ETV Bharat / bharat

12 రోజుల్లో 263 కోట్ల పదాలు.. స్కూల్ విద్యార్థుల రికార్డ్!

author img

By

Published : Jun 14, 2022, 1:32 PM IST

Read along Tamil Nadu: తమిళనాడు విద్యార్థులు రికార్డు సృష్టించారు. 12రోజుల వ్యవధిలో 263 కోట్ల పదాలను చదివేశారు. పఠన సామర్థ్యాలను మెరుగుపర్చడం కోసం తమిళనాడు విద్యాశాఖ రూపొందించిన కార్యక్రమంలో 18.36లక్షల మంది భాగమై.. ఈ రికార్డులో భాగస్వామ్యమయ్యారు.

tamil nadu illam thedi kalvi
tamil nadu illam thedi kalvi

Tamil Nadu education at doorsteps: గూగుల్ రూపొందించిన రీడ్ అలాంగ్ యాప్ సాయంతో తమిళనాడు విద్యార్థులు రికార్డు సృష్టించారు. 18.36 లక్షల మంది విద్యార్థులు 12 రోజుల వ్యవధిలో 263 కోట్ల పదాలను చదివి ఈ ఘనత సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇళ్లం తేడి కల్వి(ఇంట్లోనే విద్య) అనే పథకంలో భాగంగా విద్యార్థుల్లో పఠన సామర్థ్యాలు మెరుగుపర్చేందుకు జూన్ 1నుంచి ఈ కార్యక్రమం చేపట్టారు. తమిళనాడు పాఠశాల విద్యాశాఖ, గూగుల్ రీడ్ అలాంగ్ యాప్ సమన్వయంతో భారీ స్థాయిలో దీన్ని నిర్వహించారు.

Students From Tamil Nadu Create record in Google Read along
రీడ్ అలాంగ్ యాప్ సాయంతో చదువుతున్న విద్యార్థి

Tamil Nadu reading marathon: 'రీడింగ్ మారథాన్' పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా.. గూగుల్ యాప్​ను ఉపయోగించి విద్యార్థుల ద్వారా కథలు చదివించారు అధికారులు. ఆంగ్లం, తమిళ భాషల్లో విద్యార్థులు చదువుకునే సౌలభ్యం ఈ యాప్​లో ఉందని అధికారులు తెలిపారు. విద్యార్థుల వయసును బట్టి.. పదాల సంఖ్యలో తేడా ఉంటుందని వెల్లడించారు.

Students From Tamil Nadu Create record in Google Read along
రీడ్ అలాంగ్ యాప్​లో చదువుతున్న విద్యార్థి

ఈ డిజిటల్ కార్యక్రమంలో భాగంగా 1.8 లక్షల ఇళ్లం తేడి కల్వి సెంటర్లను తమిళనాడు విద్యాశాఖ ఏర్పాటు చేసింది. జూన్ 1 నుంచి 12 మధ్య 18.36 లక్షల మంది విద్యార్థులు ఇందులో పాలు పంచుకున్నారు. ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రొఫైల్​ను వలంటీర్లు క్రియేట్ చేశారు. మొత్తంగా శనివారం నాటికి ఈ యాప్​లో 263 కోట్ల పదాలను విద్యార్థులు చదివేశారు. జిల్లాలవారీగా పరిశీలిస్తే తిరుచినాపల్లికి చెందిన విద్యార్థులు అత్యధికంగా 62.82 లక్షల పదాలు చదివారు. మధురైలోని అలంగనల్లూర్ 49.19 లక్షల పదాలతో రెండో స్థానంలో ఉంది. మధురై జిల్లాలోని మేలూర్ ప్రాంత విద్యార్థులు 41.72 లక్షల పదాలు చదివి మూడోస్థానంలో నిలిచారు.

Students From Tamil Nadu Create record in Google Read along
ఫోన్​లో పదాలు చదువుతున్న విద్యార్థులు

పిల్లలు సరదాగా చదువుకునేలా రీడ్ అలాంగ్ యాప్​ను గూగుల్ రూపొందించింది. పిల్లలు పలికే పదాలను ఇది గుర్తించి.. మరిన్ని పదాలు నేర్చుకునేలా సాయం చేస్తుంది. సరైన పదాలు చెప్పినప్పుడు ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల పఠన సామర్థ్యాలను పెంచేందుకు తమిళనాడు సర్కారు.. గూగుల్​ యాప్ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టింది.

ఇదీ చదవండి:

Tamil Nadu education at doorsteps: గూగుల్ రూపొందించిన రీడ్ అలాంగ్ యాప్ సాయంతో తమిళనాడు విద్యార్థులు రికార్డు సృష్టించారు. 18.36 లక్షల మంది విద్యార్థులు 12 రోజుల వ్యవధిలో 263 కోట్ల పదాలను చదివి ఈ ఘనత సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇళ్లం తేడి కల్వి(ఇంట్లోనే విద్య) అనే పథకంలో భాగంగా విద్యార్థుల్లో పఠన సామర్థ్యాలు మెరుగుపర్చేందుకు జూన్ 1నుంచి ఈ కార్యక్రమం చేపట్టారు. తమిళనాడు పాఠశాల విద్యాశాఖ, గూగుల్ రీడ్ అలాంగ్ యాప్ సమన్వయంతో భారీ స్థాయిలో దీన్ని నిర్వహించారు.

Students From Tamil Nadu Create record in Google Read along
రీడ్ అలాంగ్ యాప్ సాయంతో చదువుతున్న విద్యార్థి

Tamil Nadu reading marathon: 'రీడింగ్ మారథాన్' పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా.. గూగుల్ యాప్​ను ఉపయోగించి విద్యార్థుల ద్వారా కథలు చదివించారు అధికారులు. ఆంగ్లం, తమిళ భాషల్లో విద్యార్థులు చదువుకునే సౌలభ్యం ఈ యాప్​లో ఉందని అధికారులు తెలిపారు. విద్యార్థుల వయసును బట్టి.. పదాల సంఖ్యలో తేడా ఉంటుందని వెల్లడించారు.

Students From Tamil Nadu Create record in Google Read along
రీడ్ అలాంగ్ యాప్​లో చదువుతున్న విద్యార్థి

ఈ డిజిటల్ కార్యక్రమంలో భాగంగా 1.8 లక్షల ఇళ్లం తేడి కల్వి సెంటర్లను తమిళనాడు విద్యాశాఖ ఏర్పాటు చేసింది. జూన్ 1 నుంచి 12 మధ్య 18.36 లక్షల మంది విద్యార్థులు ఇందులో పాలు పంచుకున్నారు. ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రొఫైల్​ను వలంటీర్లు క్రియేట్ చేశారు. మొత్తంగా శనివారం నాటికి ఈ యాప్​లో 263 కోట్ల పదాలను విద్యార్థులు చదివేశారు. జిల్లాలవారీగా పరిశీలిస్తే తిరుచినాపల్లికి చెందిన విద్యార్థులు అత్యధికంగా 62.82 లక్షల పదాలు చదివారు. మధురైలోని అలంగనల్లూర్ 49.19 లక్షల పదాలతో రెండో స్థానంలో ఉంది. మధురై జిల్లాలోని మేలూర్ ప్రాంత విద్యార్థులు 41.72 లక్షల పదాలు చదివి మూడోస్థానంలో నిలిచారు.

Students From Tamil Nadu Create record in Google Read along
ఫోన్​లో పదాలు చదువుతున్న విద్యార్థులు

పిల్లలు సరదాగా చదువుకునేలా రీడ్ అలాంగ్ యాప్​ను గూగుల్ రూపొందించింది. పిల్లలు పలికే పదాలను ఇది గుర్తించి.. మరిన్ని పదాలు నేర్చుకునేలా సాయం చేస్తుంది. సరైన పదాలు చెప్పినప్పుడు ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల పఠన సామర్థ్యాలను పెంచేందుకు తమిళనాడు సర్కారు.. గూగుల్​ యాప్ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టింది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.