Woman Abducted a Four Day Baby In Warangal : నాలుగు రోజుల పసికందును అపహరించిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే మంచిర్యాలకు చెందిన మహిళ వరంగల్ నగరంలోని ప్రభుత్వాసుపత్రిలో చేరింది. ఈ నెల 4వ తేదీన పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత మహిళకు ఫిడ్స్ రావడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. ఈ క్రమంలో వైద్యులు ఆమెకు మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
ఇదే అదనుగా భావించిన ఓ మహిళ గుట్టుచప్పుడు కాకుండా బాబును అపహరించింది. కుటుంబసభ్యులు వచ్చి చూసేసరికి బాబు కనిపించకపోయేసరికి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీ కెమెరాలు పరిశీలించారు. మహిళ హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. త్వరలోనే నిందితురాలిని పట్టుకుని బాబును తల్లి చెంతకు చేరుస్తామని తెలిపారు.