ETV Bharat / briefs

నవ్యాంధ్ర ఎన్నికల పోలింగ్ పరిసమాప్తి

రాష్ట్రవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

author img

By

Published : Apr 11, 2019, 6:00 PM IST

vote

రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. 46 వేల 120 ఓటింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించారు. ఎన్నికల సంఘం ముందే చెప్పిన ప్రకారం.. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్​లో ఉన్న అందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 7 గంటలకే పోలింగ్ మొదలైనా... రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎంల మొరాయింపు ఓటర్ల సహనానికి పరీక్ష పెట్టింది. సాంకేతిక సిబ్బంది సమస్య పరిష్కరించేసరికి దాదాపు 2 గంటల పోలింగ్ సమయం వృథా అయ్యింది. పోలింగ్ సమయాన్ని పెంచాలని కొందరు ఈసీని కోరినా... ఉన్నతాధికారులు అంగీకరించలేదు. చివరికి.. సాయంత్రం 6 గంటలకు ఎంతమంది క్యూలైన్​లో ఉన్నా.. ఓటు వేసే అవకాశం మాత్రం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు.. మధ్యాహ్నం 3 గంటల సమయానికి 54 శాతం దాటిన పోలింగ్.. ప్రక్రియ పూర్తయ్యే సరికి 65 శాతం నుంచి 70 శాతం మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. 46 వేల 120 ఓటింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించారు. ఎన్నికల సంఘం ముందే చెప్పిన ప్రకారం.. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్​లో ఉన్న అందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 7 గంటలకే పోలింగ్ మొదలైనా... రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎంల మొరాయింపు ఓటర్ల సహనానికి పరీక్ష పెట్టింది. సాంకేతిక సిబ్బంది సమస్య పరిష్కరించేసరికి దాదాపు 2 గంటల పోలింగ్ సమయం వృథా అయ్యింది. పోలింగ్ సమయాన్ని పెంచాలని కొందరు ఈసీని కోరినా... ఉన్నతాధికారులు అంగీకరించలేదు. చివరికి.. సాయంత్రం 6 గంటలకు ఎంతమంది క్యూలైన్​లో ఉన్నా.. ఓటు వేసే అవకాశం మాత్రం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు.. మధ్యాహ్నం 3 గంటల సమయానికి 54 శాతం దాటిన పోలింగ్.. ప్రక్రియ పూర్తయ్యే సరికి 65 శాతం నుంచి 70 శాతం మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.