ETV Bharat / snippets

హోంగార్డును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు - అక్కడికక్కడే మృతి చెందిన సుబ్బరాజు

author img

By ETV Bharat Telangana Team

Published : 17 hours ago

HOME GUARD DIED IN ACCIDENT
BUS ACCIDENT IN METPALLI (ETV Bharat)

Accident in Jagityal Distrct : జగిత్యాల జిల్లా మెట్​పల్లి పట్టణ శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో హోంగార్డు సుబ్బరాజు మృతి చెందాడు. జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్​లో సుబ్బరాజు హోంగార్డుగా విధులు నిర్వహిస్తూ మెట్​పల్లిలో నివాసముంటున్నాడు. ఉదయం కుటుంబ సభ్యులకు టిఫిన్ తీసుకురావడం కోసం హోటల్​కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో నిజామాబాద్ నుంచి వరంగల్ వెళుతున్న ఆర్టీసీ బస్సు సుబ్బరాజు ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. దీంతో తలకు తీవ్ర గాయాలు అవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. దసరా పండుగకు ముందే ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, కేసు నమోదు చేశారు.

Accident in Jagityal Distrct : జగిత్యాల జిల్లా మెట్​పల్లి పట్టణ శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో హోంగార్డు సుబ్బరాజు మృతి చెందాడు. జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్​లో సుబ్బరాజు హోంగార్డుగా విధులు నిర్వహిస్తూ మెట్​పల్లిలో నివాసముంటున్నాడు. ఉదయం కుటుంబ సభ్యులకు టిఫిన్ తీసుకురావడం కోసం హోటల్​కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో నిజామాబాద్ నుంచి వరంగల్ వెళుతున్న ఆర్టీసీ బస్సు సుబ్బరాజు ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. దీంతో తలకు తీవ్ర గాయాలు అవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. దసరా పండుగకు ముందే ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, కేసు నమోదు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.