ETV Bharat / briefs

ఇంజినీరింగ్​ అధికారులపై మంత్రి అనిల్​ ఆగ్రహం

నెల్లూరులో ఉన్న నక్లెస్​ రోడ్డు, ఇరుకళల పరమేశ్వరీ ఘాట్​ నిర్మాణ పనులను నీటి పారుదల శాఖ మంత్రి అనిల్​ కుమార్​ యాదవ్​ పరిశీలించారు.

author img

By

Published : Jun 28, 2019, 6:52 AM IST

ఇంజినీరింగ్​ అధికారులపై మంత్రి అనిల్​ ఆగ్రహం

నెల్లూరులో నిర్మాణం దిశగా ఉన్న నక్లెస్ రోడ్డు, ఇరుకళల పరమేశ్వరీ ఘాట్ నిర్మాణ పనుల్లో జరిగిన అక్రమాలపై ఇంజనీరింగ్ అధికారులతో విచారణ జరిపిస్తామని నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. స్వర్ణాల చెరువుపై నిర్మించిన నక్లెస్ రోడ్డు కాంక్రీట్ బీటలను తదితర పనులను పరిశీలించి ఇంజనీరింగ్ అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులు చెల్లించేదిలేదని, గుత్తేదారు, అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిక చేశారు. నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. మంత్రి వెంట ఉన్నారు.

ఇంజినీరింగ్​ అధికారులపై మంత్రి అనిల్​ ఆగ్రహం

నెల్లూరులో నిర్మాణం దిశగా ఉన్న నక్లెస్ రోడ్డు, ఇరుకళల పరమేశ్వరీ ఘాట్ నిర్మాణ పనుల్లో జరిగిన అక్రమాలపై ఇంజనీరింగ్ అధికారులతో విచారణ జరిపిస్తామని నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. స్వర్ణాల చెరువుపై నిర్మించిన నక్లెస్ రోడ్డు కాంక్రీట్ బీటలను తదితర పనులను పరిశీలించి ఇంజనీరింగ్ అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులు చెల్లించేదిలేదని, గుత్తేదారు, అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిక చేశారు. నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. మంత్రి వెంట ఉన్నారు.

ఇంజినీరింగ్​ అధికారులపై మంత్రి అనిల్​ ఆగ్రహం

ఇదీ చదవండీ :

తెదేపాలోనే ఉంటా... చంద్రబాబుతోనే నడుస్తా'

Intro:ముగిసిన వెంగమాంబ బ్రహ్మోత్సవాలు...
ఉత్సాహంగా సాగిన ఎడ్ల బండలాగుడు పోటీలు


Body:దుత్తలూరు మండలం నర్రవాడ లో ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన శ్రీ రంగమ్మ పేరంటాలమ్మ బ్రహ్మోత్సవాలు గురువారంతో ముగిసాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో భక్తులు బారులు తీరి కనిపించారు. ఆలయ ప్రాంగణంలో లో మహిళలు పొంగలి వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన ఎడ్ల బండలాగుడు పోటీలు ఉత్సాహంగా జరిగాయి. పోటీలో ఐదు జతల ఎడ్లు పాల్గొనగా కృష్ణాజిల్లా గన్నవరం కు చెందిన కాసరనేని పావన చౌదరి ఎడ్ల జత 1542.2 అడుగులు బండ లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. కడప జిల్లా ఆనువారి పల్లి కి చెందిన శీలం జగన్మోహన్ రెడ్డి ఎడ్ల జత1307 అడుగులు లాగి ద్వితీయ స్థానంలో నిలిచాయి. కృష్ణాజిల్లా గన్నవరం కు చెందిన కాసరనేని నయన చౌదరి ఎడ్ల జత1183.3 అడుగులు బండ లాగి తృతీయ స్థానంలో నిలిచాయి. ఆరో చైర్మన్ కరుణాకర్ బాబు, ధర్మకర్తలు, దేవాదాయ శాఖ అధికారులు విజేత ఎడ్ల జత లకు ప్రథమ బహుమతి కింద రూ.80 వేలు, ద్వితీయ బహుమతి రూ.55 వేలు, తృతీయ బహుమతి రూ.40 అందజేశారు.


Conclusion:ముగిసిన వెంగమాంబ బ్రహ్మోత్సవాలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.