ETV Bharat / bharat

కమిషనర్​ ధర్నాలో కూర్చోవడంపై కేంద్రం చర్యలు...

author img

By

Published : Feb 5, 2019, 6:29 PM IST

ధర్నాలో కూర్చుని అఖిల భారత సర్వీసు నిబంధనల్ని ఉల్లంఘించారని కోల్​కతా పోలీస్​ కమిషనర్ రాజీవ్​కుమార్​పై చర్యలకు కేంద్రం ఆదేశాలు

కోల్​కతా కమిషనర్​పై కేంద్ర హోంశాఖ చర్యలు

కోల్​కతా పోలీస్​ కమిషనర్​ రాజీవ్ కుమార్​పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ పశ్చిమ బంగ ప్రభుత్వానికి సూచించింది. ధర్నాలో కూర్చుని అఖిల భారత సర్వీసు నిబంధనల్ని ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకోవాలని పేర్కొంది. పశ్చిమ బంగ ప్రధాన కార్యదర్శి పేరిట ఈ ఆదేశాల్ని విడుదల చేశారు.

రాజీవ్​ కుమార్ సహా పలువురు పోలీసులు ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు ధర్నాలో కూర్చోవడం తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ.

గవర్నర్ నివేదికతోనే చర్యలు..

సీబీఐ వ్యవహారంపై కోల్​కతాలో ఆదివారం రాత్రి నుంచి జరుగుతోన్న వరుస పరిణామాలపై గవర్నర్​ కేసరినాథ్ త్రిపాఠి కేంద్ర హోంమంత్రిత్వశాఖకు (రాజ్​నాథ్​ సింగ్)​కు సమగ్ర నివేదిక సమర్పించారు.

ఇంతకీ ఏం జరిగిందంటే..

శారదా కుంభకోణం విషయంలో కోల్​కతా పోలీస్​ కమిషనర్ రాజీవ్​కుమార్​ను ప్రశ్నించడానికి వెళ్లిన సీబీఐ అధికారులను నిర్బంధించడంతో వివాదం మొదలైంది. కోల్​కతా పోలీసులకు అండగా నిలిచి మమత బెనర్జీ సత్యాగ్రహం చేపట్టారు. పశ్చిమ బంగను నాశనం చేయడానికి మోదీ-షా ద్వయం కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.

సీబీఐ అధికారులకు ముప్పు ఉందనే సమాచారంతో వారి భద్రత కోసం కేంద్ర రిజర్వ్​ దళాలను కోల్​కతాకు పంపారు.

ఎవరీ రాజీవ్​కుమార్​..

1989 ఐపీఎస్​ బ్యాచ్​కు చెందిన రాజీవ్​కుమార్​ శారదాకేసును దర్యాప్తు చేశారు. అయితే ఆ కేసుకు సంబంధించిన నివేదికలు, దస్త్రాలు సీబీఐకి అప్పగించకుండా అతను దాస్తున్నట్లు సీబీఐ ఆరోపించింది. అదే విధంగా ఎన్నికల సన్నద్ధత ఏర్పాట్లను పరిశీలిస్తోన్న కేంద్ర ఎన్నికల సంఘం సమావేశానికీ హాజరుకాలేదని అతనిపై ఆరోపణలున్నాయి.

undefined

కోల్​కతా పోలీస్​ కమిషనర్​ రాజీవ్ కుమార్​పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ పశ్చిమ బంగ ప్రభుత్వానికి సూచించింది. ధర్నాలో కూర్చుని అఖిల భారత సర్వీసు నిబంధనల్ని ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకోవాలని పేర్కొంది. పశ్చిమ బంగ ప్రధాన కార్యదర్శి పేరిట ఈ ఆదేశాల్ని విడుదల చేశారు.

రాజీవ్​ కుమార్ సహా పలువురు పోలీసులు ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు ధర్నాలో కూర్చోవడం తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ.

గవర్నర్ నివేదికతోనే చర్యలు..

సీబీఐ వ్యవహారంపై కోల్​కతాలో ఆదివారం రాత్రి నుంచి జరుగుతోన్న వరుస పరిణామాలపై గవర్నర్​ కేసరినాథ్ త్రిపాఠి కేంద్ర హోంమంత్రిత్వశాఖకు (రాజ్​నాథ్​ సింగ్)​కు సమగ్ర నివేదిక సమర్పించారు.

ఇంతకీ ఏం జరిగిందంటే..

శారదా కుంభకోణం విషయంలో కోల్​కతా పోలీస్​ కమిషనర్ రాజీవ్​కుమార్​ను ప్రశ్నించడానికి వెళ్లిన సీబీఐ అధికారులను నిర్బంధించడంతో వివాదం మొదలైంది. కోల్​కతా పోలీసులకు అండగా నిలిచి మమత బెనర్జీ సత్యాగ్రహం చేపట్టారు. పశ్చిమ బంగను నాశనం చేయడానికి మోదీ-షా ద్వయం కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.

సీబీఐ అధికారులకు ముప్పు ఉందనే సమాచారంతో వారి భద్రత కోసం కేంద్ర రిజర్వ్​ దళాలను కోల్​కతాకు పంపారు.

ఎవరీ రాజీవ్​కుమార్​..

1989 ఐపీఎస్​ బ్యాచ్​కు చెందిన రాజీవ్​కుమార్​ శారదాకేసును దర్యాప్తు చేశారు. అయితే ఆ కేసుకు సంబంధించిన నివేదికలు, దస్త్రాలు సీబీఐకి అప్పగించకుండా అతను దాస్తున్నట్లు సీబీఐ ఆరోపించింది. అదే విధంగా ఎన్నికల సన్నద్ధత ఏర్పాట్లను పరిశీలిస్తోన్న కేంద్ర ఎన్నికల సంఘం సమావేశానికీ హాజరుకాలేదని అతనిపై ఆరోపణలున్నాయి.

undefined

New Delhi, Feb 05 (ANI): The name plate of the newly appointed Congress General Secretary for Uttar Pradesh (East) Priyanka Gandhi Vadra was put up on Tuesday outside the room allotted to her at New Delhi's Congress headquarters. Priyanka Gandhi is expected to present at a meeting of All India Congress Committee (AICC) general secretaries and in-charge of various states. The meeting called in national capital on Thursday to plan the strategy of upcoming Lok Sabha elections. Priyanka Gandhi Vadra has been appointed as Congress General Secretary for UP East last month.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.