ETV Bharat / snippets

చెదిరిన ఆశలు- లారీ ఢీకొని ఇద్దరు బీటెక్​ విద్యార్థులు మృతి

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 6, 2024, 12:18 PM IST

Two Students Died in Rajahmundry Road Accident
Two Students Died in Rajahmundry Road Accident (ETV Bharat)

Two Students Died in Rajahmundry Road Accident : తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. గైట్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థులు బైక్​పై వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో దుర్మరణం చెందారు. మృతులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన రోనంకి ప్రవీణ్ కుమార్, పల్నాడు జిల్లాకు చెందిన చింతా కార్తీక్​గా పోలీసులు గుర్తించారు. రాజమండ్రి నుంచి దివాస్ చెరువుకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వెనుక నుంచి లారీ బలంగా ఢీ కొట్టడంతో విద్యార్థులు అక్కడిక్కడే మృతి చెందారు. శవపరీక్షల నిమిత్తం మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Two Students Died in Rajahmundry Road Accident : తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. గైట్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థులు బైక్​పై వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో దుర్మరణం చెందారు. మృతులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన రోనంకి ప్రవీణ్ కుమార్, పల్నాడు జిల్లాకు చెందిన చింతా కార్తీక్​గా పోలీసులు గుర్తించారు. రాజమండ్రి నుంచి దివాస్ చెరువుకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వెనుక నుంచి లారీ బలంగా ఢీ కొట్టడంతో విద్యార్థులు అక్కడిక్కడే మృతి చెందారు. శవపరీక్షల నిమిత్తం మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.