ETV Bharat / bharat

సరిహద్దు వివాదాలపై అసోం, మేఘాలయ కీలక నిర్ణయం

author img

By

Published : Aug 6, 2021, 4:50 PM IST

సరిహద్దు సమస్యల పరిష్కారం కోసం కమిటీలను ఏర్పాటు చేయాలని అసోం, మేఘాలయ రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. కేబినెట్​ మంత్రుల నేతృత్వంలోని ఈ కమిటీలు.. వివాదాలను పరిష్కరించే లక్ష్యంతో పని చేస్తాయని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలిపారు.

Assam, Meghalaya border issues
అసోం, మేఘాలయా సరిహద్దు సమస్యలు

అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదాలకు ముగింపు పలికే దిశగా అసోం, మేఘాలయ కీలక నిర్ణయం తీసుకున్నాయి. సరిహద్దు సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇరు రాష్ట్రాల ఆధ్వర్యంలో వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేస్తామని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్​ కె సంగ్మా శుక్రవారం తెలిపారు. ఈ కమిటీలకు ఆయా రాష్ట్రాలకు చెందిన కేబినెట్ ​మంత్రులు నేతృత్వం వహిస్తారని చెప్పారు. గువాహటిలో జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

ఐదుగురు సభ్యులతో..

ఈ కమిటీలు.. అసోం, మేఘాలయ మధ్య నెలకొన్న 12 వివాదాస్పద ప్రాంతాల్లో.. తొలుత ఆరింటి సమస్యను పరిష్కరించే లక్ష్యంతో పని చేస్తాయని విలేకరుల సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెల్లడించారు. ఈ కమిటీల్లోని ప్రతి ప్యానెల్​లో ఓ కేబినెట్​ మంత్రి సహా బ్యూరోక్రాట్లతో కలిపి మొత్తం ఐదుగురు సభ్యులు ఉంటారని హిమంత బిశ్వశర్మ తెలిపారు. ఇందులో స్థానిక ప్రతినిధులు కూడా ఉండొచ్చని చెప్పారు.

"ఈ కమిటీల్లోని సభ్యులు.. వివాదాస్పద ప్రాంతాలను సందర్శిస్తారు. అక్కడి పౌరులతో మాట్లాడుతారు. ఈ చర్చలను 30 రోజ్లులోగా పూర్తి చేస్తారు. చారిత్రక సాక్ష్యాధారాలు, సంప్రదాయాలు, పాలనావ్యవహారాలు, ప్రజల మనోభావాలు, ప్రాంతీయత అనే ఐదు అంశాల ఆధారంగా.. వివాదాలను పరిష్కరించేందుకు ఈ కమిటీలు ప్రయత్నిస్తాయి."

-కాన్రాడ్​ కె సంగ్మా, మేఘాలయ ముఖ్యమంత్రి

తారాబారి, గిజాంగ్​, ఫాలియా, బక్లపారా, పిలింగ్​కాటా, ఖానాపురు అనే ఆరు ప్రాంతాల్లో తొలుత ఈ కమిటీలు వివాదాలను పరిష్కరించనున్నాయి. ఈ ప్రాంతాలు అసోం, మేఘాలయ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల పరిధిలో ఉన్నాయి.

ఇదీ చూడండి: అసోం, మిజోరం చర్చలు- వివాదం సద్దుమణిగేనా?

ఇదీ చూడండి: అసోం-నాగాలాండ్​ మధ్య ఫలించిన శాంతి చర్చలు

అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదాలకు ముగింపు పలికే దిశగా అసోం, మేఘాలయ కీలక నిర్ణయం తీసుకున్నాయి. సరిహద్దు సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇరు రాష్ట్రాల ఆధ్వర్యంలో వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేస్తామని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్​ కె సంగ్మా శుక్రవారం తెలిపారు. ఈ కమిటీలకు ఆయా రాష్ట్రాలకు చెందిన కేబినెట్ ​మంత్రులు నేతృత్వం వహిస్తారని చెప్పారు. గువాహటిలో జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

ఐదుగురు సభ్యులతో..

ఈ కమిటీలు.. అసోం, మేఘాలయ మధ్య నెలకొన్న 12 వివాదాస్పద ప్రాంతాల్లో.. తొలుత ఆరింటి సమస్యను పరిష్కరించే లక్ష్యంతో పని చేస్తాయని విలేకరుల సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెల్లడించారు. ఈ కమిటీల్లోని ప్రతి ప్యానెల్​లో ఓ కేబినెట్​ మంత్రి సహా బ్యూరోక్రాట్లతో కలిపి మొత్తం ఐదుగురు సభ్యులు ఉంటారని హిమంత బిశ్వశర్మ తెలిపారు. ఇందులో స్థానిక ప్రతినిధులు కూడా ఉండొచ్చని చెప్పారు.

"ఈ కమిటీల్లోని సభ్యులు.. వివాదాస్పద ప్రాంతాలను సందర్శిస్తారు. అక్కడి పౌరులతో మాట్లాడుతారు. ఈ చర్చలను 30 రోజ్లులోగా పూర్తి చేస్తారు. చారిత్రక సాక్ష్యాధారాలు, సంప్రదాయాలు, పాలనావ్యవహారాలు, ప్రజల మనోభావాలు, ప్రాంతీయత అనే ఐదు అంశాల ఆధారంగా.. వివాదాలను పరిష్కరించేందుకు ఈ కమిటీలు ప్రయత్నిస్తాయి."

-కాన్రాడ్​ కె సంగ్మా, మేఘాలయ ముఖ్యమంత్రి

తారాబారి, గిజాంగ్​, ఫాలియా, బక్లపారా, పిలింగ్​కాటా, ఖానాపురు అనే ఆరు ప్రాంతాల్లో తొలుత ఈ కమిటీలు వివాదాలను పరిష్కరించనున్నాయి. ఈ ప్రాంతాలు అసోం, మేఘాలయ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల పరిధిలో ఉన్నాయి.

ఇదీ చూడండి: అసోం, మిజోరం చర్చలు- వివాదం సద్దుమణిగేనా?

ఇదీ చూడండి: అసోం-నాగాలాండ్​ మధ్య ఫలించిన శాంతి చర్చలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.