Arrest of MLA Raja singh Phone call Accused : గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను చంపేస్తామంటూ గతంలో బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది అక్టోబర్ నెలలో ఓ అఘాంతకుడు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు రాజాసింగ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అఘాంతకుడు ఫోన్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టగా హైదరాబాద్ చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన మహ్మద్ వసీం (40) దుబాయ్ నుంచి ఈ కాల్ చేసినట్లు గుర్తించారు.
అతడిపై ఐపీసీ 506, 507 సెక్షన్ లపై కేసు నమోదు చేసి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీంతో దుబాయ్ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిన నిందితుడిని ఇమ్మిగ్రేషన్ అధికారులు కస్టడీలోకి తీసుకొని సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతనిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.