Actress Jatwani Legal Notice To Sakshi Channel: తనతోపాటు కుటుంబసభ్యుల పరువుకు భంగం కలిగించే రీతిలో కథనాలు ప్రచురించి, ప్రసారం చేసినందుకు ‘సాక్షి’ మీడియాకు బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ లీగల్ నోటీసులు ఇచ్చారు. తన న్యాయవాది నర్రా శ్రీనివాసరావు ద్వారా ఆమె జగతి పబ్లికేషన్స్, సంపాదకులు వి. మురళి, సాక్షి న్యూస్ ఎడిటర్ పంతంగి రాంబాబు, వైఎస్సార్సీపీ నేత విద్యాసాగర్, యూట్యూబ్, సాక్షి, వైసీపీ ట్విటర్ ఛానల్కు నోటీసులు పంపించారు. సాక్షి మీడియాలో గత నెల31 నుంచి తన ప్రతిష్టను దిగజార్చేలా వరుస కథనాలు వచ్చాయని, అందుకు రూ.50 కోట్లు పరువు నష్టం, రూ.35 లక్షల న్యాయసంబంధ ఖర్చుల కింద చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో చట్ట ప్రకారం సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. యూట్యూబ్, ట్విటర్లో ఉన్న కథనాలు, చర్చల తాలూకు కంటెంట్ను తొలగించాలని ఆయా సామాజిక మాధ్యమాల ప్రతినిధులకు కూడా నోటీసులు ఇచ్చారు.
'సాక్షి' మీడియాకు బాలీవుడ్ నటి లీగల్ నోటీసులు - పరువుకు భంగం కలిగించారని ఫిర్యాదు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 7, 2024, 8:53 AM IST
Actress Jatwani Legal Notice To Sakshi Channel: తనతోపాటు కుటుంబసభ్యుల పరువుకు భంగం కలిగించే రీతిలో కథనాలు ప్రచురించి, ప్రసారం చేసినందుకు ‘సాక్షి’ మీడియాకు బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ లీగల్ నోటీసులు ఇచ్చారు. తన న్యాయవాది నర్రా శ్రీనివాసరావు ద్వారా ఆమె జగతి పబ్లికేషన్స్, సంపాదకులు వి. మురళి, సాక్షి న్యూస్ ఎడిటర్ పంతంగి రాంబాబు, వైఎస్సార్సీపీ నేత విద్యాసాగర్, యూట్యూబ్, సాక్షి, వైసీపీ ట్విటర్ ఛానల్కు నోటీసులు పంపించారు. సాక్షి మీడియాలో గత నెల31 నుంచి తన ప్రతిష్టను దిగజార్చేలా వరుస కథనాలు వచ్చాయని, అందుకు రూ.50 కోట్లు పరువు నష్టం, రూ.35 లక్షల న్యాయసంబంధ ఖర్చుల కింద చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో చట్ట ప్రకారం సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. యూట్యూబ్, ట్విటర్లో ఉన్న కథనాలు, చర్చల తాలూకు కంటెంట్ను తొలగించాలని ఆయా సామాజిక మాధ్యమాల ప్రతినిధులకు కూడా నోటీసులు ఇచ్చారు.