర విభాగాలను పరిశీలించే ముందు బ్యాటరీని డిస్‌కనెక్ట్‌ చేయాలి.
  • బీమా కంపెనీకి సంబంధించి సమీపంలోని ఆథరైజ్డ్‌ గ్యారేజీకి వాహనాన్ని టోయింగ్‌తోనే తీసుకువెళ్లాల్సి ఉంటుంది.
  • బలవంతంగా ఇంజిన్‌ ఆన్‌ చేసే ప్రయత్నం చేయకూడదు.

ఆ ప్రయత్నంలో వరద నీరు ఇంజిన్‌లోకి వెళ్లి పిస్టన్‌ దెబ్బతిని ఇంజిన్‌ సీజ్‌ అవుతుంది. అలా జరిగితే పాలసీదారుడి బాధ్యతారాహిత్యంగా భావించి క్లెయిమ్‌ పరిష్కారానికి కంపెనీ మొగ్గు చూపకపోయే అవకాశం ఉంటుందని బీమా రంగ నిపుణులు తెలిపారు.

కార్ల ఖర్చు 'తడిసి' మోపెడు - ఆందోళనలో వాహనదారులు - Cars Damage in Flood Disaster

క్లెయిమ్‌లను త్వరగా పరిష్కరించండి: కేంద్ర ప్రభుత్వం : వరదలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తీవ్రంగా సతమతమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వరంగ బీమా సంస్థలకు కేంద్రం పలు సూచనలు చేసింది. ప్రత్యేక శిబిరాలను నిర్వహించి క్లెయిమ్‌లకు త్వరితగతిన పరిష్కారాలను చూపాలని ఆదేశించింది. బీమా తీసుకున్నవారు సులువుగా సంప్రదించేందుకు వీలుగా నోడల్‌ అధికారుల పేర్లు, ఫోన్‌ నంబర్లను విస్తృతంగా ప్రచారం చేయాలని పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.