ETV Bharat / state

శ్రీశైలం దుర్ఘటనలో 9మంది మృతి... ప్రమాదంపై సీఐడీ విచారణ

author img

By

Published : Aug 21, 2020, 1:54 PM IST

Updated : Aug 21, 2020, 7:38 PM IST

శ్రీశైలం దుర్ఘటనలో 9మంది మృతి... ప్రమాదంపై సీఐడీ విచారణ
శ్రీశైలం దుర్ఘటనలో 9మంది మృతి... ప్రమాదంపై సీఐడీ విచారణ

13:50 August 21

మృతుల కుటుంబాలకు పరిహారం- ప్రభుత్వ ఉద్యోగం

శ్రీశైలం దుర్ఘటనలో 9మంది మృతి... ప్రమాదంపై సీఐడీ విచారణ

       తెలుగు రాష్ట్రాలకు జలవిద్యుత్‌లో కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టులో చోటుచేసుకున్న ప్రమాదం విషాదాంతమైంది. గురువారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 9 మంది మృతిచెందారు. మంటలు త్వరగానే ఆర్పినా.. దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక చనిపోయారు. సహాయక సిబ్బంది.. వారి ప్రాణాలు కాపాడేందుకు తుదికంటూ ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. 21 మంది సొరంగమార్గం ద్వారా బయపడి ప్రాణాలు దక్కించుకున్నారు. సమచారం తెలియగానే ఘటనాస్థలికి చేరుకున్న తెలంగాణ విద్యుత్​శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌ దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించారు..

తెలుగు రాష్ట్రాల విద్యుత్ అవసరాలు తీర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న శ్రీశైలం ప్రాజెక్టులో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం.. 9 మంది సిబ్బందిని కబళించింది. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ విద్యుత్ కేంద్రం నాలుగో యూనిట్‌లో గరువారం రాత్రి పదిన్నర గంటలకు.. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్యానల్ బోర్డు నుంచి ఎగిసిపడుతున్న నిప్పురవ్వలను చూసి ఉద్యోగులు భయభ్రాంతులకు గురయ్యారు. మంటలు ఆర్పేందుకు శాయశక్తుల కృషి చేశారు. కానీ.. అవి కొంచెం కొంచెంగా వ్యాపించాయి. పొగలు మాత్రం దట్టగా అలముకున్నాయి. ఆ షిప్టులో 30మంది పనిచేస్తుండగా.. 21 మంది సొరంగ మార్గం ద్వారా బయటపడి ప్రాణాలు దక్కించుకున్నారు. దట్టంగా అలుముకున్న పొగల వల్ల 9 మంది ఊపిరాడక దుర్మరణం చెందారు. 

చనిపోయినవారిలో డీఈ శ్రీనివాస్‌, ఏఈలు వెంకట్‌రావు, మోహన్‌కుమార్‌, ఉజ్మ ఫాతిమా, సుందర్‌, జూనియర్‌ ప్లాంట్‌ అటెండెంట్‌ కిరణ్‌, బ్యాటరీ కంపెనీ సిబ్బంది వినేశ్‌, మహేశ్‌, పీఏ రాంబాబుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. విగత జీవులుగా మారిన తమవారిని చూసి గుండెలవిసేలా ఏడ్చారు.

మంటలు గమనించి విద్యుత్ ఉత్పత్తి నిలిపేయడం వల్ల పెనుప్రమాదం తప్పిందని ఇంజనీరింగ్ నిపుణులు అంచనావేస్తున్నారు. తొలుత ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు.. యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు కొనసాగించారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌ రావు ఘటనాస్థలికి హుటాహుటిన చేరుకుని అక్కడి పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు. ఎన్​డీఆర్​ఎఫ్​, సింగరేణి, అగ్నిమాపక సిబ్బంది వారిని కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేసినా.. దురదృష్టవశాత్తు ఫలించలేదు. 

క్షతగాత్రులకు ఈగలపెంట జెన్‌కో ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. తీవ్రంగా గాయపడ్డ ముగ్గురిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. బాధితులను ఎమ్మెల్యే  గువ్వల బాలరాజు, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు పరామర్శించారు. ప్రభుత్వపరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారి నిరంతరాయంగా విద్యుదుత్పత్తి కొనసాగిస్తున్న సమయంలోనే.. ప్లాంట్‌లో ప్రమాదం చోటుచేసుకోవడం కలకలం రేపింది.

ఇదీ చూడండి..

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రానికి 'స్వచ్ఛ కిరీటాలు'

13:50 August 21

మృతుల కుటుంబాలకు పరిహారం- ప్రభుత్వ ఉద్యోగం

శ్రీశైలం దుర్ఘటనలో 9మంది మృతి... ప్రమాదంపై సీఐడీ విచారణ

       తెలుగు రాష్ట్రాలకు జలవిద్యుత్‌లో కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టులో చోటుచేసుకున్న ప్రమాదం విషాదాంతమైంది. గురువారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 9 మంది మృతిచెందారు. మంటలు త్వరగానే ఆర్పినా.. దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక చనిపోయారు. సహాయక సిబ్బంది.. వారి ప్రాణాలు కాపాడేందుకు తుదికంటూ ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. 21 మంది సొరంగమార్గం ద్వారా బయపడి ప్రాణాలు దక్కించుకున్నారు. సమచారం తెలియగానే ఘటనాస్థలికి చేరుకున్న తెలంగాణ విద్యుత్​శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌ దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించారు..

తెలుగు రాష్ట్రాల విద్యుత్ అవసరాలు తీర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న శ్రీశైలం ప్రాజెక్టులో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం.. 9 మంది సిబ్బందిని కబళించింది. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ విద్యుత్ కేంద్రం నాలుగో యూనిట్‌లో గరువారం రాత్రి పదిన్నర గంటలకు.. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్యానల్ బోర్డు నుంచి ఎగిసిపడుతున్న నిప్పురవ్వలను చూసి ఉద్యోగులు భయభ్రాంతులకు గురయ్యారు. మంటలు ఆర్పేందుకు శాయశక్తుల కృషి చేశారు. కానీ.. అవి కొంచెం కొంచెంగా వ్యాపించాయి. పొగలు మాత్రం దట్టగా అలముకున్నాయి. ఆ షిప్టులో 30మంది పనిచేస్తుండగా.. 21 మంది సొరంగ మార్గం ద్వారా బయటపడి ప్రాణాలు దక్కించుకున్నారు. దట్టంగా అలుముకున్న పొగల వల్ల 9 మంది ఊపిరాడక దుర్మరణం చెందారు. 

చనిపోయినవారిలో డీఈ శ్రీనివాస్‌, ఏఈలు వెంకట్‌రావు, మోహన్‌కుమార్‌, ఉజ్మ ఫాతిమా, సుందర్‌, జూనియర్‌ ప్లాంట్‌ అటెండెంట్‌ కిరణ్‌, బ్యాటరీ కంపెనీ సిబ్బంది వినేశ్‌, మహేశ్‌, పీఏ రాంబాబుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. విగత జీవులుగా మారిన తమవారిని చూసి గుండెలవిసేలా ఏడ్చారు.

మంటలు గమనించి విద్యుత్ ఉత్పత్తి నిలిపేయడం వల్ల పెనుప్రమాదం తప్పిందని ఇంజనీరింగ్ నిపుణులు అంచనావేస్తున్నారు. తొలుత ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు.. యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు కొనసాగించారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌ రావు ఘటనాస్థలికి హుటాహుటిన చేరుకుని అక్కడి పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు. ఎన్​డీఆర్​ఎఫ్​, సింగరేణి, అగ్నిమాపక సిబ్బంది వారిని కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేసినా.. దురదృష్టవశాత్తు ఫలించలేదు. 

క్షతగాత్రులకు ఈగలపెంట జెన్‌కో ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. తీవ్రంగా గాయపడ్డ ముగ్గురిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. బాధితులను ఎమ్మెల్యే  గువ్వల బాలరాజు, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు పరామర్శించారు. ప్రభుత్వపరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారి నిరంతరాయంగా విద్యుదుత్పత్తి కొనసాగిస్తున్న సమయంలోనే.. ప్లాంట్‌లో ప్రమాదం చోటుచేసుకోవడం కలకలం రేపింది.

ఇదీ చూడండి..

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రానికి 'స్వచ్ఛ కిరీటాలు'

Last Updated : Aug 21, 2020, 7:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.